తేనెటీగల దాడిలో ఒకరి మృతి

తేనెటీగల దాడిలో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం కోనాయపల్లిలో చోటుచేసుకుంది. గ్రామస్థుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కొందరు స్నేహితులు

Published : 19 May 2022 05:17 IST

కేశంపేట, న్యూస్‌టుడే: తేనెటీగల దాడిలో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం కోనాయపల్లిలో చోటుచేసుకుంది. గ్రామస్థుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కొందరు స్నేహితులు సరదాగా గడిపేందుకు మంగళవారం సాయంత్రం ఓవెంచర్‌లోని చెట్టు వద్దకు వెళ్లారు. ఆ సమయంలో వచ్చిన ఈదురు గాలులకు చెట్టుకున్న తేనెపట్టు కదిలి తేనెటీగలు ఒక్కసారిగా లేచాయి. సొప్పరి సందీప్‌(32)ను భారీ సంఖ్యలో ఈగలు కుట్టాయి. అస్వస్థతకు గురవడంతో తోటి స్నేహితులు ఆయన్ని శంషాబాద్‌లోని ఓ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అదేరోజు రాత్రి మృతి చెందారని గ్రామస్థులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని