ఎత్తైన లైట్‌హౌస్‌.. చూసొద్దాం పదండి

Eenadu icon
By Andhra Pradesh News Desk Published : 31 Oct 2025 05:43 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

లైట్‌హౌస్‌లోని మెట్లు..

ఈనాడు డిజిటల్, మచిలీపట్నం, ఈనాడు, కృష్ణా: తూర్పు సముద్ర తీరంలో దేశంలో రెండో, రాష్ట్రంలో మొదటి ఎత్తైన లైట్‌హౌస్‌ మచిలీపట్నంలోని మంగినపూడి తీరంలో ఉంది. దీనిని 1984లో ప్రారంభించారు. దీని ఎత్తు 50 మీటర్లు కాగా, ఇందులో మెట్లు 216 ఉన్నాయి. నావికులు, కోస్టల్‌ సెక్యూరిటీ, మెరైన్‌ పోలీసులతో పాటు మత్స్యకారులు, దూర ప్రాంతాల నుంచి వచ్చే ఓడలకు తీరం దిశ చూపేందుకు ఇది ఎంతగానో సహాయపడుతుంది. సముద్రంలో 20 నాటికల్‌ మైళ్ల దూరంలోని వారికి రాత్రి సమయంలో దీని నుంచి వెలువడే కాంతితో (లైట్‌) మార్గం తెలుస్తుంది. అలాగే ఈ లైట్‌హౌస్‌కు వేసిన నలుపు, తెలుపు రంగుల (కలర్‌ బ్యాండ్స్‌) ద్వారా పగలు 16 నాటికల్‌ మైళ్ల దూరంలోని వారికి కూడా తీరం కనిపిస్తుంది. దీనిపై నుంచి చూస్తే సముద్ర తీరం, ఎగసిపడే అలల సవ్వడి, తీరంలోని గ్రామాలు, పచ్చని చెట్లు వంటి ఎన్నో సోయగాలు కనువిందు చేస్తాయి. నామమాత్రపు రుసుంతో రోజూ సాయంత్రం 4 నుంచి 6 వరకు దీన్ని చూసేందుకు పర్యాటకులకు అవకాశం కల్పిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు