సీజ్ చేసిన బస్సుల్ని వదిలేయాలంటూ ఒత్తిళ్లు
34 బస్సుల ఎఫ్సీల రద్దుకు నోటీసుల జారీ
నేటి నుంచి మళ్లీ ట్రావెల్స్ బస్సుల తనిఖీలు
ఈనాడు-అమరావతి: కర్నూలులో ట్రావెల్స్ బస్సు దగ్ధం ఘటన తర్వాత.. నిబంధనలు ఉల్లంఘించి నడుస్తున్న ట్రావెల్స్ బస్సులపై రవాణా శాఖ తనిఖీలు జరిపి 114 బస్సులు సీజ్ చేయగా.. వాటిని విడిచి పెట్టాలంటూ అధికారులపై ఒత్తిళ్లు పెరుగుతున్నాయి. బస్సుల యాజమాన్యాలు కొందరు రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధుల ద్వారా ఒత్తిడి చేస్తున్నట్లు తెలిసింది. నేతలు ముఖ్యంగా జిల్లాలోని డీటీవోలు, ఆర్టీవోలపై ఒత్తిడి తెస్తున్నారు. ఈ బస్సుల్లో ఉల్లంఘనలపై ప్రభుత్వం కఠినంగా ఉండటం, కమిషనర్ కూడా ఎక్కడికక్కడ చర్యలు తీసుకోవాల్సిందేనని ఆదేశించడంతో.. తామేమీ చేయలేమని జిల్లా అధికారులు చెబుతున్నారు.
981 కేసుల నమోదు
ఈనెల 24 నుంచి 27 వరకు అన్ని జిల్లాల్లో రవాణాశాఖ అధికారులు తనిఖీలు జరిపి 981 కేసులు నమోదు చేశారు. అత్యవసర ద్వారాలు లేనివి 47, అగ్నిమాపక పరికరాలు లేనివి 274, ఫైర్ అలారం సిస్టమ్ లేనివి 33, అనధికారికంగా మార్పులు చేసిన 160 బస్సులపై కేసులు పెట్టారు. అనుమతి లేకుండా మార్పులు చేసిన, అత్యవసర ద్వారాన్ని మూసేసి సీట్లు, బెర్తులు ఏర్పాటు చేసిన 114 బస్సులను సీజ్ చేశారు. 34 బస్సుల ఫిట్నెస్ సర్టిఫికెట్ల రద్దుకు సిఫార్సు చేస్తూ రవాణాశాఖ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈశాన్య రాష్ట్రాలు, ఇతర రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నవాటికి ఏపీలోని ఆటోమెటిక్ టెస్టింగ్ స్టేషన్ (ఏటీఎస్)లో మళ్లీ ఫిట్నెస్ పరీక్ష చేయించుకుని ఎఫ్సీ పొందాలి. అలాగే అత్యవసర ద్వారం వద్ద ఏర్పాటుచేసిన బెర్తులు, సీట్లను తొలగించాలి. ఈ నిబంధనలన్నీ అమలు చేస్తేగానీ ఆ బస్సులను వదిలేది లేదని రవాణాశాఖ అధికారులు చెబుతున్నారు.
మళ్లీ తనిఖీలు కొనసాగింపు: ఇతర రాష్ట్రాల్లో రిజిస్టర్ చేసుకొని, ఆలిండియా పర్మిట్తో మన రాష్ట్రంలో తిరుగుతున్న ట్రావెల్స్ బస్సులను ఈనెల 24 నుంచి 27 వరకు ముమ్మరంగా తనిఖీ చేశారు. తుపాను కారణంగా 28, 29 తేదీల్లో తనిఖీలకు విరామం ఇచ్చారు. గురువారం నుంచి మిగిలిన బస్సులను తనిఖీ చేయాలని ఆదేశించారు. ఇతర రాష్ట్రాల్లోని రిజిస్ట్రేషన్తో ఏపీలో తిరుగుతున్నవి 530, ఏపీ రిజిస్ట్రేషన్తో ఉన్నవి 165 బస్సులని లెక్కతేల్చారు. వాటన్నింటినీ తనిఖీలు చేయాలని ఆదేశాలిచ్చారు.
బస్సు బాడీ డిజైన్ కోడ్కు కట్టుబడి ఉండాలి
స్లీపర్ బస్సులపై ఐఆర్ఎఫ్ స్పష్టీకరణ
దిల్లీ: స్లీపర్ బస్సుల బాడీ డిజైన్లో భద్రతా ప్రమాణాల కోడ్కు కట్టుబడి ఉండాల్సిందేనని అంతర్జాతీయ రోడ్డు ఫెడరేషన్ (ఐఆర్ఎఫ్) స్పష్టం చేసింది. ప్రయాణికుల భద్రతకు సంబంధించి బస్సుల బాడీ డిజైన్లపై ఇప్పటికే కఠిన నిబంధనలున్నాయని పేర్కొంది. ఇటీవల ఆంధ్రప్రదేశ్ సహా పలుచోట్ల స్లీపర్ బస్సుల్లో అగ్ని ప్రమాదాలు జరిగి 40 మంది దాకా మరణించిన నేపథ్యంలో ఐఆర్ఎఫ్ స్పందించింది. ప్రపంచ వ్యాప్తంగా అత్యుత్తమ, భద్రతాపరమైన రోడ్ల కోసం ఈ సంస్థ పనిచేస్తోంది. ఇటీవల జరిగిన ప్రమాదాలు.. బస్సుల్లోని ప్రమాదకర పరిస్థితులను తెలియజేస్తున్నాయని ఐఆర్ఎఫ్ అభిప్రాయపడింది. ‘మండే గుణం కలిగిన ఇంటీరియర్స్, ఇరుకైన ఎగ్జిట్లు, అత్యవసర ద్వారాలు లేకపోవడం, లోపాలమయంగా ఉండటం, ఫైర్ సేఫ్టీ గేర్ లేకపోవడం, బయటపడటానికి ఎక్కువ సమయం లభించకపోవడం, సరైన శిక్షణ లేని సిబ్బంది వల్లే ఈ ప్రమాదాలు జరిగాయి’ అని పేర్కొంది. నిబంధనల ప్రకారం.. అగ్నిమాపక పరికరాలు, స్పీడ్ గవర్నర్లు, డ్రైవర్లకు నిర్ణీత సమయమే విధులు, ఫిట్నెస్ ధ్రువీకరణ పత్రాలు అవసరమని ఐఆర్ఎఫ్ స్పష్టం చేసింది. ఇటీవల జరిగిన ప్రమాదాల్లో సమయానికి సాయం అంది ఉంటే పలువురి ప్రాణాలను కాపాడగలిగే అవకాశం ఉండేదని అభిప్రాయపడింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- 
                                    
                                        

టీచరమ్మా ఇది తగునా?
పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఆ ఉపాధ్యాయురాలు వారితో కాళ్లు పట్టించుకున్న ఘటన శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలం బందపల్లి బాలికల గిరిజన ఆశ్రమ పాఠశాలలో వెలుగు చూసింది. - 
                                    
                                        

ప్రపంచకప్ గెలిచిన జట్టులో మా అమ్మాయి ఉండటంపై గర్విస్తున్నాం
మహిళల క్రికెట్ జట్టు ప్రపంచకప్ గెలవడం, అందులో తమ కుమార్తె భాగస్వామ్యం కావడంపై గర్వపడుతున్నామని భారత మహిళల జట్టు క్రీడాకారిణి శ్రీచరణి తల్లిదండ్రులు నల్లపురెడ్డి చంద్రశేఖర్రెడ్డి, రేణుక తెలిపారు. - 
                                    
                                        

జాతీయ ఆరోగ్య మిషన్ అమలుపై సీఆర్ఎం బృందం ఆరా
జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం) కార్యక్రమాల అమలు తీరు పరిశీలనకు 12 మందితో కూడిన కామన్ రివ్యూ మిషన్ (సీఆర్ఎం) బృందం సోమవారం రాష్ట్రానికి వచ్చింది. - 
                                    
                                        

తీరు మార్చుకోకపోతే బుద్ధి చెబుతాం
వైకాపా నేత నల్లపురెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి మహిళలపై మూర్ఖపు వ్యాఖ్యలు చేస్తున్నారని.. ఆయన తన తీరును మార్చుకోకపోతే బుద్ధి చెబుతామని తెదేపా ఎమ్మెల్సీ కావలి గ్రీష్మ హెచ్చరించారు. - 
                                    
                                        

వైకాపా నాయకులు భూమి ఆక్రమించారు
వైకాపా మద్దతుదారులు తన స్థలాన్ని తప్పుడు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని గుంటూరు జిల్లా గోరంట్లకు చెందిన యశోద వాపోయారు. ఈ మేరకు మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. - 
                                    
                                        

రూ.50 కోట్లు దాటిన బ్రాహ్మణ కోఆపరేటివ్ సొసైటీ డిపాజిట్లు
ఏపీ బ్రాహ్మణ సంక్షేమ సంస్థకు అనుబంధంగా ఉన్న బ్రాహ్మణ కోఆపరేటివ్ సొసైటీ తొలిసారిగా డిపాజిట్ల సేకరణలో రూ.50 కోట్ల మైలురాయిని దాటింది. - 
                                    
                                        

‘ఉపాధి’లో మెరిసిన రాష్ట్రం
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులో జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ మెరిసింది. 2025-26లో ఇప్పటివరకు పనిదినాల వినియోగంలో దేశంలో మూడో స్థానంలో నిలిచింది. - 
                                    
                                        

ప్రభుత్వాసుపత్రిలో దౌర్జన్యంపై కేసు.. ఏ1గా జోగి భార్య శకుంతల, ఏ2, ఏ3గా కుమారులు
పోలీసులను దౌర్జన్యంగా తోసేసి.. విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో అద్దాలు పగలగొట్టిన ఘటనపై వైకాపా నేత జోగి రమేష్ భార్య, ఇద్దరు కుమారులు, మరికొందరిపై మాచవరం పోలీసులు కేసు నమోదు చేశారు. - 
                                    
                                        

5 వేల హెక్టార్లలో బీచ్శాండ్ లీజులకు ప్రయత్నాలు
అణుధార్మికతతో కూడిన అరుదైన ఖనిజాలు ఉండే బీచ్శాండ్ తవ్వకాల కోసం మరో 5 వేల హెక్టార్లలో లీజులు పొందేందుకు ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) ప్రయత్నాలు చేస్తోంది. - 
                                    
                                        

పోలవరం పనులే చేస్తున్నప్పుడు విద్యుత్తు సబ్స్టేషన్ల పనులు పూర్తి చేయలేరా?
విద్యుత్తు లైన్లు.. 132, 140, 400కేవీ వంటి సబ్స్టేషన్ల పనులనూ సకాలంలో పూర్తి చేయలేరా? అని ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ(పీయూసీ) ట్రాన్స్కో అధికారులను నిలదీసింది. - 
                                    
                                        

‘రుణాల పంపిణీ.. డిజిటలైజేషన్లో భారీ అక్రమాలున్నాయ్’
వైకాపా హయాం(2019-24)లో సహకార వ్యవస్థను అస్తవ్యస్తం చేశారని ప్రత్యేక సభా సంఘం అభిప్రాయపడింది. 2019-24 మధ్య ఆప్కాబ్, జిల్లా సహకార కేంద్ర బ్యాంకులు, పీఏసీఎస్లలో జరిగిన అక్రమాలను నిగ్గు తేల్చేందుకు ఏర్పాటైన సభాసంఘం.. అసెంబ్లీ కమిటీ హాలులో సోమవారం సమావేశమైంది. - 
                                    
                                        

ఇటలీ వాసి.. గోరింటకు మురిసి
విశ్వశాంతి కాంక్షిస్తూ ఇటలీ దేశీయుడైన జాన్ సైకిల్పై ప్రపంచ దేశాలను చుట్టేస్తున్నారు. ఇప్పటికే స్పెయిన్, ఫ్రాన్స్, తుర్కియే, ఇండోనేసియా, జర్మనీ తదితర దేశాల్లో యాత్ర పూర్తిచేశారు. - 
                                    
                                        

ఈ దండలను ఎంచక్కా తినేయొచ్చు!
పాయసంలోకి కమ్మని రుచిని ఇచ్చేది జీడిపప్పు. అదే జీడిపప్పుతో చేసిన దండలను నూతన వధూవరులు, రాజకీయ నాయకుల మెడలో వేస్తే ప్రత్యేకమే కదా. - 
                                    
                                        

కోటి కాంతుల అఖండ జ్యోతి
కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం ములగపూడిలో ఏటా కార్తిక పౌర్ణమి రోజు కోదండరాముడి తెప్పోత్సవం ఘనంగా నిర్వహిస్తారు. - 
                                    
                                        

విజయనగరంలోనూ డబ్బావాలా..
వ్యక్తిగత పని అనో, ఉద్యోగమనో, వ్యాపారమనో చాలా మంది ఉదయం నిద్ర లేచింది మొదలు ఉరుకులు పరుగులు పెడుతుంటారు. ఓ వైపు పాఠశాలలకు పిల్లల్ని సిద్ధం చేస్తూనే వారికి అల్పాహారం వండుతూ తీరిక లేకుండా ఉంటారు. - 
                                    
                                        

వ్యర్థానికి అర్థం.. చిన్నారులకు ఆహ్లాదం
ఎందుకూ పనికి రావని పక్కన పడేసే వాహనాల టైర్లను సరికొత్తగా వినియోగించవచ్చని నిరూపించారు గుంటూరు లక్ష్మీపురంలోని పాటిబండ్ల సీతారామయ్య ప్రైవేట్ పాఠశాల నిర్వాహకులు. - 
                                    
                                        

అబ్బో.. ఎంత పొడగరో!
తిరుమలలో ఓ విదేశీ మహిళ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. 6 అడుగుల 10 అంగుళాల ఎత్తు ఉన్న శ్రీలంకకు చెందిన నెట్బాల్ ప్లేయర్ తార్జిని శివలింగం సోమవారం సంప్రదాయ వస్త్రధారణతో శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు. - 
                                    
                                        

వేద పాఠశాల నిర్మాణానికి… 2 ఎకరాల భూమి.. 2 కోట్ల నగదు
పశ్చిమగోదావరి జిల్లా పాలకోడేరు మండలం పెన్నాడ అగ్రహారంలో కంచి కామకోటి పీఠం ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న వేద పాఠశాల నిర్మాణానికి సోమవారం శంకుస్థాపన చేశారు. - 
                                    
                                        

మా పార్టీ ఇచ్చిన స్క్రిప్టే చదివాను.. వాస్తవంగా ఏం జరిగిందో తెలియదు: శ్యామల
కర్నూలు బస్సు ప్రమాద దుర్ఘటనకు అసలు కారణాలు తనకు తెలియవని.. వైకాపా ప్రతినిధులు ఇచ్చిన స్క్రిప్టే చదివానని ఆ పార్టీ అధికార ప్రతినిధి శ్యామల తేల్చిచెప్పారు. - 
                                    
                                        

ముక్కంటికి కార్తిక హారతి
ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంలో కార్తిక మాసోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. రెండో కార్తిక సోమవారాన్ని పురస్కరించుకొని ఆలయ పుష్కరిణి వద్ద నిర్వహించిన లక్ష దీపోత్సవం కనుల పండువగా జరిగింది. 
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

విద్యార్థులతో కాళ్లు నొక్కించుకున్న టీచర్ సస్పెండ్
 - 
                        
                            

రోడ్డెక్కిన సీఎం.. ‘ఎస్ఐఆర్’కు వ్యతిరేకంగా నిరసనలు
 - 
                        
                            

ఛత్తీస్గఢ్లో రెండు రైళ్లు ఢీ.. పలువురు మృతి
 - 
                        
                            

బాధితులకు రూ.కోటి పరిహారం ఎప్పుడు చెల్లిస్తారు?: తెలంగాణ హైకోర్టు
 - 
                        
                            

అప్పుడు ఒక్క మ్యాచ్ ఆడితే రూ.1,000 ఇచ్చారు: మిథాలి రాజ్
 - 
                        
                            

ఏపీలో పెట్టుబడులు పెట్టండి.. అపరెల్ గ్రూప్ను ఆహ్వానించిన మంత్రి నారాయణ
 


