‘ఉపాధి’లో 9 కోట్ల అదనపు పనిదినాలకు ప్రతిపాదనలు

Eenadu icon
By Andhra Pradesh News Desk Published : 31 Oct 2025 05:59 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ ముందుంచిన రాష్ట్ర ప్రభుత్వం

ఈనాడు, అమరావతి: జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో తొమ్మిది కోట్ల అదనపు పనిదినాల కోసం కేంద్రానికి రాష్ట్రప్రభుత్వం ప్రతిపాదించింది. కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ కార్యదర్శి శైలేష్‌కుమార్‌ సింగ్‌ దిల్లీలో గురువారం నిర్వహించిన సమావేశానికి రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్, కమిషనర్‌ కృష్ణతేజ హాజరై అదనపు పనిదినాల ఆవశ్యకతను వివరించారు. 2025-26 సంవత్సరానికి తొలివిడతగా కేటాయించిన 15 కోట్ల పనిదినాలకు మించి 60వేలు ఇప్పటివరకు వినియోగించిన విషయాన్ని ప్రస్తావించారు. వచ్చే ఏడాది మార్చితో ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి మిగిలిన ఐదు నెలలకు మరో 9 కోట్ల పనిదినాలు అవసరమని వివరించారు. ఉపాధి పథకంలో అవకతవకలకు ఆస్కారం లేకుండా రాష్ట్రప్రభుత్వం తీసుకున్న చర్యలపై ప్రజంటేషన్‌ ఇచ్చారు. శ్రామికుల ఈకేవైసీ 80% పైగా పూర్తయినట్లు వివరించారు. రాష్ట్రానికి అదనపు పనిదినాల కేటాయింపుపై కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ శుక్రవారం ప్రకటన చేస్తుందని అధికారులు భావిస్తున్నారు. దిల్లీకి వెళ్లినవారిలో ముఖ్య కార్యదర్శి, కమిషనర్‌తో పాటు రాష్ట్ర ఉపాధి హామీ పథకం డైరెక్టర్‌ షణ్ముఖరావు, అదనపు కమిషనర్‌ శివప్రసాద్‌ ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు