మస్క్‌ వేతన ప్యాకేజీ లక్ష కోట్ల డాలర్లు?

Eenadu icon
By Business News Desk Published : 06 Sep 2025 03:06 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

వాషింగ్టన్‌: టెస్లా సీఈఓ ఎలాన్‌ మస్క్‌ లక్ష కోట్ల డాలర్ల (దాదాపు రూ.88 లక్షల కోట్ల) వేతన ప్యాకేజీని అందుకునే అవకాశం ఉంది. వచ్చే పదేళ్లలో టెస్లా అనుకున్న లక్ష్యాలను చేరితే ఇది సాధ్యమని కంపెనీ విడుదల చేసిన పత్రాలను బట్టి తెలుస్తోంది. కార్ల ఉత్పత్తి నుంచి కంపెనీ మొత్తం విలువ వరకు నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరితే కనుక మస్క్‌ ఈ భారీ ప్యాకేజీని(షేర్ల బదిలీ ద్వారా) అందుకోగలరని ఎక్స్ఛేంజీలకిచ్చిన సమాచారంలో శుక్రవారం టెస్లా పేర్కొంది.  ఇందుకు కొన్ని షరతులు ఉన్నాయి. వచ్చే పదేళ్లలో కంపెనీ విలువను ప్రస్తుత లక్ష కోట్ల డాలర్ల నుంచి 8 లక్షల కోట్ల డాలర్లకు పెంచాలి. అపుడే 12% షేర్లు మస్క్‌కు బదిలీ అవుతాయి. టెస్లాతో కనీసం ఏడున్నరేళ్ల పాటు మస్క్‌ కొనసాగితేనే ఈ షేర్లను విక్రయించుకోవడానికి వీలవుతుంది. పూర్తి మొత్తాన్ని అందుకోవాలంటే 10 ఏళ్లు సంస్థలోనే ఉండాలి.  


టెస్లా తొలి కారు డెలివరీ

ముంబయి: అమెరికా విద్యుత్తు కార్ల సంస్థ టెస్లా, మనదేశంలో కార్ల డెలివరీని ప్రారంభించింది. ముంబయిలో ప్రారంభించిన షోరూం నుంచి మోడల్‌ వై తొలి కారును మహారాష్ట్ర రవాణా మంత్రి ప్రతాప్‌ సర్‌నాయక్‌ శుక్రవారం అందుకున్నారు. తన మనవడికి ఈ కారును బహుమతిగా అందిస్తానని వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని