Digital Payments: ఆ మాటలు నమ్మితే ఖాతా ఖాళీ చేస్తారు
నేటి డిజిటల్ యుగంలో ఆన్లైన్ బ్యాంకింగ్ వ్యవస్థలో ఎంతో పురోగతిని చూస్తున్నాం. ఇదే సమయంలో సైబర్ నేరగాళ్ల వ్యూహాలూ మారిపోతున్నాయి. రోజుకో కొత్త విధానంతో ఖాతాదారులను మోసం చేస్తున్నారు.
నేటి డిజిటల్ యుగంలో ఆన్లైన్ బ్యాంకింగ్ వ్యవస్థలో ఎంతో పురోగతిని చూస్తున్నాం. ఇదే సమయంలో సైబర్ నేరగాళ్ల వ్యూహాలూ మారిపోతున్నాయి. రోజుకో కొత్త విధానంతో ఖాతాదారులను మోసం చేస్తున్నారు. బ్యాంకు నుంచి మాట్లాడుతున్నాం అంటూనే మన ద్వారానే అన్ని వివరాలూ తెలుసుకొని, ఖాతాలను ఖాళీ చేసేస్తున్నారు. పెరిగిపోతున్న బ్యాంకింగ్ మోసాలపై బ్యాంకులూ ఆందోళన చెందుతున్నాయి. పలు రకాలుగా వస్తున్న స్కాములను అర్థం చేసుకోవాలంటూ ఖాతాదారులకు హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో బ్యాంకింగ్, డిజిటల్ చెల్లింపుల్లో ఎదురవుతున్న కొన్ని మోసాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం.
బ్యాంకులు ఎప్పుడూ మీకు నేరుగా ఫోన్ చేయవు... ఈ ఒక్క విషయాన్ని గుర్తించండి అంటూ.. ఒక వైపు బ్యాంకులు, మరోవైపు సైబర్ నిపుణులూ చెబుతున్నా చాలామంది బ్యాంకు నుంచి ఫోను అనగానే ఆందోళన చెందుతారు. వాళ్లు అడిగిన వివరాలు వెంటవెంటనే చెప్పేస్తారు. ఓటీపీలు ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పకూడదు అని అంటున్నా ఆ సందర్భంలో అది గుర్తుకు రాదు. దీంతోపాటు మోసగాళ్లు సందేశాలనూ పంపించి, లింకులపై క్లిక్ చేయాల్సిందిగా చెబుతున్నారు.
‘ఏపీకే’ను పంపిస్తూ..
ఫోన్లను తమ గుప్పిట్లోకి తీసుకోవడం ద్వారా మొత్తం సమాచారాన్ని తస్కరించడంతో పాటు, బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. ఇందుకోసం ఆండ్రాయిడ్ అప్లికేషన్ ప్యాకేజీ (ఏపీకే)లను పంపిస్తున్నారు. వీటిని క్లిక్ చేయగానే ఫోన్లో ఇన్స్టాల్ అవుతాయి. ఇక అక్కడి నుంచి ఇక మన ఫోన్ హ్యాకర్ల చేతికి వెళ్లినట్లే. ఈ ఏపీకే మోసాలపై అప్రమత్తంగా ఉండాలంటూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసీఐసీఐ బ్యాంకులు తమ ఖాతాదారులకు సూచనలు జారీ చేశాయి. ముఖ్యంగా కేవైసీ అప్డేట్, రివార్డు పాయింట్లను తీసుకోవడం లాంటి వాటి పేరుతో ఇవి వస్తున్నాయని జాగ్రత్తగా ఉండాలని పేర్కొన్నాయి. తాము ఎట్టి పరిస్థితుల్లోనూ లింకులు సందేశాల్లో పంపించమని చెబుతున్నాయి.
ఎలా గుర్తించాలి?: మొబైల్ ఫోన్కు సందేశం రూపంలో వచ్చిన ఏపీకేను ఇన్స్టాల్ చేయడం ఎప్పుడూ మంచిది కాదు. ఇది కేవలం కొన్ని కేబీల్లోనే ఉంటుంది. ఫోన్లో ఇన్స్టాల్ చేయగానే ఫోన్ నంబర్లు, యాప్లు, కెమేరాలాంటివన్నీ ఉపయోగించుకోవడానికి అనుమతులు అడుగుతుంటుంది. వీటిని బట్టి, అది మోసం అని అర్థం చేసుకోవచ్చు.
కేవలం గూగుల్ ప్లేస్టోర్ నుంచి అధీకృత యాప్లను మాత్రమే ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోవడం ఎప్పుడూ మంచిది.
సందేశాలతో..
బ్యాంకు నుంచి వివిధ పథకాలు, బీమా ఉత్పత్తులకు సంబంధించిన సమాచారంతో సందేశాలు వస్తుంటాయి. నిజమేననుకొని, ఆ లింకులను క్లిక్ చేస్తే.. మన వ్యక్తిగత సమాచారాన్ని నమోదు చేయాల్సిందిగా కోరుతుంటాయి. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని పంజాబ్ నేషనల్ బ్యాంకు తమ ఖాతాదారులకు సూచించింది. బీమా పాలసీలను విక్రయించడం కోసం ప్రత్యేకంగా ఎవరినీ నియమించుకోలేదని స్పష్టం చేసింది. అవసరమైతే బ్యాంకు శాఖను సంప్రదించాలని తెలిపింది.
ఓటీపీలతో జాగ్రత్త
బ్యాంకు నుంచి వచ్చిన ఓటీపీల విషయంలో జాగ్రత్త పాటించాలని యాక్సిస్ బ్యాంకు, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు సూచించాయి. ఖాతాదారులు ఏదైనా లావాదేవీ చేసినప్పుడే ఓటీపీలు వస్తాయని, దాన్ని నమోదు చేయడం ద్వారా ఆ లావాదేవీ పూర్తవుతుందని పేర్కొన్నాయి. ఎలాంటి ఆన్లైన్ లావాదేవీలు చేయకుండా ఓటీపీ వచ్చిందంటే అనుమానించాల్సిందేనని, వెంటనే బ్యాంకు సేవా కేంద్రానికి ఫోన్ చేయాలని బ్యాంకులు చెబుతున్నాయి.
క్విషింగ్ బారిన పడొద్దు..
ఇదో కొత్త రకం మోసం. ఖాతాదారుల ఫోన్కు ఏదో ఒక క్యూఆర్ కోడ్ వస్తుంది. ఇందులో మోసపూరిత వెబ్సైటు లింకులు ఉంటాయి. క్యూఆర్ కోడ్లో ఏముందో తెలుసుకునే ప్రయత్నం చేయగానే ఆ వెబ్సైటు తెరుచుకొని, మన సమాచారాన్ని ఆరా తీయడం మొదలుపెడతాయి. చూడ్డానికి ఇవి బ్యాంకు వెబ్సైట్ల మాదిరిగానే ఉంటాయి. కొన్నిసార్లు క్యూఆర్ కోడ్ను ఓపెన్ చేయగానే డబ్బులు పంపించేందుకు పిన్ను నమోదు చేయాలని అడుగుతాయి. ఏమరుపాటులో పిన్ నమోదు చేశామా.. అంతే సంగతులు.
మన కష్టార్జితం అంతా బ్యాంకు ఖాతాలోనే ఉంటుంది. కాబట్టి, ప్రతి విషయంలోనూ అప్రమత్తంగా ఉండక తప్పదు. మోసపోయినట్లు అనుమానం వచ్చిన వెంటనే సంబంధిత బ్యాంకు సేవా కేంద్రాన్ని సంప్రదించాలి. వీలైనంత వేగంగా సైబర్ క్రైం స్టేషన్లో ఫిర్యాదు చేయాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈ రుసుములు గమనించారా?
క్రెడిట్ కార్డును వాడుతున్నారా? తాజాగా వచ్చిన మీ కార్డు బిల్లును పరిశీలనగా చూశారా? చాలామంది క్రెడిట్ కార్డు బిల్లును సరిగా చూడకుండానే చెల్లిస్తుంటారు. -
బ్యాంకు అప్పు ఇవ్వనంటే...
అత్యవసరంలో కొన్నిసార్లు అప్పు చేయడం తప్పనిసరి అవుతోంది. అన్ని సందర్భాల్లోనూ బ్యాంకులు రుణం ఇవ్వకపోవచ్చు. ముఖ్యంగా వ్యక్తిగత రుణానికి సంబంధించి.. -
444 రోజుల అమృత్ వృష్టి
కొత్త పెట్టుబడి పథకాలు ఎన్ని వస్తున్నా, పెట్టుబడికీ, రాబడికీ హామీ ఉండే ఫిక్స్డ్ డిపాజిట్ల (ఎఫ్డీ) ప్రత్యేకతే వేరు. కాస్త అధిక రాబడినిచ్చే ఎఫ్డీలపై సీనియర్ సిటిజన్లతోపాటు, యువత సైతం ఆసక్తి చూపిస్తుంటారు. -
కారు రుణాలపై ఏ బ్యాంకులో వడ్డీ రేట్లు ఎంతెంత?
దాదాపుగా అన్ని బ్యాంకులు వాహన రుణాలందిస్తున్నాయి. ఈ రుణాలకై వివిధ బ్యాంకులు వసూలు చేసే వడ్డీ రేట్లు ఇక్కడ చూద్దాం. -
డీమ్యాట్ ఖాతా ఈ పొరపాట్లు చేయొద్దు
ఆర్థిక ప్రపంచంలోకి తొలి అడుగు పొదుపు ఖాతాతోనే ప్రారంభం అవుతుంది. ఇదే విధంగా స్టాక్ మార్కెట్లోకి ప్రవేశించాలనుకునే వారు డీమ్యాట్ ఖాతాతోనే తమ పెట్టుబడుల ప్రయాణాన్ని మొదలుపెడతారు. -
క్రెడిట్ కార్డులు రివార్డులు తగ్గుతున్నాయి
ఏడాది క్రితం వరకూ క్రెడిట్ కార్డులను ఎంత వాడితే.. అన్ని రివార్డు పాయింట్లు వచ్చేవి. వార్షిక రుసుములు రద్దయ్యేవి. చాలామంది వీటికోసమే డబ్బులున్నా సరే.. క్రెడిట్ కార్డులతోనే లావాదేవీలు చేసేవారు. -
స్థిరమైన రాబడి కోసం..
కెనరా రొబెకో మ్యూచువల్ ఫండ్ కొత్తగా బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్ను ఆవిష్కరించింది. ‘కెనరా రొబెకో బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్’ అనే ఈ పథకం ఎన్ఎఫ్ఓ ఈ నెల 26 వరకూ అందుబాటులో ఉంటుంది. -
ఇంటి పునరుద్ధరణ కోసం రుణం ఎలా పొందాలి?
ఇంటిని పునరుద్ధరించడం వల్ల దానికి మరింత ఆధునికతను జోడించవచ్చు. అయితే, దీనికి బాగానే ఖర్చవుతుంది, కాబట్టి రుణం తీసుకోవడం మేలు. ఈ రుణాన్ని పొందడానికి ఎలాంటి విషయాలను పరిగణనలోకి తీసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం. -
ఎస్బీఐ, బీఓబీ నుంచి స్పెషల్ ఎఫ్డీ స్కీమ్స్.. వారికి 7.75% వడ్డీ
SBI, BOB new FDs: ప్రభుత్వరంగ బ్యాంకులైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా కొత్త ఫిక్స్డ్ డిపాజిట్ పథకాలను తీసుకొచ్చాయి. -
వ్యక్తిగత రుణాల వడ్డీ రేట్లు ఎంతెంత?
ప్రస్తుతం అన్ని బ్యాంకులు వ్యక్తిగత రుణాలను అందిస్తున్నాయి. వివిధ బ్యాంకులు వసూలు చేసే వడ్డీ రేట్లు ఎంతెంతో ఇక్కడ చూద్దాం... -
ఎస్బీఐ లోన్లు మరింత ప్రియం.. MCLR 10 పాయింట్లు పెంపు!
SBI Loans: రుణరేట్లను ఎస్బీఐ సవరించింది. ఎంసీఎల్ఆర్ ఆధారిత రేట్లను 0.10 శాతం మేర పెంచింది. -
ఉన్నత విద్యకు విద్యా రుణాలు ఎలా సహాయపడతాయి?
ఉన్నత విద్య సురక్షితమైన, సుసంపన్నమైన జీవితానికి ప్రవేశ ద్వారం లాంటిది. దీన్ని పొందడానికి బ్యాంకులిచ్చే విద్యారుణాలు ఎంతగానో ఉపయోగపడతాయి. -
ఫిక్స్డ్ డిపాజిట్లు.. అధిక వడ్డీ అందుతోందా?
గత కొన్నాళ్లుగా ఫిక్స్డ్ డిపాజిట్లపై అధిక వడ్డీ రేట్లు కొనసాగుతున్నాయి. చాలా బ్యాంకులు 7.15-7.25 శాతం వరకూ వడ్డీని అందిస్తున్నాయి. సీనియర్ సిటిజన్లకు దీనిపై అర శాతం అధికంగానే ఉంటుంది. -
ఆన్లైన్లో ఇన్స్టంట్ లోన్.. ఈ అంశాలు పరిశీలించాల్సిందే..!
ఆన్లైన్లో ఇన్స్టంట్ లోన్ తీసుకునే ముందు దరఖాస్తుదారులు గుర్తుంచుకోవలసిన ముఖ్య విషయాలను ఇక్కడ తెలుసుకుందాం. -
హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్.. 13న ఈ సర్వీసులు పనిచేయవ్!
HDFC Bank downtime: జులై 13న హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కస్టమర్లకు కొన్ని సర్వీసులు అందుబాటులో ఉండవు. ఆ వివరాలు తెలుసుకోండి. -
స్టెప్- అప్ హోమ్లోన్ గురించి తెలుసా? ఎవరికి ప్రయోజనకరం?
Step- up home loan: హోమ్లోన్ తీసుకోవాలనుకుంటున్నారా? ఇంతకీ స్టెప్- అప్ హోమ్లోన్ గురించి తెలుసా? -
విద్యుత్తు ఉపకరణాల సంస్థల్లో
విద్యుత్తు రంగంలో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా విద్యుత్తు సరఫరా, పంపిణీ విభాగాల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన వినియోగం పెరుగుతోంది. -
ఎఫ్డీలపై వడ్డీ రేట్లను సవరించిన ఐసీఐసీఐ బ్యాంక్
ప్రముఖ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ రూ.3 కోట్ల వరకు ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరించింది. -
క్రెడిట్ కార్డు రూల్స్లో మార్పులు.. ఈ జాబితాలో మీ బ్యాంక్ ఉందా?
Credit card rules: క్రెడిట్ కార్డులకు సంబంధించి బ్యాంకులు కొన్ని మార్పులు చేశాయి. జులై నుంచే ఆ మార్పులు అమల్లోకి రానున్నాయి. -
చికిత్స కోసం అప్పు చేస్తున్నారా?
ఆరోగ్య అత్యవసరం ఎప్పుడు ఏ రూపంలోనైనా రావచ్చు. దీనికి ఆర్థికంగా అన్ని వేళలా సిద్ధంగా ఉండాలి. ఆరోగ్య బీమా ఉన్నప్పుడు కొంత భరోసాగా ఉంటుంది. -
బంగారు రుణాలపై వడ్డీ రేట్లు ఏ బ్యాంకులో ఎంతెంత?
సురక్షితమైన రుణం కాబట్టి, బ్యాంకులు బంగారంపై సరసమైన వడ్డీ రేట్లకు వేగంగా రుణాలందిస్తున్నాయి. వివిధ బ్యాంకులు వసూలు చేసే వడ్డీ రేట్లు ఇక్కడ చూద్దాం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
-
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
-
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
-
గూగుల్కు పోటీగా కొత్త సెర్చింజిన్.. తీసుకొచ్చిన చాట్జీపీటీ ఓనర్
-
రైటర్గా నాని.. జోరందుకున్న ప్రచారం
-
తెదేపా కొనసాగి ఉంటే 2021లోనే పోలవరం పూర్తయ్యేది: సీఎం చంద్రబాబు