JioHotStar: 1 బిలియన్ వీక్షకులే లక్ష్యం.. ఎయిర్టెల్, వొడాతో జియో చర్చలు
_1.webp)
JioHotStar | ఇంటర్నెట్ డెస్క్: క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 (IPL 2025) రేపటినుంచి ప్రారంభం కానుంది. ఈ తరుణంలో వీక్షకుల సంఖ్యను పెంచుకోవాలని జియో హాట్స్టార్ (JioHotstar) చూస్తోంది. మరిన్ని డేటా ప్లాన్లను అందుబాటులోకి తేవాలని చూస్తోంది. తన ప్లాట్ఫామ్ సబ్స్క్రిప్షన్ను జోడించాలని భావిస్తోంది. అందులోభాగంగా ప్రముఖ టెలికాం సంస్థలతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.
రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా.. టెలికాం సంస్థలు అందిస్తున్న డేటా ప్లాన్లతో జియో హాట్స్టార్ సబ్స్క్రిప్షన్ను బండిల్ చేయాలని చూస్తోంది. యూజర్ల సంఖ్యను పెంచుకొనేందుకు ఈ చర్య సాయపడుతుందని భావిస్తోంది. 2025 ఐపీఎల్లో టెలివిజన్, డిజిటల్ ప్లాట్ఫామ్లలో కలిపి 1 బిలియన్ కంటే ఎక్కువమంది వీక్షకులను చేరుకోవాలని జియోస్టార్ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలో చర్చలు జరపడం ప్రాధాన్యం సంతరించుకుంది. దీంతో టెలికాం డేటా వినియోగం గణనీయంగా పెరుగుతుందని పరిశ్రమ నిపుణులు అంచనా వేస్తున్నారు.
2024 ఐపీఎల్ సమయంలో జియో సినిమాలో వీక్షకుల సంఖ్య 620 మిలియన్లుగా నమోదైంది. స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్లో 541 మిలియన్లను తాకింది. రిలయన్స్కు చెందిన వయాకామ్ 18, స్టార్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ విలీనం తర్వాత ఏర్పడిన ‘జియోస్టార్’కు ఈ ఐపీఎల్ కీలకం. లీగ్ సమయంలో ప్రకటనలతో రూ.4,500 కోట్ల ఆదాయాన్ని పొందాలని చూస్తోంది. ఇప్పటికే 20 మంది స్పాన్సర్లను సొంతం చేసుకుంది.
జియోహాట్స్టార్తో ఎయిర్టెల్ కొత్త ప్లాన్లు
ఐపీఎల్ నేపథ్యంలో జియోహాట్స్టార్ సబ్స్క్రిప్షన్తో ఎయిర్టెల్ రెండు కొత్త డేటా ప్లాన్లను ప్రవేశపెట్టింది. 30 రోజుల వ్యాలిడిటీతో రూ.100 ప్లాన్ తీసుకొచ్చింది. ఓటీటీ సభ్యత్వంతో పాటు 5జీబీ డేటా ఇస్తోంది. ఎయిర్టెల్ తీసుకొచ్చిన మరో ప్లాన్ ధర రూ.195. 90 రోజుల వ్యాలిడిటీ, 15జీబీ డేటా పొందొచ్చు. వీటితో పాటు జియోహాట్స్టార్ సబ్స్క్రిప్షన్ లభిస్తుంది. ఐపీఎల్ కోసం జియో ఇప్పటికే పలు ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లను ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా రూ.100తో డేటా ప్లాన్ తీసుకొచ్చింది. 90 రోజుల వ్యాలిడిటీ, 5జీబీ డేటా అందిస్తోంది. అలాగే, రూ.299 కంటే ఎక్కువ మొత్తంతో రీఛార్జి చేసుకుంటే ఉచితంగా ఐపీఎల్ను వీక్షించొచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- 
                                    
                                        

చాట్జీపీటీ గో ఫ్రీ ప్లాన్ .. ఎలా పొందాలంటే?
Free ChatGPT Go Plan: ప్రముఖ కృత్రిమ మేధ సంస్థ ఓపెన్ ఏఐ తాజాగా భారత్లో ‘చాట్జీపీటీ గో’ సేవలను ఉచితంగా అందుబాటులోకి తీసుకొచ్చింది. - 
                                    
                                        

జియో యూజర్లకు ఫ్రీ జెమిని ప్రో ప్లాన్.. ఎలా పొందాలి?
ప్రముఖ టెలికాం సంస్థ జియో (Jio) తన యూజర్లకు గూగుల్ జెమినీ ప్రో ప్లాన్ను ఉచితంగా అందిస్తోంది. - 
                                    
                                        

జియో యూజర్లకు గుడ్న్యూస్.. 18 నెలల పాటు జెమిని ప్రో ప్లాన్ ఫ్రీ
Gemini Pro for jio users: రిలయన్స్ జియో యూజర్లకు గుడ్న్యూస్. జియో టెలికాం యూజర్లకు గూగుల్కు జెమినీ ప్రో (Gemini Pro) ప్లాన్ ఉచితంగా లభించనుంది. - 
                                    
                                        

శాంసంగ్ డిజిటల్ కార్ ‘కీ’.. ఫోన్తో మహీంద్రా SUV అన్లాక్, స్టార్ట్!
Samsung Digital car key: ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ శాంసంగ్ కనెక్టింగ్ ఫీచర్ను భారత్కు విస్తరించింది. శాంసంగ్ యూజర్లు త్వరలో తమ గెలాక్సీ స్మార్ట్ఫోన్ ద్వారా మహీంద్రా ఎలక్ట్రిక్ ఎస్యూవీలను అన్లాక్ చేసి, స్టార్ట్ చేయొచ్చు. - 
                                    
                                        

ఫేస్బుక్ తరహాలో వాట్సప్లోనూ కవర్ఫొటో
WhatsApp: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ వినియోగదారులకు మరో కొత్త ఫీచర్ను అందుబాటులోకి తీసుకురానుంది. - 
                                    
                                        

గూగుల్ పిక్సెల్ 10పై భారీ తగ్గింపు
Google Pixel 10 Price Drop: గూగుల్ తాజా ఫ్లాగ్షిప్ ఫోన్ పిక్సెల్ 10 ధర భారీగా తగ్గింది. - 
                                    
                                        

వికీపీడియాకు పోటీగా ఎలాన్ మస్క్ ఏఐ గ్రోకిపీడియా
Grokipedia goes live: బిలియనీర్ ఎలాన్ మస్క్ నేతృత్వంలోని ఏఐ అంకుర సంస్థ ‘ఎక్స్ఏఐ (xAI)’ తాజాగా మరో సంచలనానికి నాంది పలికింది. - 
                                    
                                        

వన్ప్లస్ 15 విడుదల.. త్వరలో భారత్కు.. స్పెసిఫికేషన్లు ఇవే!
OnePlus 15: ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ వన్ప్లస్ తన తదుపరి ఫ్లాగ్షిప్ ఫోన్ వన్ప్లస్ 15ను చైనాలో లాంచ్ చేసింది. - 
                                    
                                        

రూ.7 వేలకే లావా నుంచి షార్క్ 2 4జీ
Lava Shark 2 4G: దేశీయ మొబైల్ తయారీ కంపెనీ లావా (Lava) బడ్జెట్ ధరలో మరో కొత్త మొబైల్ను భారత్లో లాంచ్ చేసింది. - 
                                    
                                        

వాట్సప్ చాట్ విండోలోనే ఇక స్టోరేజ్ మేనేజ్మెంట్
ఇంటర్నెట్ డెస్క్: మెటాకు చెందిన ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ తమ యూజర్లకు స్టోరేజ్ మేనేజ్మెంట్ను మరింత సులభం చేయనుంది. - 
                                    
                                        

వన్ప్లస్ 15, ఐకూ 15.. నవంబర్లో రాబోయే ఫోన్లు ఇవే..!
5 Best Upcoming Phones: స్మార్ట్ఫోన్ల మార్కెట్లో మళ్లీ కొత్త మోడళ్ల సందడి మొదలు కానుంది. పండగ వేళ కొత్త ఫోన్ల విడుదల తగ్గుముఖం పట్టగా.. మళ్లీ వేగం పుంజుకోనున్నాయి. - 
                                    
                                        

యాపిల్కి పోటీగా.. శాంసంగ్ నుంచి తొలి గెలాక్సీ XR హెడ్సెట్
Samsung Galaxy XR Headset: ప్రముఖ టెక్ దిగ్గజం శాంసంగ్ తన మొదటి ఎక్స్టెండెడ్ రియాలిటీ (XR) హెడ్సెట్ను ఆవిష్కరించింది. అక్టోబర్ 2025 గెలాక్సీ అన్ప్యాక్డ్ ఈవెంట్లో దీన్ని పరిచయం చేసింది. - 
                                    
                                        

పిక్సెల్ ఫోన్లు టెస్ట్ చేస్తారా?.. అభిమానులకు గూగుల్ ఆహ్వానం!
Google invites Superfans: టెక్ దిగ్గజం గూగుల్ తన పిక్సెల్ ఫోన్ అభిమానులకు అరుదైన అవకాశం కల్పిస్తోంది. ‘ట్రస్టెడ్ టెస్టర్ ప్రోగ్రామ్’ పేరుతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. - 
                                    
                                        

వాట్సప్లో యాంటీ స్పామ్ ఫీచర్.. ఆ మెసేజ్లపై లిమిట్!
Whatsapp anti spam: మెటాకు చెందిన ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ స్పామ్ మెసేజ్లను నియంత్రించేందుకు సిద్ధమవుతోంది. - 
                                    
                                        

గూగుల్ వన్ దీపావళి ఆఫర్.. రూ.11కే 2TB వరకు స్టోరేజ్!
Google One Diwali Offer: దీపావళి సందర్భంగా గూగుల్ వన్ ప్రత్యేక ఆఫర్ను ప్రకటించింది. ఇందులో భాగంగా రూ.11కే లైట్, బేసిక్, స్టాండర్డ్, ప్రీమియం ప్లాన్లను పొందొచ్చు. - 
                                    
                                        

ఇన్స్టాగ్రామ్లో దీపావళి స్పెషల్ ఎఫెక్ట్స్!
Instagram Diwali Themed Effects: వినియోగదారులకు దీపావళి సంబరాలను అందించేందుకు ఇన్స్టాగ్రామ్ ప్రత్యేక థీమ్తో ముందుకొచ్చింది. - 
                                    
                                        

హానర్ వినూత్న ప్రయత్నం.. రోబోటిక్ కెమెరాతో కొత్త స్మార్ట్ఫోన్
Honor: చైనాకు చెందిన మొబైల్ తయారీ సంస్థ హానర్ కొత్త తరహా స్మార్ట్ఫోన్ తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. - 
                                    
                                        

మరో కొత్త ఫీచర్కు వాట్సప్ రెడీ.. ఇకపై స్టేటస్కీ నోటిఫికేషన్!
WhatsApp New Feature: మెటాకు చెందిన ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ కొత్త ఫీచర్ను పరీక్షిస్తోంది. ఇందులో భాగంగా యూజర్లు.. తమకు ఇష్టమైన కాంటాక్టులు కొత్త స్టేటస్ పెట్టిన వెంటనే నోటిఫికేషన్ పొందగలరు. - 
                                    
                                        

టీనేజర్ల భద్రతకు ఇన్స్టాగ్రామ్ కొత్త చర్యలు.. సినిమా స్థాయిలో పరిమితులు
Instagram Teen Safety Update: మెటాకు చెందిన సోషల్ మీడియా ప్లాట్ఫాం ఇన్స్టా్గ్రామ్ టీనేజర్ల భద్రతను బలోపేతం చేసే దిశగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. - 
                                    
                                        

6 ఏళ్లు OS అప్డేట్స్+ సెక్యూరిటీ అప్డేట్స్తో శాంసంగ్ M17
Samsung Galaxy M17 5G: ప్రముఖ స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ శాంసంగ్ ఎం సిరీస్లో మరో కొత్త ఫోన్ను లాంచ్ చేసింది. శాంసంగ్ గెలాక్సీ ఎం17 5జీ (Samsung Galaxy M17 5G) పేరిట దీన్ని తీసుకొచ్చింది. 
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

చిన్నారితో అసభ్య ప్రవర్తన.. హైదరాబాద్లో డ్యాన్స్ మాస్టర్ అరెస్టు
 - 
                        
                            

తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ విధానంపై అధ్యయనానికి కమిటీ ఏర్పాటు
 - 
                        
                            

బిహార్ అసెంబ్లీ పోరు.. ముగిసిన తొలిదశ ప్రచారం
 - 
                        
                            

విద్యార్థులతో కాళ్లు నొక్కించుకున్న టీచర్ సస్పెండ్
 - 
                        
                            

రోడ్డెక్కిన సీఎం.. ‘ఎస్ఐఆర్’కు వ్యతిరేకంగా నిరసనలు
 - 
                        
                            

ఛత్తీస్గఢ్లో రెండు రైళ్లు ఢీ.. పలువురు మృతి
 


