పల్నాటి యుద్ధవీరుల ఆయుధ కొలుపు!

Eenadu icon
By Andhra Pradesh News Desk Updated : 31 Oct 2025 09:04 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

వీరుల ఆయుధాలకు ఆరాధనలు చేస్తున్న భక్తులు

అది పల్నాటి యుద్ధం.. క్రీ.శ.12వ శతాబ్దంలో జరిగిన ఈ సమరానికి ఓ ప్రత్యేకత ఉంది. రాజ్య కాంక్షతో కౌరవ, పాండవులు జరిపిన యుద్ధం తీరున ఇది సాగింది. మలిదేవాదులు, నలగాముడు అనే ఇద్దరు అన్నదమ్ములు రాజ్యకాంక్షతో పోరుకు సిద్ధమై, కోడి పందేలకు దిగారు. ఇందులో ఓడిన మలిదేవాదులు తన రాజ్యాన్ని వదిలేసి అరణ్యవాసం గడిపారు. ఆ తర్వాత తన రాజ్యాన్ని అప్పగించాలని ఆయన నలగాముడిని కోరారు. అందుకు అంగీకారం కుదరకపోవడంతో క్రీ.శ.1181లో పల్నాటి యుద్ధం జరిగింది. ఇందులో 66 మంది వీరనాయకులు, వందల సంఖ్యలో సైనికులు అసువులు బాశారు. వీరిని స్మరిస్తూ ఏటా పల్నాడు జిల్లా కారంపూడిలోని వీరుల దేవాలయం పరిసరాల్లో ఆరాధనోత్సవాలు నిర్వహిస్తున్నారు. యుద్ధవీరులను ఆరాధించడం రోమ్‌ తర్వాత కారంపూడిలోనే అని స్థానికులు చెబుతున్నారు. కార్తిక అమావాస్య నుంచి ఐదురోజులపాటు (నవంబరు 19 నుంచి 23 వరకు) పల్నాటి యుద్ధానికి దారి తీసిన ప్రధాన క్రతువుల పేరున వేడుకలు జరుపుతారు. ఇందులో యుద్ధ వీరులు ఉపయోగించిన ఆయుధాలను దైవాలుగా, వీర్లదేవాలయంలోని లింగాలను వారి స్వరూపాలుగా పూజిస్తారు. రెండు తెలుగురాష్ట్రాల నుంచి పల్నాటి యుద్ధవీరుల వంశీకులు ఇక్కడి వీర్లనిధిపై ఆచారం సాగిస్తుంటారు.

పల్నాటి యుద్ధవీరులు వాడిన ఆయుధాలు 

 

కత్తిసేవ చేస్తున్న ఆచారవంతుడు

మాచర్ల (కారంపూడి), న్యూస్‌టుడే

Tags :
Published : 31 Oct 2025 09:02 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు