Bank charges: ఐసీఐసీఐ, యెస్‌ బ్యాంక్‌లో మే 1 నుంచి కొత్త సర్వీస్‌ ఛార్జీలు!

Bank charges: సేవింగ్స్‌ ఖాతాకు సంబంధించిన పలు సేవలపై విధించే ఛార్జీలను ఐసీఐసీఐ, యెస్‌ బ్యాంకులు సవరించాయి. మే 1 నుంచి ఇవి అమల్లోకి రానున్నాయి.

Updated : 25 Apr 2024 16:24 IST

దిల్లీ: పలు ప్రముఖ దేశీయ బ్యాంకులు సేవింగ్స్‌ ఖాతా సర్వీస్‌ ఛార్జీలను సవరించాయి. ఐసీఐసీఐ, యాక్సిస్‌, యెస్‌ బ్యాంక్‌ ఆ జాబితాలో ఉన్నాయి. మే 1 నుంచి కొత్త రుసుములు అమల్లోకి రానున్నాయి. ఏయే సేవల ఛార్జీలు మారాయో బ్యాంకుల వారీగా చూద్దాం..

ఐసీఐసీఐ బ్యాంక్‌..

చెక్‌బుక్‌లు, ఐఎంపీఎస్‌ లావాదేవీలు, ఈసీఎస్‌/ఎన్‌ఏసీహెచ్‌ డెబిట్‌ రిటర్నుల వంటి ఛార్జీలను ఐసీఐసీఐ బ్యాంక్‌ సవరించింది.

  • డెబిట్‌ కార్డు ఫీజు: ఏడాదికి రూ.200; గ్రామీణ ప్రాంతాల్లో రూ.99
  • చెక్‌ బుక్‌: తొలి 25 చెక్‌లు ఉచితం. తర్వాత ప్రతీ చెక్‌కు రూ.4
  • డీడీ/పీఓ ఫీజు: రద్దు, డ్యూప్లికేట్‌, రీవ్యాలిడేషన్‌కు రూ.100
  • సిగ్నేచర్‌ అటెస్టేషన్‌: ఒక్కో అప్లికేషన్‌కు రూ.100
  • ఈసీఎస్‌/ఎన్‌ఏసీహెచ్‌ డెబిట్‌ రిటర్నులు: ఒక్కోసారికి రూ.500
  • స్టాప్‌ పేమెంట్‌: ఒక్కో చెక్‌కు రూ.100 (ఐవీఆర్, నెట్‌ బ్యాంకింగ్ ద్వారా చేస్తే ఉచితం)
  • ఖాతా మూసివేత, డెబిట్‌ కార్డు పిన్ రీజనరేషన్‌, డెబిట్‌ కార్డు డీ-హాట్‌లిస్టింగ్‌, బ్యాలెన్స్‌ సర్టిఫికెట్‌, ఇంట్రెస్ట్‌ సర్టిఫికెట్‌ వంటి సేవలకు ఎలాంటి రుసుము లేదు.

యెస్‌ బ్యాంక్‌..

యావరేజ్‌ మంత్లీ బ్యాలెన్స్‌ నిబంధనలు

  • సేవింగ్స్‌ ప్రో మ్యాక్స్‌: రూ.50,000. లేదంటే గరిష్ఠంగా రూ.1,000 వరకు ఛార్జి.

  • సేవింగ్స్‌ ప్రో ప్లస్‌, యెస్‌ ఎసెన్స్‌, యెస్‌ రెస్పెక్ట్‌: రూ.25,000. లేదంటే గరిష్ఠంగా రూ.750 ఛార్జి.

  • సేవింగ్స్‌ ప్రో: రూ.10,000. లేదంటే గరిష్ఠంగా రూ.750 ఛార్జి.

  • సేవింగ్స్‌ వాల్యూ, కిసాన్‌ ఎస్‌ఏ: రూ.5,000. లేదంటే గరిష్ఠంగా రూ.500 ఛార్జి.

  • మై ఫస్ట్‌ యెస్‌: రూ.2,500. లేదంటే గరిష్ఠంగా రూ.250 ఛార్జి.

డెబిట్‌ కార్డు ఛార్జీలు..

  • ఎలిమెంట్: రూ.299
  • ఎంగేజ్‌: రూ.399
  • ఎక్స్‌ప్లోర్‌: 599
  • రూపే (కిసాన్‌ అకౌంట్): రూ.149

ఏటీఎం లావాదేవీ ఛార్జీలు..

ఇతర బ్యాంకుల ఏటీఎంలలో నెలకు ఐదు లావాదేవీలు ఉచితం. తర్వాత ప్రతి ఆర్థిక లావాదేవీకి రూ.21, ఆర్థికేతర లావాదేవీకి రూ.10 రుసుము చెల్లించాలి.

యాక్సిస్‌ బ్యాంక్

యాక్సిస్‌ బ్యాంక్ సైతం తమ సేవింగ్స్‌ బ్యాంక్ ఖాతాల టారిఫ్‌ విధానాన్ని సవరించింది. ఈ మార్పులు ఏప్రిల్‌ 1 నుంచే అమల్లోకి వచ్చాయి.

యావరేజ్‌ మంత్లీ బ్యాలెన్స్‌..

ప్రియారిటీ సేవింగ్స్‌ అకౌంట్‌కు గతంలో ప్రతి త్రైమాసిక సగటు కనిష్ఠ బ్యాలెన్స్‌ పరిమితి రూ.2,00,000. ఇప్పుడు దాన్ని నెలకు సవరించింది. అంటే ప్రతినెల సగటు బ్యాలెన్స్‌ రూ.2,00,000 ఉండాలి. లేదంటే గరిష్ఠంగా ఖాతాను బట్టి రూ.600 రుసుము వసూలు చేస్తారు.

నగదు లావాదేవీ పరిమితి..

ప్రైమ్‌, లిబర్టీ, ప్రెస్టీజ్‌, ప్రియారిటీ సేవింగ్స్‌ ఖాతాల్లో నెలకు రూ.25,000 వరకు థర్డ్ పార్టీ లావాదేవీలు ఉచితం. తర్వాత ప్రతి రూ.1,000కి రూ.10 రుసుము చెల్లించాలి. ప్రైమ్‌, లిబర్టీ ఖాతాల్లో నెలకు ఐదు లావాదేవీలు- గరిష్ఠంగా రూ.1.5 లక్షల వరకు ఉచితం. ప్రెస్టీజ్‌లో ఐదు లావాదేవీలు- గరిష్ఠంగా రూ.2 లక్షలు, ప్రియారిటీలో ఏడు లావాదేవీలు- గరిష్ఠంగా రూ.7 లక్షల వరకు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. మరోవైపు వరుసగా రెండు నెలల పాటు శాలరీ ఖాతాలో వేతనం క్రెడిట్‌ కాకపోతే నెలకు రూ.100 ఫీజు చెల్లించాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని