Montha Cyclone: బలహీనపడిన మొంథా
కావలిలో గరిష్ఠంగా 23.6 సెం.మీ. వర్షం
నేడు ఉత్తరాంధ్రకు భారీ వర్షసూచన
పలు రేవులకు మూడో నంబరు ప్రమాద హెచ్చరిక

అంబేడ్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మార్కెట్ యార్డులో ఈదురుగాలులకు వాహనంపై పడిపోయిన చెట్టు
ఈనాడు, విశాఖపట్నం: ‘మొంథా’ తీవ్ర తుపాను మచిలీపట్నం, కళింగపట్నం మధ్యలో పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం సమీపంలో తీరం దాటినట్లు భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ప్రకటించింది. ఈ ప్రక్రియ మంగళవారం అర్ధరాత్రి వరకు కొనసాగింది. తీరం దాటిన తర్వాత బుధవారం తెల్లవారుజాములోగా తుపానుగా, ఉదయానికి తీవ్ర వాయుగుండంగా బలహీనపడిందని ఐఎండీ పేర్కొంది. తర్వాత ఇది ఉత్తర-ఆగ్నేయ వాయవ్య దిశగా ఉత్తరాంధ్ర మీదుగా దక్షిణ ఒడిశా, ఛత్తీస్గఢ్, తెలంగాణ వైపు కదులుతూ సాయంత్రానికి వాయుగుండంగా బలహీనపడింది. దీని ప్రభావంతో గురువారం అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తోంది.
సముద్రం అలజడిగా ఉన్నందున మత్స్యకారులు గురువారం వేటకు వెళ్లరాదని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం సూచించింది. తుపాను తీరం దాటినందున హెచ్చరికల స్థాయిని తగ్గించారు. విశాఖపట్నం, గంగవరం, కళింగపట్నం, కాకినాడ, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం, వాడరేవు పోర్టులకు మూడో నంబరు ప్రమాద హెచ్చరికలు జారీచేశారు.

గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం వంగిపురం వద్ద వాగుకు గండి పడి పొలాల్లోకి చేరుతున్న నీరు
10 చోట్ల 20 సెం.మీ. పైగా వర్షం
‘మొంథా’ తీవ్ర తుపాను ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిశాయి. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు నమోదయ్యాయి. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు రాష్ట్రంలోని 10 ప్రాంతాల్లో వర్షపాతం 20 సెంటీమీటర్లకు పైగా నమోదైంది. అత్యధికంగా నెల్లూరు జిల్లా కావలిలో 23.6 సెంటీమీటర్ల వర్షం కురిసింది.
బుధవారం ఎన్టీఆర్, పల్నాడు, అల్లూరి సీˆతారామరాజు, బాపట్ల, పల్నాడు, విశాఖపట్నం తదితర జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓమోస్తరు వర్షాలు కురిశాయి. సాయంత్రం 4 గంటల వరకు అత్యధికంగా ఎన్టీఆర్ జిల్లా వత్సవాయిలో 4.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం అదపాక శివాలయం వైపు పెద్దగెడ్డ వాగును ప్రమాదకరంగా దాటుతున్న వ్యక్తి


Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- 
                                    
                                        

టీచరమ్మా ఇది తగునా?
పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఆ ఉపాధ్యాయురాలు వారితో కాళ్లు పట్టించుకున్న ఘటన శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలం బందపల్లి బాలికల గిరిజన ఆశ్రమ పాఠశాలలో వెలుగు చూసింది. - 
                                    
                                        

ప్రపంచకప్ గెలిచిన జట్టులో మా అమ్మాయి ఉండటంపై గర్విస్తున్నాం
మహిళల క్రికెట్ జట్టు ప్రపంచకప్ గెలవడం, అందులో తమ కుమార్తె భాగస్వామ్యం కావడంపై గర్వపడుతున్నామని భారత మహిళల జట్టు క్రీడాకారిణి శ్రీచరణి తల్లిదండ్రులు నల్లపురెడ్డి చంద్రశేఖర్రెడ్డి, రేణుక తెలిపారు. - 
                                    
                                        

జాతీయ ఆరోగ్య మిషన్ అమలుపై సీఆర్ఎం బృందం ఆరా
జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం) కార్యక్రమాల అమలు తీరు పరిశీలనకు 12 మందితో కూడిన కామన్ రివ్యూ మిషన్ (సీఆర్ఎం) బృందం సోమవారం రాష్ట్రానికి వచ్చింది. - 
                                    
                                        

తీరు మార్చుకోకపోతే బుద్ధి చెబుతాం
వైకాపా నేత నల్లపురెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి మహిళలపై మూర్ఖపు వ్యాఖ్యలు చేస్తున్నారని.. ఆయన తన తీరును మార్చుకోకపోతే బుద్ధి చెబుతామని తెదేపా ఎమ్మెల్సీ కావలి గ్రీష్మ హెచ్చరించారు. - 
                                    
                                        

వైకాపా నాయకులు భూమి ఆక్రమించారు
వైకాపా మద్దతుదారులు తన స్థలాన్ని తప్పుడు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని గుంటూరు జిల్లా గోరంట్లకు చెందిన యశోద వాపోయారు. ఈ మేరకు మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. - 
                                    
                                        

రూ.50 కోట్లు దాటిన బ్రాహ్మణ కోఆపరేటివ్ సొసైటీ డిపాజిట్లు
ఏపీ బ్రాహ్మణ సంక్షేమ సంస్థకు అనుబంధంగా ఉన్న బ్రాహ్మణ కోఆపరేటివ్ సొసైటీ తొలిసారిగా డిపాజిట్ల సేకరణలో రూ.50 కోట్ల మైలురాయిని దాటింది. - 
                                    
                                        

‘ఉపాధి’లో మెరిసిన రాష్ట్రం
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులో జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ మెరిసింది. 2025-26లో ఇప్పటివరకు పనిదినాల వినియోగంలో దేశంలో మూడో స్థానంలో నిలిచింది. - 
                                    
                                        

ప్రభుత్వాసుపత్రిలో దౌర్జన్యంపై కేసు.. ఏ1గా జోగి భార్య శకుంతల, ఏ2, ఏ3గా కుమారులు
పోలీసులను దౌర్జన్యంగా తోసేసి.. విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో అద్దాలు పగలగొట్టిన ఘటనపై వైకాపా నేత జోగి రమేష్ భార్య, ఇద్దరు కుమారులు, మరికొందరిపై మాచవరం పోలీసులు కేసు నమోదు చేశారు. - 
                                    
                                        

5 వేల హెక్టార్లలో బీచ్శాండ్ లీజులకు ప్రయత్నాలు
అణుధార్మికతతో కూడిన అరుదైన ఖనిజాలు ఉండే బీచ్శాండ్ తవ్వకాల కోసం మరో 5 వేల హెక్టార్లలో లీజులు పొందేందుకు ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) ప్రయత్నాలు చేస్తోంది. - 
                                    
                                        

పోలవరం పనులే చేస్తున్నప్పుడు విద్యుత్తు సబ్స్టేషన్ల పనులు పూర్తి చేయలేరా?
విద్యుత్తు లైన్లు.. 132, 140, 400కేవీ వంటి సబ్స్టేషన్ల పనులనూ సకాలంలో పూర్తి చేయలేరా? అని ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ(పీయూసీ) ట్రాన్స్కో అధికారులను నిలదీసింది. - 
                                    
                                        

‘రుణాల పంపిణీ.. డిజిటలైజేషన్లో భారీ అక్రమాలున్నాయ్’
వైకాపా హయాం(2019-24)లో సహకార వ్యవస్థను అస్తవ్యస్తం చేశారని ప్రత్యేక సభా సంఘం అభిప్రాయపడింది. 2019-24 మధ్య ఆప్కాబ్, జిల్లా సహకార కేంద్ర బ్యాంకులు, పీఏసీఎస్లలో జరిగిన అక్రమాలను నిగ్గు తేల్చేందుకు ఏర్పాటైన సభాసంఘం.. అసెంబ్లీ కమిటీ హాలులో సోమవారం సమావేశమైంది. - 
                                    
                                        

ఇటలీ వాసి.. గోరింటకు మురిసి
విశ్వశాంతి కాంక్షిస్తూ ఇటలీ దేశీయుడైన జాన్ సైకిల్పై ప్రపంచ దేశాలను చుట్టేస్తున్నారు. ఇప్పటికే స్పెయిన్, ఫ్రాన్స్, తుర్కియే, ఇండోనేసియా, జర్మనీ తదితర దేశాల్లో యాత్ర పూర్తిచేశారు. - 
                                    
                                        

ఈ దండలను ఎంచక్కా తినేయొచ్చు!
పాయసంలోకి కమ్మని రుచిని ఇచ్చేది జీడిపప్పు. అదే జీడిపప్పుతో చేసిన దండలను నూతన వధూవరులు, రాజకీయ నాయకుల మెడలో వేస్తే ప్రత్యేకమే కదా. - 
                                    
                                        

కోటి కాంతుల అఖండ జ్యోతి
కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం ములగపూడిలో ఏటా కార్తిక పౌర్ణమి రోజు కోదండరాముడి తెప్పోత్సవం ఘనంగా నిర్వహిస్తారు. - 
                                    
                                        

విజయనగరంలోనూ డబ్బావాలా..
వ్యక్తిగత పని అనో, ఉద్యోగమనో, వ్యాపారమనో చాలా మంది ఉదయం నిద్ర లేచింది మొదలు ఉరుకులు పరుగులు పెడుతుంటారు. ఓ వైపు పాఠశాలలకు పిల్లల్ని సిద్ధం చేస్తూనే వారికి అల్పాహారం వండుతూ తీరిక లేకుండా ఉంటారు. - 
                                    
                                        

వ్యర్థానికి అర్థం.. చిన్నారులకు ఆహ్లాదం
ఎందుకూ పనికి రావని పక్కన పడేసే వాహనాల టైర్లను సరికొత్తగా వినియోగించవచ్చని నిరూపించారు గుంటూరు లక్ష్మీపురంలోని పాటిబండ్ల సీతారామయ్య ప్రైవేట్ పాఠశాల నిర్వాహకులు. - 
                                    
                                        

అబ్బో.. ఎంత పొడగరో!
తిరుమలలో ఓ విదేశీ మహిళ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. 6 అడుగుల 10 అంగుళాల ఎత్తు ఉన్న శ్రీలంకకు చెందిన నెట్బాల్ ప్లేయర్ తార్జిని శివలింగం సోమవారం సంప్రదాయ వస్త్రధారణతో శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు. - 
                                    
                                        

వేద పాఠశాల నిర్మాణానికి… 2 ఎకరాల భూమి.. 2 కోట్ల నగదు
పశ్చిమగోదావరి జిల్లా పాలకోడేరు మండలం పెన్నాడ అగ్రహారంలో కంచి కామకోటి పీఠం ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న వేద పాఠశాల నిర్మాణానికి సోమవారం శంకుస్థాపన చేశారు. - 
                                    
                                        

మా పార్టీ ఇచ్చిన స్క్రిప్టే చదివాను.. వాస్తవంగా ఏం జరిగిందో తెలియదు: శ్యామల
కర్నూలు బస్సు ప్రమాద దుర్ఘటనకు అసలు కారణాలు తనకు తెలియవని.. వైకాపా ప్రతినిధులు ఇచ్చిన స్క్రిప్టే చదివానని ఆ పార్టీ అధికార ప్రతినిధి శ్యామల తేల్చిచెప్పారు. - 
                                    
                                        

ముక్కంటికి కార్తిక హారతి
ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంలో కార్తిక మాసోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. రెండో కార్తిక సోమవారాన్ని పురస్కరించుకొని ఆలయ పుష్కరిణి వద్ద నిర్వహించిన లక్ష దీపోత్సవం కనుల పండువగా జరిగింది. 
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

ట్రంప్ టారిఫ్లకు ‘నీల్’ చెక్ పెట్టేనా..! ఎవరీ భారత సంతతి లాయర్..?
 - 
                        
                            

సామాజిక మాధ్యమాల్లో తప్పుడు పోస్టులను సహించం: మంత్రి అనిత
 - 
                        
                            

అమెరికాలో హైర్ బిల్లు అమల్లోకి వస్తే.. భారత ఆర్థిక వ్యవస్థకు ఇబ్బందే: కాంగ్రెస్
 - 
                        
                            

తెదేపా క్రమశిక్షణ కమిటీ ముందుకు తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి
 - 
                        
                            

ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ వర్షం
 - 
                        
                            

అధికారంలోకి వస్తే.. మహిళల ఖాతాల్లోకి రూ.30వేలు: తేజస్వీ యాదవ్
 


