Tesla: త్వరలో హైదరాబాద్, ఇతర నగరాల్లోకి టెస్లా

Eenadu icon
By Business News Desk Updated : 12 Aug 2025 05:58 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

దిల్లీ: అమెరికాకు చెందిన ఎలక్టిక్ర్‌ కార్ల తయారీ సంస్థ టెస్లా భారత్‌లో మరో షోరూమ్‌ తెరిచింది. దేశ రాజధాని దిల్లీలో తన రెండో షోరూమ్‌ను సోమవారం ప్రారంభించింది. సుమారు 8,200 చదరపు అడుగుల విస్తీర్ణంలో దీనిని అందుబాటులోకి తెచ్చారు. సాకేత్, నోయిడా, ఆరిజన్‌ తదితర ప్రాంతాల్లో ఈ సూపర్‌ఛార్జర్ల ఏర్పాటుకు ప్రణాళికలు రచిస్తోంది. ఇప్పటికే ముంబయిలో తొలి షోరూమ్‌ను ఓపెన్‌ చేసిన టెస్లా.. కొన్ని రోజుల క్రితమే మొదటి సూపర్‌ ఛార్జర్‌ స్టేషన్‌ను ప్రారంభించింది. హైదరాబాద్, పుణె, చెన్నై, బెంగళూరు, అహ్మదాబాద్, జయపుర వంటి ఎనిమిది నగరాల్లోనూ ఛార్జింగ్‌ నెట్‌వర్‌ను విస్తరించనుంది. 

ధర ఇలా

వీ4 సూపర్‌ఛార్జర్‌తో ఛార్జింగ్‌ చేయడానికి కిలోవాట్‌కు రూ.24 వసూలు చేస్తారు. 11 కిలోవాట్‌అవర్‌ స్పీడ్‌ ఉన్న ఏసీ ఛార్జింగ్‌కు కిలోవాట్‌ ధర రూ.11గా నిర్ణయించారు. ఈ వీ4 సూపర్‌ ఛార్జర్‌ ద్వారా కొత్తగా లాంచ్‌ చేసిన టెస్లా మోడల్‌ వై కారును కేవలం 15 నిమిషాల పాటు ఛార్జ్‌ చేసి 267 కి.మీ. ప్రయాణించొచ్చు. దేశీయ మార్కెట్‌లో దీనిని రెండు వేరియంట్లలో అందుబాటులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. ఆర్‌డబ్ల్యూడీ వేరియంట్‌ ప్రారంభ ధర రూ.59.89 లక్షలు, లాంగ్‌ రేంజ్‌ మోడల్‌ ధర రూ.67.89 లక్షలుగా కంపెనీ తెలిపింది. ఈ కారును ఒకసారి ఛార్జ్‌ చేస్తే 500-600 కి.మీ. వరకు ప్రయాణించవచ్చు.

Tags :
Published : 12 Aug 2025 05:57 IST

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని