Sundar Pichai: గూగుల్లో మళ్లీ వ్యక్తిగత ఇంటర్వ్యూలు
ఏఐ సాధనాలతో మోసం చేస్తున్న వారికి కళ్లెం
కనీసం ఒక విడత నేరుగా ముఖాముఖి

దిల్లీ: దృశ్య మాధ్యమ (వర్చువల్) విధానంలో ఇంటర్వ్యూలు నిర్వహించి ఉద్యోగ నియామకాలు జరుపుతుంటే, నమ్మదగిన వ్యక్తులు సంస్థలోకి రావడం లేదని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. అందుకే గూగుల్లో మళ్లీ వ్యక్తిగత ఇంటర్య్వూలు నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. మంచి నైపుణ్యం కలిగిన వ్యక్తులను నిర్ధారించుకోవడానికి, అభ్యర్థులను కనీసం ఒక విడత వ్యక్తిగత ఇంటర్వ్యూలతో పరీక్షించాలని గూగుల్ యోచిస్తోందని పిచాయ్ తెలిపారు.
ఆన్లైన్లో ఎందుకు వద్దంటే..: కృత్రిమ మేధ (ఏఐ) సమస్య చాలా విస్తృతంగా వ్యాపించినందున, సాఫ్ట్వేర్ ఇంజినీర్లకు రిమోట్ జాబ్ ఆన్లైన్ ఇంటర్వ్యూలను నిర్వహించవద్దని గూగుల్ ఉద్యోగులు కంపెనీ యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఉద్యోగంలోకి వచ్చిన తర్వాత అభ్యర్థులు రియల్-టైమ్ కోడింగ్ సవాళ్లను పరిష్కరించాల్సి ఉంటుందని, ఆన్లైన్ ఇంటర్వ్యూల సమయంలో కెమేరా బయట ఏఐ సాధనాలను ఉపయోగించడం వల్ల అభ్యర్థుల వాస్తవిక సత్తా తెలియడం లేదని వాపోయారు. దీనిపై గూగుల్ ఇప్పుడు పునరాలోచనలో పడింది.
గతంలో ఎందుకు నిర్వహించారు?: గూగుల్ గతంలో ఆన్లైన్ ఇంటర్వ్యూలను ఎందుకు ఇష్టపడిందంటే.. ప్రాథమిక సవాలును ఎదుర్కోవడం ఇష్టం లేకపోవడం వల్లే అని గూగుల్ వైస్ ప్రెసిడెంట్ బ్రియాన్ ఓంగ్ అంగీకరించారు. వర్చువల్ ఇంటర్వ్యూలు రెండు వారాల పాటు వేగంగా షెడ్యూల్ చేయడం సులభమని తెలిపారు. దీంతో శ్రమ, సమయం, వ్యయాలు తగ్గుతాయని పేర్కొన్నారు. అయితే ఆన్లైన్ ఇంటర్వ్యూ ప్రక్రియలో ఏఐ ఇప్పుడు ఎలా ప్రభావం చూపుతుందో సమగ్రంగా పర్యవేక్షించడానికి మేము కచ్చితంగా ఇంకా ఎక్కువగా దీనిపై పని చేయాల్సి ఉంటుందని ఆయన వెల్లడించారు.
మోసం చేస్తోంది 50% కంటే ఎక్కువే: ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థుల్లో 50% కంటే ఎక్కువ మంది ఏఐ సాధనాల సాయంతో మోసం చేస్తున్నారని నియామక నిర్వాహకులు పేర్కొంటున్నారని ఒక నివేదిక వెల్లడించింది. ‘మనమందరం హైబ్రిడ్గా పని చేస్తున్నందున, ఇంటర్య్వూలలో కొంత భాగాన్ని వ్యక్తిగతంగా నిర్వహించడంపై ఆలోచించడం మంచిదని నేను భావిస్తున్నాను. గూగుల్ సంస్కృతిని అభ్యర్థులు అర్థం చేసుకోవడానికి కూడా ఇది సహాయపడుతుందని అనుకుంటున్నాన’ని పిచాయ్ వెల్లడించారు.
సమస్య అంతటా: ఈ సమస్య కేవలం గూగుల్కే పరిమితం కాలేదని, ‘పరిశ్రమ వ్యాప్త సంక్షోభం’గా మారుతున్న ఈ సమస్యను పరిష్కరించడానికి మార్గాలను అన్వేషిస్తున్నామని బ్రియాన్ ఓంగ్ వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- 
                                    
                                        

క్యూ2 ఫలితాలు.. ఎయిర్టెల్ లాభం డబుల్
Airtel Q2 Results: ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్టెల్ మెరుగైన త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. - 
                                    
                                        

ఒడుదొడుకులు ఎదుర్కొని.. ఫ్లాట్గా ముగిసిన సూచీలు
Stock market: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఫ్లాట్గా ముగిశాయి. రోజంతా లాభనష్టాల మధ్య కదలాడాయి. - 
                                    
                                        

ఏఐకి సొంత తెలివి తెప్పించేందుకు ప్రయత్నించొద్దు.. మైక్రోసాఫ్ట్ AI చీఫ్ కీలక వ్యాఖ్యలు
Microsoft AI chief on AI consciousness: ఏఐకి సొంత తెలివితేటలు అబ్బేలా పరిశోధకులు, డెవలపర్లు చేస్తున్న ప్రయత్నాలను సులేమాన్ తప్పుబట్టారు. మనిషికి మాత్రమే నిజమైన ఎమోషన్లు ఉంటాయని పేర్కొన్నారు. - 
                                    
                                        

హీరో విడా నుంచి త్వరలో ఎలక్ట్రిక్ బైక్.. స్పోర్టీ లుక్తో టీజర్
Hero Vida Electric bike: విడా బ్రాండ్పై విద్యుత్ వాహన రంగంలోకి ప్రవేశించిన హీరో మోటోకార్ప్.. త్వరలో విద్యుత్ మోటార్ సైకిల్ను విడుదల చేయనుంది. - 
                                    
                                        

టాటా ట్రస్ట్స్ బోర్డు నుంచి తొలగింపు.. సవాల్ చేసిన మెహ్లీ మిస్త్రీ..!
Tata Trusts: టాటా ట్రస్ట్స్ బోర్డు నుంచి తొలగిన మెహ్లీ మిస్త్రీ న్యాయపోరాటం ప్రారంభించినట్లు తెలుస్తోంది. ముంబయి ఛారిటీ కమిషనర్ ఎదుట కేవియెట్ దాఖలు చేశారు. - 
                                    
                                        

మనీలాండరింగ్ కేసు.. అనిల్ అంబానీ ఇల్లు సహా రూ.3 వేల కోట్ల ఆస్తులు అటాచ్
Anil Ambani: మనీలాండరింగ్ కేసులో అనిల్ అంబానీకి చెందిన రూ.3వేల కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. - 
                                    
                                        

ఉద్యోగుల ప్రతిభను గుర్తించేందుకు ఎస్బీఐ-స్టార్ అవార్డులు
ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తమ ఉద్యోగుల ప్రతిభను గుర్తించేందుకు ప్రత్యేక అవార్డులను ప్రకటించింది. - 
                                    
                                        

పెట్రోలు విక్రయాలకు పండగ జోష్
పండగ సమయంలో ప్రయాణాలు పెరగడంతో అక్టోబరులో పెట్రోల్ అమ్మకాలు 5 నెలల గరిష్ఠానికి చేరాయి. అయితే ఇందుకు భిన్నంగా డీజిల్ వినియోగంలో స్తబ్దత కొనసాగిందని ప్రభుత్వ గణాంకాల ఆధారంగా తెలుస్తోంది. - 
                                    
                                        

భారత్కు సౌదీ అరేబియా ఫ్లైయెడీల్ విమానాలు
వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత విమానయాన విపణిపై ఆశతో, సౌదీ అరేబియాకు చెందిన ఫ్లైయెడీల్ 2026 తొలి త్రైమాసికం నుంచి ముంబయితో పాటు మన దేశంలోని పలు నగరాలకు విమానాలను ప్రారంభించనుంది. - 
                                    
                                        

ఓయో బోనస్ ఇష్యూ గడువు పొడిగింపు
బోనస్ ఇష్యూ కోసం దరఖాస్తుల తుది గడువును పొడిగించినట్లు ఆతిథ్య సేవల సంస్థ ఓయో వెల్లడించింది. నమోదుకాని ఈక్విటీ వాటాదార్ల కోసం గడువును నవంబరు 1 నుంచి 7వ తేదీకి పొడిగించినట్లు సంస్థ తెలిపింది. - 
                                    
                                        

సూచీలు పుంజుకోవచ్చు
భారత స్టాక్ మార్కెట్లు ఈ వారం పుంజుకునే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. నిఫ్టీ-50 తిరిగి తన 26,000 స్థాయిని అందుకోవచ్చని అంటున్నారు. - 
                                    
                                        

పసిడి ప్రతికూలమే!
పసిడి డిసెంబరు కాంట్రాక్టు ఈవారం రూ.1,22,890 కంటే ఎగువన చలించకుంటే ప్రతికూల ధోరణి కొనసాగుతుందని భావించవచ్చు. - 
                                    
                                        

సీఎంఎస్-03 ఉపగ్రహ ప్రయోగంలో అనంత్ టెక్నాలజీస్దీ పాత్ర
ఎల్వీఎం3-ఎం5 వాహక నౌక ద్వారా సీఎంఎస్-03 ఉప్రగహాన్ని విజయవంతంగా ప్రవేశపెట్టడం ద్వారా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో ఘనత సాధించిందని అనంత్ టెక్నాలజీస్ ఛైర్మన్ సుబ్బారావు పావులూరి తెలిపారు. - 
                                    
                                        

సంక్షిప్త వార్తలు (5)
ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాదిలో ఇప్పటివరకు టెక్ పరిశ్రమలో 218 కంపెనీలు లక్ష మందికి పైగా ఉద్యోగులను తొలగించినట్లు లేఆఫ్.ఎఫ్వైఐ గణాంకాలు చెబుతున్నాయి. - 
                                    
                                        

టైమ్ బ్యాంక్.. వృద్ధులకు అండగా వినూత్న ప్రాజెక్ట్
వృద్ధుల కోసం సపోర్ట్ నెట్వర్క్ ఏర్పాటుచేసే దిశగా కేరళ డెవలప్మెంట్ అండ్ ఇన్నోవేషన్ స్ట్రాటజిక్ కౌన్సిల్ (K-DISC) వినూత్న ఆలోచన చేసింది. తలస్సేరి ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులతో కలిసి ‘టైమ్ బ్యాంక్’ ప్రాజెక్ట్ను రూపొందించింది. 
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

పోలీసుల అదుపులో మద్యం కేసు ఏ-20 నిందితుడు
 - 
                        
                            

బుద్ధుని పవిత్ర అవశేషాల ప్రదర్శన.. ఏటా మూడు రోజులే అవకాశం
 - 
                        
                            

జులన్ గోస్వామిగా అనుష్కశర్మ.. బయోపిక్ విడుదలకు సరైన సమయమిదే!
 - 
                        
                            

అడవి ఏనుగుల కట్టడికి సరికొత్త సాంకేతికత: పవన్ కల్యాణ్
 - 
                        
                            

ట్రావెల్స్ బస్సు బోల్తా.. ఇద్దరి మృతి.. పలువురికి గాయాలు
 - 
                        
                            

ఆ క్షణాలు ఇంకా వెంటాడుతున్నాయి: ఎయిరిండియా ప్రమాద మృత్యుంజయుడు
 


