కృష్ణమ్మ.. మహోగ్రం!.. ప్రకాశం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక

Eenadu icon
By Andhra Pradesh News Desk Updated : 31 Oct 2025 07:10 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

ఈనాడు, అమరావతి, న్యూస్‌టుడే-పెనుగంచిప్రోలు: మొంథా తుపానుతోపాటు...ఎగువన కురిసిన వర్షాల ప్రభావంతో కృష్ణా నదికి వరద పోటెత్తింది. రెండో ప్రమాద హెచ్చరికను దాటి వరద ప్రవాహం అంతకంతకూ పెరుగుతోంది. గురువారం ఉదయం ఆరు గంటలకు ప్రకాశం బ్యారేజీకి ఇన్‌ఫ్లో 1,51,700 క్యూసెక్కులు ఉండగా.. అంతే స్థాయిలో నీటిని సముద్రంలోకి వదిలారు. మధ్యాహ్నం 1.45 గంటలకు ఔట్‌ ఫ్లో 3.97 లక్షల క్యూసెక్కులు దాటడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. సాయంత్రం 6.45 గంటలకు ఔట్‌ఫ్లో 5.67 లక్షల క్యూసెక్కులు దాటడంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. రాత్రి 8 గంటలకు ఇన్‌ఫ్లో 5,82,710 క్యూసెక్కులు ఉండగా..ఔట్‌ ఫ్లో కూడా 5,82,710 క్యూసెక్కులకు చేరింది. ఆరు లక్షల క్యూసెక్కులు దాటి వరద తీవ్రత పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కాలువలకు నీరు వెళ్లకుండా ఆపేశారు. 

మునేరు ఉగ్రరూపం...

 

ఎన్టీఆర్‌ జిల్లాలోని పెనుగంచిప్రోలు-వత్సవాయి కాజ్‌వే పైనుంచి ఉద్ధృతంగా ప్రవహిస్తున్న మునేరు వాగు 

తెలంగాణలో కురిసిన అతి భారీ వర్షాల ప్రభావం మునేరును తాకింది. పెనుగంచిప్రోలు వద్ద కాజ్‌వేపై వరద ప్రవహించడంతో వత్సవాయి, నందిగామ, పెనుగంచిప్రోలు మండలాల్లో 42 గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. బుధవారం రాత్రి వత్సవాయి మండలం లింగాల వద్ద కాజ్‌వేపైకి వరద రావడంతో చిల్లకల్లు-వైరాల మధ్య రాకపోకలు ఆగిపోయాయి.  పెనుగంచిప్రోలు కాజ్‌ వే వద్ద కాశీ విశ్వేశ్వరస్వామి ఆలయంలోకి వరద నీరు చేరింది.

Tags :
Published : 31 Oct 2025 06:58 IST

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని