రుణమాఫీ చేయకపోతే అధికారం ఎందుకు?
పంట రుణమాఫీకి రూ.40 వేల కోట్లు అవుతుందని, కాళేశ్వరంలో భారాస నేతలు దోచుకున్న రూ.లక్ష కోట్ల కన్నా, హైదరాబాద్ చుట్టూ దోచుకున్న భూముల విలువ కన్నా అది ఎక్కువ కాదని పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పేర్కొన్నారు.
ఆగస్టు 15లోపు చేసి తీరుతాం
హరీశ్రావు సవాల్ను స్వీకరిస్తున్నా
రాజీనామా లేఖను సీస పద్యంలా రాస్తారా?
పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్రెడ్డి
ఈనాడు, హైదరాబాద్: పంట రుణమాఫీకి రూ.40 వేల కోట్లు అవుతుందని, కాళేశ్వరంలో భారాస నేతలు దోచుకున్న రూ.లక్ష కోట్ల కన్నా, హైదరాబాద్ చుట్టూ దోచుకున్న భూముల విలువ కన్నా అది ఎక్కువ కాదని పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పేర్కొన్నారు. ఆగస్టు 15లోగా రూ.2 లక్షల రుణమాఫీ చేయకపోతే తమకు అధికారం ఎందుకని ప్రశ్నించారు. శుక్రవారం తన నివాసంలో కాంగ్రెస్ మీడియా విభాగం ఛైర్మన్ సామ రామ్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ సోషల్ మీడియా వారియర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో రేవంత్ ప్రసంగించారు. ‘‘ఆగస్టు 15లోగా రుణమాఫీ చేస్తామని, రాజీనామా చిట్టీ జేబులో పెట్టుకొమ్మని హరీశ్రావుకు చెప్పా. మోసం చేయాలనుకున్న ప్రతిసారీ ఆయనకు అమరవీరుల స్తూపం గుర్తుకొస్తుంది. గతంలో ఎప్పుడైనా అక్కడికి వెళ్లారా? ఈ రోజు స్తూపం వద్దకు వెళ్లి అబద్ధాలు చెప్పారు. రాజీనామా లేఖ స్పీకర్ ఫార్మాట్లో ఉండాలి. సీస పద్యంలా రాస్తే చెల్లుతుందా? హరీశ్రావు సవాల్ను స్వీకరిస్తున్నాం. ఆగస్టు 15లోపు రుణమాఫీ చేసి తీరుతాం. మోదీ, కేసీఆర్లకు మూడోసారి పదవులు కావాలట. వంద రోజుల్లో ఆరు గ్యారంటీల్లోని ఐదు హామీలు అమలు చేసిన కాంగ్రెస్ దిగిపోవాలని అంటున్నారు. రాష్ట్రంలో కష్టపడి తెచ్చుకున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రలు జరుగుతున్నాయి. రేవంత్రెడ్డి దిగిపోతే చాలు.. ఎవరున్నా ఓకే అని భారాస నేతలు భావిస్తున్నారు. నన్ను చూస్తేనే ఒంటిపై జెర్రులు పాకినట్లుగా కేసీఆర్, కేటీఆర్ భావిస్తున్నారు. అందుకే ఎవరితోనైనా కలుస్తామంటున్నారు. ఈ ఎన్నికల్లో 12 సీట్లు గెలిస్తే ఏడాదిలో రాష్ట్రంలో భారాస ప్రభుత్వం వస్తుందని కేటీఆర్ అంటున్నారు. ఎలా వస్తుంది? తండ్రి పేరు చెప్పుకొని నేనేమైనా అమెరికా నుంచి వచ్చి కూర్చున్నానా? ఎన్నికల్లో భాజపా, భారాస కుట్రలను తిప్పికొట్టాలి. ఈ ఎన్నికల్లో భాజపా గెలిస్తే రిజర్వేషన్లు రద్దవుతాయి. అవి కొనసాగాలంటే కాంగ్రెస్కు ఓటేయాలి. ఈ విషయాన్ని ప్రజలకు పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలు వివరించాలి.
ఈ ఎన్నికలు కీలకం..
దేశాన్ని భాజపా నుంచి రక్షించుకోవాలి. ప్రజాస్వామాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకునేందుకు ఈ ఎన్నికలు కీలకం. 14 సీట్లు నెగ్గడమో, కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడమో, రాహుల్ ప్రధాని కావడమో ముఖ్యం కాదు. రాహుల్ కుటుంబానికి సొంతిల్లు కూడా లేదు. రాజ్యాంగంలో సమూల మార్పులు తెచ్చి రిజర్వేషన్లు రద్దు చేయాలనే కుట్ర జరుగుతోంది. ఇప్పటికే రూ.60 లక్షల కోట్ల విలువ చేసే సంస్థలను రూ.6 లక్షల కోట్లకే అమ్మేశారు. దేశం రూ.168 లక్షల కోట్ల అప్పుల్లో ఉంది. కేసీఆర్ రూ.7 లక్షల కోట్లు, మోదీ రూ.113 లక్షల కోట్ల అప్పులు చేశారు. ఈ డబ్బు ఎక్కడికి పోయిందంటే మోదీ చెప్పరు. అడిగితే రామాలయం కట్టామంటారు. కేసీఆర్ కూడా అప్పుల సొమ్ము ఎక్కడికి పోయిందంటే జైతెలంగాణ అనేవారు.
లాలూప్రసాద్ చెప్పిన గాడిద కథ..
లాలూప్రసాద్ గతంలో ఒక కథ చెప్పారు. ఒక రజకునికి ఒక గాడిద ఉండేదట. దానిపై ఉన్న దుప్పటిపై రాముడి బొమ్మ ఉండేది. అది పొలం మేయడానికి పోతే రాముడి బొమ్మ ఉందని ఎవరూ ఏమీ అనేవారు కాదు. ఒకసారి దుప్పటి గాలికెగిరిపోయింది. అప్పుడు అదే గాడిద పొలంలో మేస్తోంటే.. ఓ రైతు కర్రతో కొడితే దాని నడుం విరిగింది. అలాగే భాజపా నేతలు రాముడి ముసుగు వేసుకుని తిరిగినంతకాలం ప్రజలు మద్దతిచ్చారు. ఇప్పుడు ఆ ముసుగు తొలగిపోయింది. ఇప్పుడిక భాజపా నడుం విరగడం ఒక్కటే మిగిలిఉంది. శ్రీరామనవమిని ఓ పెద్ద సమస్యగా చిత్రీకరించడానికి భాజపా ప్రయత్నం చేస్తోంది. బతుకమ్మ, బోనాలు ఎత్తుకోవడం కవిత నేర్పినట్లు.. శ్రీరామనవమి, హనుమాన్ జయంతి చేసుకోవడం బండి సంజయ్ లేదా అర్వింద్ నేర్పినట్లు ఈరోజు వ్యవహరిస్తున్నారు. ఇలాంటి విషయాలను సమయస్ఫూర్తితో తిప్పికొట్టాలి.
ట్వంటీ-20 మ్యాచ్ల్లాగా పనిచేయాలి
క్రికెట్లో గతంలో టెస్ట్ మ్యాచ్లకు ఎక్కువ ఆదరణ ఉండేది. కాలక్రమేణా వాటికి ఆదరణ తగ్గడంతో వన్డే మ్యాచ్లను తెచ్చారు. ఇప్పుడు ట్వంటీ-20లు ఆడిస్తున్నారు. ట్వంటీ-20ల్లో ధాటిగా ఆడకపోతే మ్యాచ్ చేజారిపోయే ప్రమాదం ఉంటుంది. అదేవిధంగా సోషల్ మీడియా ఏదైనా అంశాన్ని ఒక్క సెకన్ కూడా ఆలస్యం కాకుండా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగం గట్టిగా పనిచేసినందునే అసెంబ్లీ ఎన్నికల్లో అనుకూల ఫలితం వచ్చింది. చాలా గ్రామాల్లో తిరిగి ఉపన్యాసాలు ఇచ్చినందుకే ప్రభుత్వం వచ్చిందని చాలామంది నాయకులు అనుకుంటారు. ఎన్ని గంటలు ఉపన్యాసాలిచ్చినా కోట్ల మందికి చేరవేసింది సోషల్ మీడియానే’’ అని సీఎం పేర్కొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారాస ఓట్లు భాజపాకు మళ్లింది 10% లోపే
రాష్ట్రంలో ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో భారాస ఓట్లు భాజపాకు మళ్లింది ఐదు నుంచి పది శాతంలోపే అని పీసీసీ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ తన తుది నివేదికలో పేర్కొంది. -
కాంగ్రెస్ సోషల్ మీడియా బృందానికి సీఎం రేవంత్రెడ్డి విందు
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కాంగ్రెస్ సోషల్ మీడియా బృందంతో గురువారం కాసేపు కాలక్షేపం చేశారు. పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఆయన గాంధీభవన్లో పార్టీ సామాజిక మాధ్యమ బృందంతో సమావేశమై... అసెంబ్లీ ఎన్నికల్లో బాగా పనిచేశారని ప్రశంసించారు. -
తెలంగాణలో 12 ఎంపీ స్థానాలు భాజపాకే.. నల్గొండలో అత్యధిక మెజార్టీ: ఈటల
తెలంగాణ యువత ప్రధాని మోదీ పాలన పట్ల ఆకర్షితులయ్యారని మాజీ మంత్రి, మల్కాజిగిరి లోక్సభ భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. -
తెలంగాణలో నిశ్శబ్ద విప్లవం
‘‘పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లో నిశ్శబ్ద విప్లవం కనిపించింది. మేం కచ్చితంగా డబుల్ డిజిట్ సీట్లు సాధిస్తాం. ఈ ఎన్నికలతో భాజపా ఒక ప్రత్యామ్నాయ శక్తిగా అవతరించబోతోంది. -
కాంగ్రెస్, భారాసలకు దిమ్మదిరిగే తీర్పు రాబోతోంది: బండి సంజయ్
లోక్సభ ఎన్నికల తీర్పుతో కాంగ్రెస్, భారాస నేతల దిమ్మదిరగడం ఖాయమని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ అన్నారు. -
ఒడిశా ఎన్నికల ప్రచారంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీతో కలిసి తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బుధవారం ఒడిశాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. -
ఆ నియోజకవర్గాల్లో పోలింగ్ అంతంతే..
లోక్సభ ఎన్నికల పోలింగ్లో కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో పాత కథే పునరావృతమైంది. పోలింగ్ తక్కువగా నమోదయ్యే 26 అసెంబ్లీ నియోజకవర్గాలపై ఎన్నికల సంఘం (ఈసీ) ప్రత్యేక దృష్టి పెట్టింది. -
భాజపా అబద్ధాలను ప్రచారం చేస్తోంది
పదేళ్ల పాటు దేశాన్ని పాలించిన భాజపా ఏం చేసిందో ఈ ఎన్నికల్లో చెప్పకుండా అబద్ధాలను ప్రచారం చేయడం దురదృష్టకరమని, దీన్ని ప్రజలు గమనించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. -
సైలెంట్ ఓటింగ్ భారాసకే అనుకూలం: కేటీఆర్
లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో భారాస అభ్యర్థులే విజయం సాధిస్తారని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. -
మీరు చెప్పే ప్రేమను పంచడం అంటే ఇదేనా రాహుల్ జీ?: కేటీఆర్
నాగర్కర్నూలు జిల్లాలోని అచ్చంపేటలో తమ పార్టీ నేతలపై కాంగ్రెస్ నాయకులు దాడులు చేశారని.. దీన్ని ఖండిస్తున్నట్లు భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. -
రుణమాఫీ చేయకుంటే కాంగ్రెస్లో ‘ఆగస్టు సంక్షోభం’!
లోక్సభ ఎన్నికల్లో భారాస ఒక్క సీటు కూడా గెలిచే పరిస్థితి లేదని, ఆ పార్టీకి డిపాజిట్లు కూడా రావని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ పేర్కొన్నారు. -
కరీంనగర్ ఫలితాలతో భారాస, కాంగ్రెస్లకు షాక్: బండి సంజయ్
కరీంనగర్ లోక్సభ ఫలితాలు కాంగ్రెస్, భారాసలకు షాక్ ఇవ్వబోతున్నాయని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. -
భాజపాకు 12 స్థానాలు ఖాయం: ఈటల
తెలంగాణలో భాజపా శక్తిమంతంగా ఉందని, జూన్ 4న సర్వే సంస్థలకు అందని ఫలితాలు ఉంటాయని ఆ పార్టీ మల్కాజిగిరి లోక్సభ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. -
భారాసను కేసీఆర్ కాంగ్రెస్లో ఎందుకు విలీనం చేస్తారు?
భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీలో భారాస విలీనమవుతుందని భాజపా నేత కె.లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలు ఆయన రాజకీయ అవగాహనారాహిత్యానికి నిదర్శనమని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేర్కొన్నారు. -
సీఎంను కలిసిన లోక్సభ అభ్యర్థులు
లోక్సభ అభ్యర్థులు చామల కిరణ్కుమార్రెడ్డి, వంశీచంద్రెడ్డి, నీలం మధు తదితరులు రేవంత్ను మంగళవారం కలిసి కృతజ్ఞతలు తెలిపారు. -
గిరిజనుల చెంతకే పోలింగ్ కేంద్రం
చెంచుపెంటల్లో ఓటింగ్ పెంచేందుకు అధికారులు చేసిన ప్రయత్నం ఫలించింది. నాగర్కర్నూల్ జిల్లా పదర మండలం లోతట్టు అటవీ ప్రాంతంలో కృష్ణానది తీరంలో ఉన్న గీసగండి చెంచుపెంట గ్రామంలో తొలిసారిగా పోలింగ్ కేంద్రం ఏర్పాటైంది. -
స్ట్రాంగ్ రూంలకు చేరిన ఈవీఎంలు
సాయుధ బలగాల పహారా నడుమ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల భవితవ్యం భద్రంగా ఉంది. రాష్ట్రంలోని లోక్సభ ఎన్నికల్లో పోలైన ఓట్లకు సంబంధించిన ఈవీఎంలు, వీవీప్యాట్ యంత్రాలను మంగళవారం తెల్లవారుజాము వరకు 44 స్ట్రాంగ్ రూంలలో అధికారులు భద్రపరిచారు. -
నిర్ణయాత్మక శక్తిగా ప్రాంతీయ పార్టీలు
పార్లమెంటు ఎన్నికల్లో దేశంలో ప్రాంతీయ పార్టీలే నిర్ణయాత్మక శక్తిగా మారనున్నాయని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పేర్కొన్నారు. -
దేశంలో ఇండియా కూటమిదే విజయం
‘కొన్ని పార్టీలు ఆర్థిక, సామాజిక భావజాలాలను పక్కనపెట్టి రాజకీయాలకు సంబంధం లేని అంశాలను ప్రజల్లోకి జొప్పించి లబ్ధి పొందే ప్రయత్నం చేశాయి.. అయినా, కాంగ్రెస్ మాత్రమే ప్రజాస్వామ్యం కోసం పోరాటాలు చేస్తూ తమ పక్షాన నిలబడుతుందని ప్రజలు గుర్తించారు. -
తెలంగాణలో 65.67% పోలింగ్
తెలంగాణలోని 17 లోక్సభ నియోజకవర్గాల్లో 65.67% పోలింగ్ నమోదైంది. ఇది 2019 లోక్సభ ఎన్నికల(62.72%)తో పోలిస్తే 2.95% ఎక్కువ. -
9-13 స్థానాలు గెలుస్తాం
రాష్ట్రంలో రాజకీయాలు, ఆరోపణల పర్వం ముగిసిందని బుధవారం నుంచి పూర్తిగా వంద శాతం పరిపాలనపైనే దృష్టి సారిస్తామని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు.
![img](https://assets.eenadu.net/_assets/_images/banners/general-ele-1.png)
![img](https://assets.eenadu.net/_assets/_images/banners/general-ele-6.png)
![img](https://assets.eenadu.net/_assets/_images/banners/general-ele-7.png)
![img](https://assets.eenadu.net/_assets/_images/banners/general-ele-4.png)
తాజా వార్తలు
-
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
-
సౌదీ అరేబియాలో దుర్భర జీవితం.. బాధితుడిని కాపాడిన మంత్రి లోకేశ్
-
అగ్నిపథ్ పథకంపై విపక్షాల విమర్శలు.. ఖండించిన మోదీ
-
మెక్సికన్ డ్రగ్ లార్డ్ ఇస్మాయిల్ ‘ఎల్ మాయో’ జంబాడ అరెస్ట్
-
26 మంది హత్య.. మృతదేహాలను నదిలోకి ఈడ్చుకెళ్లిన మొసళ్లు..!
-
2034 నాటికి అలాంటి ఉద్యోగాలు ఉండవ్.. లింక్డిన్ వ్యవస్థాపకుడి అంచనా!