Airtel: జియో బాటలోనే ఎయిర్టెల్.. టారిఫ్ల పెంపు

దిల్లీ: జియో బాటలోనే ఎయిర్టెల్ సైతం తమ మొబైల్ సేవల టారిఫ్లను పెంచుతున్నట్లు శుక్రవారం ప్రకటించింది. జులై 3 నుంచి కొత్త రేట్లు అమల్లోకి వస్తాయని కంపెనీ తెలిపింది. ప్లాన్ల రకం, వ్యాలిడిటీని బట్టి పెంపు 10-21% వరకు ఉన్నట్లు వెల్లడించింది. ఒక్కో వినియోగదారుడిపై వచ్చే ఆదాయం (ARPU) రూ.300కు పైగా ఉండాల్సిన అవసరం ఉందని తెలిపింది. అందులోభాగంగానే టారిఫ్లను పెంచుతున్నట్లు వెల్లడించింది.
పెంపు ద్వారా వచ్చిన ఆదాయాన్ని మరింత మెరుగైన సేవలు అందించేందుకు ఉపయోగిస్తామని తెలిపింది. పెంపు రోజుకు 70 పైసల కంటే తక్కువే ఉందని వివరించింది. ప్రీపెయిడ్ సహా పోస్ట్పెయిడ్ ప్లాన్ల ధరలను సైతం సవరించింది.
ప్రీపెయిడ్ ప్లాన్లు..
- రూ.199 ప్లాన్: గతంలో దీని ధర రూ.179. ఇందులో 2GB డేటా, అపరిమిత కాలింగ్, 28 రోజుల పాటు రోజుకు 100 SMSలు లభిస్తాయి.
 - రూ.509 ప్లాన్: ఇంతకుముందు ఈ ప్లాన్ ధర రూ.455. ఇది 6GB డేటా, అపరిమిత కాలింగ్, రోజుకు 100 SMSలను 84 రోజుల పాటు అందిస్తుంది.
 - రూ.1,999 ప్లాన్: గతంలో రూ.1,799. ఇందులో 24GB డేటా, అపరిమిత కాలింగ్, 365 రోజుల పాటు రోజుకు 100 SMSలు ఉంటాయి.
 - రూ.299 ప్లాన్: ఇంతకుముందు రూ.265. ఇది రోజుకు 1GB డేటా, అపరిమిత కాలింగ్, రోజుకు 100 SMSలు 28 రోజుల పాటు వస్తాయి.
 - రూ.349 ప్లాన్: ఇప్పటి వరకు దీని ధర రూ.299గా ఉంది. ఇందులో రోజుకు 1.5GB డేటా, అపరిమిత కాలింగ్, 28 రోజుల పాటు రోజుకు 100 SMSలు లభిస్తాయి.
 - రూ.409 ప్లాన్: ఇంతకుముందు రూ.359. ఇది రోజుకు 2.5GB డేటా, అపరిమిత కాలింగ్, రోజుకు 100 SMSలను 28 రోజుల పాటు అందిస్తుంది.
 - రూ.449 ప్లాన్: గతంలో రూ.399. ఇందులో రోజుకు 3GB డేటా, అపరిమిత కాలింగ్, 28 రోజుల పాటు రోజుకు 100 SMSలు ఉంటాయి.
 - రూ.579 ప్లాన్: ఇంతకుముందు దీని ధర రూ.479. ఇది రోజుకు 1.5GB డేటా, అపరిమిత కాలింగ్, 56 రోజుల పాటు రోజుకు 100 SMSలను ఇస్తుంది.
 - రూ.649 ప్లాన్: గతంలో రూ.549. ఇందులో రోజుకు 2GB డేటా, అపరిమిత కాలింగ్, 56 రోజుల పాటు రోజుకు 100 SMSలు ఉంటాయి.
 - రూ.859 ప్లాన్: ఇంతకుముందు ధర రూ.719. ఇది రోజుకు 1.5GB డేటా, అపరిమిత కాలింగ్, రోజుకు 100 SMSలను 84 రోజుల పాటు అందిస్తుంది.
 - రూ.979 ప్లాన్: గతంలో ధర రూ.839. ఇందులో రోజుకు 2GB డేటా, అపరిమిత కాలింగ్, 84 రోజుల పాటు రోజుకు 100 SMSలు వస్తాయి.
 - రూ.3,599 ప్లాన్: ఇంతకుముందు రూ.2,999. ఇది రోజుకు 2GB డేటా, అపరిమిత కాలింగ్, రోజుకు 100 SMSలు 365 రోజుల పాటు లభిస్తాయి.
 
రీఛార్జి ప్లాన్ల ధరలను పెంచిన జియో... ఎప్పటి నుంచి అంటే?
డేటా యాడ్-ఆన్ ప్లాన్లు..
- రూ.22 ప్లాన్: గతంలో దీని ధర రూ.19. ఇందులో ఒకరోజు వ్యాలిడిటీతో 1GB అదనపు డేటా ఉంటుంది.
 - రూ.33 ప్లాన్: ఇంతకుముందు రూ.29, దీంట్లో ఒక రోజు గడువుతో 2GB అదనపు డేటా లభిస్తుంది.
 - రూ.77 ప్లాన్: గతంలో రూ.65, ఇది బేస్ ప్లాన్ గడువు వ్యాలిడిటీతో 4GB అదనపు డేటాను అందిస్తుంది.
 
పోస్ట్పెయిడ్ ప్లాన్లు..
- రూ.449 ప్లాన్: ఈ ప్లాన్ రోల్ఓవర్, అపరిమిత కాలింగ్, రోజుకు 100 SMSలు, ఎక్స్ట్రీమ్ ప్రీమియం సబ్స్క్రిప్షన్తో 40GB డేటాను అందిస్తుంది.
 - రూ.549 ప్లాన్: ఇది రోల్ఓవర్తో 75GB డేటా, అపరిమిత కాలింగ్, రోజుకు 100 SMSలు, ఎక్స్ట్రీమ్ ప్రీమియం, 12 నెలల పాటు డిస్నీ+ హాట్స్టార్, 6 నెలలు అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ లభిస్తుంది.
 - రూ.699 ప్లాన్: కుటుంబాల కోసం, ఈ ప్లాన్లో 105GB డేటా రోల్ఓవర్, అపరిమిత కాలింగ్, రోజుకు 100 SMSలు, ఎక్స్ట్రీమ్ ప్రీమియం, 12 నెలల పాటు డిస్నీ+ హాట్స్టార్, 6 నెలలు అమెజాన్ ప్రైమ్, 2 కనెక్షన్ల కోసం వింక్ ప్రీమియం ఉన్నాయి.
 - రూ.1,199 ప్లాన్: పెద్ద కుటుంబాలకు, ఈ ప్లాన్ రోల్ఓవర్తో 190GB డేటా, అపరిమిత కాలింగ్, రోజుకు 100 SMSలు, ఎక్స్ట్రీమ్ ప్రీమియం, డిస్నీ+ హాట్స్టార్ 12 నెలల పాటు, అమెజాన్ ప్రైమ్ 4 కనెక్షన్లకు అందిస్తుంది.
 
ఈ కొత్త టారిఫ్లు భారతి హెక్సాకామ్ లిమిటెడ్తో సహా అన్ని సర్కిళ్లకు వర్తిస్తాయి. సవరించిన ధరలు జూలై 3 నుంచి ఎయిర్టెల్ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- 
                                    
                                        

క్యూ2 ఫలితాలు.. ఎయిర్టెల్ లాభం డబుల్
Airtel Q2 Results: ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్టెల్ మెరుగైన త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. - 
                                    
                                        

ఒడుదొడుకులు ఎదుర్కొని.. ఫ్లాట్గా ముగిసిన సూచీలు
Stock market: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఫ్లాట్గా ముగిశాయి. రోజంతా లాభనష్టాల మధ్య కదలాడాయి. - 
                                    
                                        

ఏఐకి సొంత తెలివి తెప్పించేందుకు ప్రయత్నించొద్దు.. మైక్రోసాఫ్ట్ AI చీఫ్ కీలక వ్యాఖ్యలు
Microsoft AI chief on AI consciousness: ఏఐకి సొంత తెలివితేటలు అబ్బేలా పరిశోధకులు, డెవలపర్లు చేస్తున్న ప్రయత్నాలను సులేమాన్ తప్పుబట్టారు. మనిషికి మాత్రమే నిజమైన ఎమోషన్లు ఉంటాయని పేర్కొన్నారు. - 
                                    
                                        

హీరో విడా నుంచి త్వరలో ఎలక్ట్రిక్ బైక్.. స్పోర్టీ లుక్తో టీజర్
Hero Vida Electric bike: విడా బ్రాండ్పై విద్యుత్ వాహన రంగంలోకి ప్రవేశించిన హీరో మోటోకార్ప్.. త్వరలో విద్యుత్ మోటార్ సైకిల్ను విడుదల చేయనుంది. - 
                                    
                                        

టాటా ట్రస్ట్స్ బోర్డు నుంచి తొలగింపు.. సవాల్ చేసిన మెహ్లీ మిస్త్రీ..!
Tata Trusts: టాటా ట్రస్ట్స్ బోర్డు నుంచి తొలగిన మెహ్లీ మిస్త్రీ న్యాయపోరాటం ప్రారంభించినట్లు తెలుస్తోంది. ముంబయి ఛారిటీ కమిషనర్ ఎదుట కేవియెట్ దాఖలు చేశారు. - 
                                    
                                        

మనీలాండరింగ్ కేసు.. అనిల్ అంబానీ ఇల్లు సహా రూ.3 వేల కోట్ల ఆస్తులు అటాచ్
Anil Ambani: మనీలాండరింగ్ కేసులో అనిల్ అంబానీకి చెందిన రూ.3వేల కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. - 
                                    
                                        

ఉద్యోగుల ప్రతిభను గుర్తించేందుకు ఎస్బీఐ-స్టార్ అవార్డులు
ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తమ ఉద్యోగుల ప్రతిభను గుర్తించేందుకు ప్రత్యేక అవార్డులను ప్రకటించింది. - 
                                    
                                        

పెట్రోలు విక్రయాలకు పండగ జోష్
పండగ సమయంలో ప్రయాణాలు పెరగడంతో అక్టోబరులో పెట్రోల్ అమ్మకాలు 5 నెలల గరిష్ఠానికి చేరాయి. అయితే ఇందుకు భిన్నంగా డీజిల్ వినియోగంలో స్తబ్దత కొనసాగిందని ప్రభుత్వ గణాంకాల ఆధారంగా తెలుస్తోంది. - 
                                    
                                        

భారత్కు సౌదీ అరేబియా ఫ్లైయెడీల్ విమానాలు
వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత విమానయాన విపణిపై ఆశతో, సౌదీ అరేబియాకు చెందిన ఫ్లైయెడీల్ 2026 తొలి త్రైమాసికం నుంచి ముంబయితో పాటు మన దేశంలోని పలు నగరాలకు విమానాలను ప్రారంభించనుంది. - 
                                    
                                        

ఓయో బోనస్ ఇష్యూ గడువు పొడిగింపు
బోనస్ ఇష్యూ కోసం దరఖాస్తుల తుది గడువును పొడిగించినట్లు ఆతిథ్య సేవల సంస్థ ఓయో వెల్లడించింది. నమోదుకాని ఈక్విటీ వాటాదార్ల కోసం గడువును నవంబరు 1 నుంచి 7వ తేదీకి పొడిగించినట్లు సంస్థ తెలిపింది. - 
                                    
                                        

సూచీలు పుంజుకోవచ్చు
భారత స్టాక్ మార్కెట్లు ఈ వారం పుంజుకునే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. నిఫ్టీ-50 తిరిగి తన 26,000 స్థాయిని అందుకోవచ్చని అంటున్నారు. - 
                                    
                                        

పసిడి ప్రతికూలమే!
పసిడి డిసెంబరు కాంట్రాక్టు ఈవారం రూ.1,22,890 కంటే ఎగువన చలించకుంటే ప్రతికూల ధోరణి కొనసాగుతుందని భావించవచ్చు. - 
                                    
                                        

సీఎంఎస్-03 ఉపగ్రహ ప్రయోగంలో అనంత్ టెక్నాలజీస్దీ పాత్ర
ఎల్వీఎం3-ఎం5 వాహక నౌక ద్వారా సీఎంఎస్-03 ఉప్రగహాన్ని విజయవంతంగా ప్రవేశపెట్టడం ద్వారా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో ఘనత సాధించిందని అనంత్ టెక్నాలజీస్ ఛైర్మన్ సుబ్బారావు పావులూరి తెలిపారు. - 
                                    
                                        

సంక్షిప్త వార్తలు (5)
ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాదిలో ఇప్పటివరకు టెక్ పరిశ్రమలో 218 కంపెనీలు లక్ష మందికి పైగా ఉద్యోగులను తొలగించినట్లు లేఆఫ్.ఎఫ్వైఐ గణాంకాలు చెబుతున్నాయి. - 
                                    
                                        

టైమ్ బ్యాంక్.. వృద్ధులకు అండగా వినూత్న ప్రాజెక్ట్
వృద్ధుల కోసం సపోర్ట్ నెట్వర్క్ ఏర్పాటుచేసే దిశగా కేరళ డెవలప్మెంట్ అండ్ ఇన్నోవేషన్ స్ట్రాటజిక్ కౌన్సిల్ (K-DISC) వినూత్న ఆలోచన చేసింది. తలస్సేరి ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులతో కలిసి ‘టైమ్ బ్యాంక్’ ప్రాజెక్ట్ను రూపొందించింది. 
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

బుద్ధుని పవిత్ర అవశేషాల ప్రదర్శన.. ఏటా మూడు రోజులే అవకాశం
 - 
                        
                            

జులన్ గోస్వామిగా అనుష్కశర్మ.. బయోపిక్ విడుదలకు సరైన సమయమిదే!
 - 
                        
                            

అడవి ఏనుగుల కట్టడికి సరికొత్త సాంకేతికత: పవన్ కల్యాణ్
 - 
                        
                            

ట్రావెల్స్ బస్సు బోల్తా.. ఇద్దరి మృతి.. పలువురికి గాయాలు
 - 
                        
                            

ఆ క్షణాలు ఇంకా వెంటాడుతున్నాయి: ఎయిరిండియా ప్రమాద మృత్యుంజయుడు
 - 
                        
                            

చేవెళ్ల దుర్ఘటన.. బస్సు డ్రైవర్ తప్పేం లేదు: ఆర్టీసీ ప్రకటన
 


