సిబ్బంది హాజరు.. ఓపీ, ఐపీ సేవల్లో పురోగతి

Eenadu icon
By Andhra Pradesh News Desk Published : 31 Oct 2025 05:40 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

ఆరు నెలల పనితీరుపై సమీక్ష.. జిల్లాలకు ర్యాంకులు
వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌

ఈనాడు, అమరావతి: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైద్య రంగం మెరుగుకు చేపట్టిన చర్యలు సత్ఫలితాలు ఇచ్చాయని, వైద్యసిబ్బంది హాజరు, ఓపీ- ఐపీ, డయాగ్నస్టిక్‌ సేవల్లో పురోగతి, ఆరోగ్య పథకాల అమలులో మార్పులు ఆశాజనకంగా ఉన్నాయని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ వెల్లడించారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో కీలక విభాగాల్లో మొదటి ఆరు నెలల పనితీరుపై సచివాలయంలో ఉన్నతాధికారులతో గురువారం సమీక్షించారు. గత ప్రభుత్వంలో వెలుగుచూసిన క్రమశిక్షణ రాహిత్యం, జవాబుదారీతనం లోపించడం వంటివి అరికట్టడానికి గతేడాది నవంబర్‌లో సమగ్ర మూల్యాంకన వ్యవస్థ ప్రవేశపెట్టామని, దాని ఆధారంగానే ఏప్రిల్‌ నుంచి సెప్టెంబర్‌ వరకు పథకాల అమలు, జిల్లాల పనితీరుకు ర్యాంకులు ఇవ్వాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. మంత్రి వెల్లడించిన వివరాలివి..

  • వైద్యులు, ఇతర సిబ్బంది హాజరు 83 నుంచి 92 శాతానికి పెరిగింది. డీఎంఈ, అనుబంధ కార్యాలయాలు, నర్సింగ్‌ కళాశాలల్లో తక్కువ హాజరు ఉంది. 
  • ఆసుపత్రుల్లో విశాఖలోని కేజీహెచ్‌లో 93.13, కర్నూలు జీజీహెచ్‌ 92.71, రాజమహేంద్రవరం    జీజీహెచ్‌ 91.40 శాతంతో హాజరులో అగ్రస్థానంలో ఉన్నాయి. జీజీహెచ్‌లలో గుంటూరు 77.84, ఏలూరు 76.30, నెల్లూరు 66.44 శాతంతో హాజరులో     వెనుకబడ్డాయి. 
  • వైద్య కళాశాలల్లో తిరుపతిలోని శ్రీవెంకటేశ్వర వైద్యకళాశాల 100, కాకినాడలోని రంగరాయ వైద్యకళాశాల 99.92, విశాఖలోని ఆంధ్ర వైద్యకళాశాల 95.30 శాతంతో ముందంజలో ఉన్నాయి. విజయవాడ, గుంటూరు, శ్రీకాకుళంలోని వైద్యకళాశాలలు హాజరులో వెనుకబడ్డాయి. 
  • ఆరు నెలల్లో ప్రభుత్వ వైద్యశాలల్లో 4 కోట్ల మందికిపైగా ఓపీ సేవలు పొందారు. గతంలో రోగి నిరీక్షణకు 42 నిమిషాలు పడితే.. ఇది 26 నిమిషాలకు తగ్గింది. 2.50 కోట్ల ఎక్స్‌రేలు, అల్ట్రాసౌండ్, ఈసీజీ, ల్యాబ్‌ పరీక్షలు చేసి..6.10 శాతం వృద్ధి సాధ్యమైంది. 
  • నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ అమలులో తూర్పుగోదావరి, వైఎస్సార్‌ కడప, తిరుపతి జిల్లాలు అగ్రస్థానంలో నిలిస్తే.. అల్లూరి సీతారామరాజు, శ్రీకాకుళం, గుంటూరు జిల్లాలు దిగువన ఉన్నాయి. 
  • డిసీజ్‌ కంట్రోల్‌ ప్రోగ్రాం, మాతాశిశు ఆరోగ్య విభాగాల పనితీరులో అగ్రస్థానంలో ఉంటే.. అసాంక్రమిక వ్యాధుల విభాగం, పీహెచ్‌సీలు, ఆర్‌బీఎస్‌కేలు వెనుకబడ్డాయి.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు