Stock market: లాభాల్లో ముగిసిన సూచీలు.. 26వేల ఎగువకు నిఫ్టీ

Eenadu icon
By Business News Team Published : 29 Oct 2025 15:58 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

Stock market | ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు, అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ కీలక వడ్డీ రేట్లు తగ్గిస్తుందన్న అంచనాలతో సూచీలు రాణించాయి. భారత్‌తో త్వరలో వాణిజ్య ఒప్పందం ఖరారు కానుందంటూ ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలూ పాజిటివ్‌ సెంటిమెంట్‌కు కారణమయ్యాయి. ముఖ్యంగా మెటల్‌, ప్రైవేట్‌ బ్యాంకింగ్‌, ఎనర్జీ, ఫార్మా రంగాల షేర్లలో కొనుగోళ్ల మద్దతు కనిపించింది. ఆటో స్టాక్స్‌ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ఈ క్రమంలోనే సెన్సెక్స్‌ ఇంట్రాడేలో 85 వేల మార్కు దాటగా.. నిఫ్టీ 26 వేల ఎగువన ముగిసింది.

సెన్సెక్స్‌ ఉదయం 84,663.68 పాయింట్ల వద్ద (క్రితం ముగింపు 84,628.16) స్వల్ప లాభాల్లో ప్రారంభమైంది. రోజంతా లాభాల్లోనే కొనసాగింది. ఇంట్రాడేలో 85,105.83 వద్ద గరిష్ఠాన్ని తాకిన సూచీ.. చివరికి 368.97 పాయింట్ల లాభంతో 84,997.13 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 117.70 పాయింట్ల లాభంతో 26,053..90 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ  88.21గా ఉంది. సెన్సెక్స్‌ 30 సూచీలో అదానీ పోర్ట్స్‌, ఎన్టీపీసీ, పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, టాటా స్టీల్‌ ప్రధానంగా లాభపడ్డాయి. బీఈఎల్‌, ఎటెర్నల్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా, బజాజ్‌ ఫైనాన్స్‌, మారుతీ సుజుకీ షేర్లు నష్టాలు చవిచూశాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ 64.48 డాలర్ల వద్ద కొనసాగుతుండగా.. బంగారం ఔన్సు మళ్లీ 4 వేల డాలర్ల ఎగువకు చేరింది. ప్రస్తుతం 4027 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని