AP News: పిడుగుపడి ఇల్లు దగ్ధం.. కాలిపోయిన రూ.25 లక్షలు

పిడుగుపాటుతో తాటాకిల్లు దగ్ధమై అందులో ఉంచిన రూ.25 లక్షల నగదు కాలిపోయిన సంఘటన శనివారం పశ్చిమగోదావరి జిల్లా గురుభట్లగూడెంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కాళ్ల కృష్ణవేణి, ఆమె కుమారుడు ఇంట్లో ఉండగా పక్కనే

Updated : 19 Sep 2021 06:56 IST

చింతలపూడి గ్రామీణ, న్యూస్‌టుడే: పిడుగుపాటుతో తాటాకిల్లు దగ్ధమై అందులో ఉంచిన రూ.25 లక్షల నగదు కాలిపోయిన సంఘటన శనివారం పశ్చిమగోదావరి జిల్లా గురుభట్లగూడెంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కాళ్ల కృష్ణవేణి, ఆమె కుమారుడు ఇంట్లో ఉండగా పక్కనే ఉన్న గడ్డివామి నుంచి మంటలు చెలరేగాయి. ఇంటికి కూడా వ్యాపించడంతో పూర్తిగా దగ్ధమైంది. వీరు అప్రమత్తమై బయటకు వచ్చారు. ఇటీవలే భూమిని అమ్మగా వచ్చిన రూ.25 లక్షల నగదుతో పాటు బంగారం పూర్తిగా కాలిపోయాయని కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఫోన్‌ చేసినా అగ్నిమాపక సిబ్బంది ఆలస్యంగా స్పందించారని, అప్పటికే ఇల్లు పూర్తిగా దగ్ధమైందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని