Road Accident: హుజూరాబాద్లో విషాదం.. ఇద్దరు యువతులు, యువకుడు మృతి
హుజూరాబాద్లో విషాదం చోటుచేసుకుంది. ట్రక్కు బోల్తాపడి అందులోని మట్టి బైక్పై వస్తున్న ముగ్గురిపై పడింది. దీంతో వారు మృతిచెందారు.
కరీంనగర్: హుజూరాబాద్లో విషాదం చోటుచేసుకుంది. టిప్పర్ బోల్తాపడి అందులో ఉన్న మట్టి మీద పడడంతో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు యువతులు, ఒక యువకుడు మృతి చెందారు. ఈ సంఘటన హుజూరాబాద్లోని బోర్నపల్లిలో శుక్రవారం అర్ధరాత్రి దాటాక చోటుచేసుకుంది. సైదాపూర్ మండలం ఎలబోతారం గ్రామం నుంచి హుజూరాబాద్కు మట్టితో ట్రక్కు బయలుదేరింది. ఈ క్రమంలో బోర్నపల్లి మూలమలుపు వద్ద డ్రైవర్ బ్రేక్ వేయడంతో ట్రక్కు అదుపుతప్పింది. అదే సమయంలో బైక్పై వస్తున్న ముగ్గురు యువతీయువకులపై మట్టి పడింది. దీంతో వెంటనే వారిని హుజూరాబాద్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే విజయ్, సింధుజ ఇద్దరు మృతిచెందారు. వర్ష అనే యువతి చికిత్స పొందుతూ చనిపోయింది. మృతులు బోర్నపల్లికి చెందిన వారే. వారంతా పెద్దమ్మ బోనాల జాతరకు వెళ్లి ఇంటికి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింంది. మృతదేహాలను హుజూరాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సైబర్ నేరగాళ్ల చేతికి ‘మ్యూల్ ఖాతాలు’
సైబర్ నేరగాళ్లకు మ్యూల్ బ్యాంకు ఖాతాలు సమకూర్చుతున్న పెద్ద ముఠాలో కీలక సభ్యుడైన ఓ యువకుడిని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో(సీఎస్బీ) అధికారులు అరెస్టు చేశారు. -
రూ.5 కోట్ల విలువైన ద్రవరూప గంజాయి స్వాధీనం
అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలంలో రూ.5 కోట్ల విలువైన ద్రవరూప గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
సల్మాన్ ఇంటి వద్ద కాల్పుల ఘటన నిందితుడు కస్టడీలో ఆత్మహత్య
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద కాల్పుల ఘటనలో అరెస్టైన నిందితుల్లో ఒకరు పోలీసు కస్టడీలో ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టించింది. -
డ్రై ఐస్ తిని మూడేళ్ల బాలుడి మృతి
ఐస్గా భావించి డ్రై ఐస్ తినడంతో మూడేళ్ల బాలుడు మృతి చెందిన ఘటన చత్తీస్గఢ్లోని రాజ్నంద్గావ్లో చోటుచేసుకుంది. -
ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ మృతుల్లో ముగ్గురు తెలంగాణ మావోయిస్టులు
తెలంగాణ మావోయిస్టులకు ఛత్తీస్గఢ్లో మరోమారు ఎదురుదెబ్బ తగిలింది. మంగళవారం ఉదయం అబూజ్మడ్లో జరిగిన ఎన్కౌంటర్లో పది మంది మావోయిస్టులు మరణించిన సంగతి తెలిసిందే. -
ఫోన్ లాక్కొన్నారు.. అడ్డగిస్తే కత్తులతో పొడిచారు
చేతిలో ఉన్న ఫోన్ను లాక్కొని పోతున్న వారిని పట్టుకోబోయిన యువకుడిని నిందితులు కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేసిన విషాదకర ఘటన హైదరాబాద్ గుడిమల్కాపూర్ ఠాణా పరిధిలో జరిగింది.