ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ బాధితులకు రాయితీపై రుణాలు

Eenadu icon
By Andhra Pradesh News Desk Published : 31 Oct 2025 05:59 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

మాల కార్పొరేషన్‌ ఛైర్మన్‌ విజయ్‌కుమార్‌ 

ఈనాడు, అమరావతి: ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ బాధితుల స్వయం ఉపాధికి అవసరమైతే నిబంధనలు సడలించి రాయితీపై రుణాల మంజూరుకు చర్యలు తీసుకుంటామని మాల కార్పొరేషన్‌ ఛైర్మన్‌ విజయ్‌కుమార్‌ హామీ ఇచ్చారు. దళిత, ఆదివాసీ మహిళలపై జరుగుతున్న హింసకు సంబంధించి గురువారం విజయవాడలో దళిత స్త్రీశక్తి ఆధ్వర్యంలో ‘లీగల్‌ క్లినిక్‌’ నిర్వహించారు. 2019-25 మధ్య రాష్ట్రవ్యాప్తంగా 33 మంది ఎస్సీ, ఎస్టీలపై జరిగిన దాడులు, అకృత్యాల కేసుల తాజా పరిస్థితిపై చర్చించారు. ఇందులో విజయ్‌కుమార్‌ మాట్లాడుతూ.. ఈ కేసుల్లో అందాల్సిన పరిహారం విషయాన్ని సాంఘిక సంక్షేమశాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లి త్వరలో విడుదలయ్యేలా చూస్తానన్నారు. దళిత స్త్రీశక్తి జాతీయ కన్వీనర్‌ గెడ్డం ఝాన్సీ సమావేశానికి అధ్యక్షత వహించారు. డైరెక్టర్‌ ఆఫ్‌ ప్రాసిక్యూషన్స్‌ బైరా కోటేశ్వరరావు, ఐపీఎస్‌ అధికారి శ్రీనివాస్, మాజీ సమాచార కమిషనర్‌ అంబటి సుబ్బారావు, హైకోర్టు అడ్వకేట్‌ అభిజ్ఞ బాధితుల ఆవేదన విన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని