కళ్యాణదుర్గం మున్సిపల్‌ ఛైర్మన్‌ను పదవి నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు

Eenadu icon
By Andhra Pradesh News Desk Published : 30 Oct 2025 05:09 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

కళ్యాణదుర్గం, న్యూస్‌టుడే: విధులు, బాధ్యతలు చట్టబద్ధంగా.. సక్రమంగా నిర్వర్తించడం లేదనే కారణంతో అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపల్‌ ఛైర్మన్‌ రాజ్‌కుమార్‌ను పదవి నుంచి తొలగిస్తూ బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి నెలా నిర్వహించే కౌన్సిల్‌ సమావేశానికి హాజరు కావాలని ఆహ్వాన లేఖ పంపినప్పుడు తిరస్కరించడం, సమావేశం ఏర్పాటు చేయాలని మూడోవంతు కౌన్సిల్‌ సభ్యులు అభ్యర్థించినా.. పట్టించుకోకపోవడం, కొన్ని నెలలుగా పుర సమావేశాలకు గైర్హాజరవుతుండటంతో స్థానిక కమిషనర్‌ ప్రభుత్వానికి నివేదిక పంపారు. దీనిపై ఉన్నతాధికారులు విచారణ జరిపి సెప్టెంబరు 24న ఛైర్మన్‌కు తాఖీదులు జారీ చేశారు. 15 రోజులు పూర్తయినా దీనికి సమాధానం ఇవ్వకపోవడంతో తదుపరి చర్యల్లో భాగంగా ఆయనను విధుల నుంచి తొలగిస్తున్నట్లు ప్రిన్సిపల్‌ సెక్రటరీ సురేష్‌కుమార్‌ బుధవారం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు