చల్లటి కాలక్షేపం..!

Eenadu icon
By Andhra Pradesh News Desk Updated : 29 Oct 2025 05:47 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

సాధారణంగా ఊళ్లలో అరుగులు, చెట్ల కింద గద్దెల మీద కూర్చొని స్నేహితులు, గ్రామస్థులు సంతోషాలు, బాధలు పంచుకుంటుంటారు. వర్తమాన వ్యవహారాలపై పిచ్చాపాటీ మాట్లాడుకుంటుంటారు. అయితే, పెద్దపల్లి జిల్లా మంథని వాసులు ఈ విషయంలో ప్రత్యేకంగా నిలుస్తున్నారు. ఇలాంటి గద్దెల సమీపంలో మర్రి, రావి మొక్కలు నాటి సంరక్షిస్తున్నారు. ఎండాకాలం వేడి గాలుల నుంచి రక్షణకు చెట్లకు ఫ్యాన్‌లను సైతం ఏర్పాటుచేసుకుని మరీ సేదతీరుతున్నారు. పట్టణంలోని మందాట వీధిలో మర్రిచెట్టుకు ఏర్పాటు చేసిన పంకాలను చిత్రంలో చూడొచ్చు.

న్యూస్‌టుడే, మంథని గ్రామీణం

Tags :
Published : 29 Oct 2025 05:25 IST

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు