ఆశా సమ్మెకు ప్రైవేటు వైద్యకళాశాలల మద్దతు

Eenadu icon
By Andhra Pradesh News Desk Published : 29 Oct 2025 06:19 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

నేటినుంచి ఎన్టీఆర్‌ వైద్యసేవలు నిలిపివేస్తామని ప్రకటన

ఈనాడు, అమరావతి: ప్రైవేటు వైద్య కళాశాలల్లో బుధవారం నుంచి ఎన్టీఆర్‌ వైద్యసేవలు నిలిపివేయాలని నిర్ణయించినట్లు ఆంధ్రప్రదేశ్‌ ప్రైవేటు మెడికల్‌ అండ్‌ డెంటల్‌ కాలేజెస్‌ మేనేజ్‌మెంట్స్‌ అసోసియేషన్‌ (ఏపీపీఎండీసీఎంఏ) ప్రకటించింది. బిల్లు బకాయిలు చెల్లించాలని ఈ నెల 10 నుంచి సమ్మె చేస్తున్న ఆంధ్రప్రదేశ్‌ స్పెషాలిటీ హాస్పిటల్స్‌ అసోసియేషన్‌ (ఆశా)కు మద్దతు తెలుపుతూ సమ్మెలో పాల్గొనాలని నిర్ణయించింది. ఈ మేరకు ఎన్టీఆర్‌ వైద్యసేవ ట్రస్ట్‌ సీఈవోకు మంగళవారం ఏపీపీఎండీసీఎంఏ సమ్మె నోటీసు ఇచ్చింది. నెట్‌వర్క్‌ ఆసుపత్రులకు ప్రభుత్వం బిల్లు బకాయిలు చెల్లించకపోతే బుధవారం నుంచి ప్రైవేటు వైద్యకళాశాలల అనుబంధ ఆసుపత్రుల్లోనూ సేవలు నిలిపివేస్తామని ఆ లేఖలో పేర్కొంది. ఆశా సమ్మె 18 రోజులుగా కొనసాగుతోంది. రాష్ట్రంలో 841 నెట్‌వర్క్‌ ఆసుపత్రులు ఉంటే.. 467 ఆసుపత్రులు సమ్మెలో పాల్గొంటున్నాయి. వీటిలో 174 ఆసుపత్రులు ఎన్టీఆర్‌ వైద్యసేవ ఓపీ నిలిపివేసి, అత్యవసర సేవలే అందిస్తుంటే.. 293 వైద్యశాలలు ఓపీ, అత్యవసర సేవలు అన్నింటినీ నిలిపివేశాయి. తాజాగా 18 ప్రైవేటు వైద్యకళాశాలల యాజమాన్యాలూ సమ్మెబాట పట్టాలని నిర్ణయించాయి. ప్రభుత్వం ఇటీవల ఎన్టీఆర్‌ వైద్యసేవ బకాయిలు రూ.250 కోట్లు విడుదల చేసింది. మరో రూ.250 కోట్లు త్వరలో విడుదల చేస్తామని ప్రకటించింది. బకాయిలు రూ.2,700 కోట్ల వరకు ఉండడంతో ప్రైవేట్‌ నెట్‌వర్క్‌ ఆసుపత్రులు ఆందోళన విరమించడం లేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు