ప్రకాశం జిల్లా అతలాకుతలం

Eenadu icon
By Andhra Pradesh News Desk Published : 31 Oct 2025 06:03 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌టుడే: మొంథా తుపాను ప్రకాశం జిల్లాకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. పాలేరు, ముసి, గుండ్లకమ్మ నదులు ఉగ్రరూపం దాల్చాయి. గురువారం కూడా పలు గ్రామాల మధ్య రాకపోకలు స్తంభించాయి. గుండ్లకమ్మ జలాశయం 14 గేట్లు ఎత్తి, నీరు వదలడంతో దిగువన ఉన్న మద్దిపాడు, నాగులుప్పలపాడు, ఒంగోలు మండలాల్లోని 12 గ్రామాల్లోకి నీరు చేరింది. ఆయా ప్రాంతాల వారిని పునరావాస కేంద్రాలకు తరలించారు. తీరప్రాంత మండలాల్లో సుమారు వెయ్యి ఎకరాల్లో రొయ్యల సాగు దెబ్బతింది. నాగులుప్పలపాడు మండలం మద్దిరాలపాడు వద్ద 216 జాతీయ రహదారిపై నీటి ప్రవాహం కారణంగా రాకపోకలు నిలిచిపోయాయి. పలు రోడ్లు కోతకు గురవ్వగా, మరికొన్ని దెబ్బతిన్నాయి.

గుండ్లకమ్మ జలాశయం నుంచి భారీగా నీటిని విడుదల చేయడంతో వెల్లంపల్లి పాత వంతెన వద్ద 32 అడుగుల పిల్లర్ల మీదుగా ప్రవహిస్తున్న జలాలు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు