నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు
ఉమ్మడి జిల్లాలో లోక్సభ ఎన్నికల పోరు ఆసక్తికరంగా సాగుతోంది. తండ్రుల రాజకీయ వారసత్వ తీర్థం పుచ్చుకొని ఎన్నికల క్షేత్రంలో పోరాడేందుకు యువ వారసులు సిద్ధమయ్యారు.
ఉమ్మడి జిల్లాలో లోక్సభ ఎన్నికల పోరు ఆసక్తికరంగా సాగుతోంది. తండ్రుల రాజకీయ వారసత్వ తీర్థం పుచ్చుకొని ఎన్నికల క్షేత్రంలో పోరాడేందుకు యువ వారసులు సిద్ధమయ్యారు. వరంగల్, మహబూబాబాద్తో పాటు భూపాలపల్లి జిల్లాలోని ఐదు నియోజకవర్గాలు కలిసి ఉన్న పెద్దపల్లిలోనూ రాజకీయ వారసులు ఎంపీ అభ్యర్థులుగా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వీరిలో ఇద్దరు రాజకీయాలకు కొత్త కాగా.. మరొకరు ఇప్పటికే ఎంపీగా కొనసాగుతున్నారు.
నాడు తండ్రి.. నేడు కుమార్తె
వరంగల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా కడియం కావ్య పోటీ చేస్తున్నారు. తండ్రి కడియం శ్రీహరి 2014-15 వరకు వరంగల్ ఎంపీగా పనిచేశారు. అనంతరం ఎంపీ పదవికి రాజీనామా చేసి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా రెండు సార్లు గెలుపొందారు. 2015-18 వరకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇటీవల స్టేషన్ఘన్పూర్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. గతంలో 1994, 1999, 2008 ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
రాజకీయ వారసురాలిగా..
మహబూబాబాద్ ఎంపీగా 2019లో గెలుపొందిన మాలోత్ కవిత ప్రస్తుతం భారాస అభ్యర్థిగా బరిలో నిలిచారు. కవిత తండ్రి ధరంసోతు రెడ్యానాయక్ డోర్నకల్ నియోజకవర్గం నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. తండ్రి నుంచి రాజకీయ వారసత్వంగా కుమార్తె ఎన్నికల క్షేత్రం వైపు అడుగులు వేశారు. ఆమె గతంలో మహబూబాబాద్ ఎమ్మెల్యేగా సైతం పని చేశారు.
కాకా చూపిన బాటలో..
పెద్దపల్లి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా గడ్డం వంశీకృష్ణ బరిలో నిలిచారు. వంశీ తండ్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, తాత గడ్డం వెంకటస్వామి (కాకా) ఈ స్థానంలోనే పోటీ చేసి గెలుపొందారు. గడ్డం వివేక్ వెంకటస్వామి 2009-2014 వరకు పెద్దపల్లి ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుతం చెన్నూర్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. పెద్దపల్లి నియోజకవర్గ పరిధిలో.. మంథని అసెంబ్లీ సెగ్మెంటులోని జయంశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం, మల్హర్, మహాముత్తారం, పలిమెల, మహదేవపూర్ మండలాలు ఉన్నాయి.
- న్యూస్టుడే, టేకుమట్ల
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పరుగెత్తి.. ఓటు విలువ చాటి..
[ 06-05-2024]
ఓటర్లను చైతన్యవంతం చేసి పోలింగ్శాతాన్ని పెంచాలనే లక్ష్యంతో వరంగల్ నగరంలో ఆదివారం ఏర్పాటు చేసిన 5కె రన్ ఉత్సాహంగా జరిగింది. హనుమకొండ జవహర్లాల్ నెహ్రూ స్టేడియం నుంచి అంబేడ్కర్ కూడలి, కాళోజీ సెంటర్ మీదుగా కలెక్టరేట్ వరకు పరుగు సాగింది. -
హోరెత్తనున్న ప్రచారం
[ 06-05-2024]
లోక్సభ ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తున్న క్రమంలో రాజకీయ పార్టీలు తమ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్, భాజపా, భారాస తమ పార్టీల అగ్రనేతలతో ఒకటి రెండు దఫాలు వరంగల్, మహబూబాబాద్ లోక్సభ స్థానాల్లో ప్రచారం చేశాయి. -
పరిశ్రమలు రావాలి.. ఓరుగల్లు మురవాలి
[ 06-05-2024]
ఉమ్మడి వరంగల్ విద్యా కేంద్రంగా ఎంతో ప్రసిద్ధి.. పరిశ్రమల్లో మాత్రం వెనుకబాటులో ఉంది. హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరమైన ఓరుగల్లులో ఐటీ సంస్థలు ఏర్పాటుచేస్తే ప్రగతి పరుగులు పెడుతుంది. గ్రానైట్, జౌళి, ఉక్కు తదితర రంగాల్లో ఇండస్ట్రీలను ఏర్పాటుచేసే అవకాశం ఉంది. పుష్కలంగా పంటలు పండే ఈ ప్రాంతంలో అనేక ఆహార శుద్ధి యూనిట్లు ప్రారంభించొచ్చు. -
ఎన్నికల వేళ.. మద్యం జోరు
[ 06-05-2024]
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో నాయకుల ప్రచారాలు వాడీవేడిగా సాగుతున్నాయి. ఒకవైపు ప్రత్యర్థులపై మాటల యుద్ధం చేస్తూనే మరో వైపు గెలుపుపై అస్త్రాలు సంధిస్తున్నారు. ఇవిగాక ప్రలోభాలనే ప్రధానంగా నమ్ముకుని ప్రచారం చేసే అవకాశం లేకపోలేదు. -
ఓటేశారు.. స్ఫూర్తి రగిలించారు..!
[ 06-05-2024]
అభివృద్ధిలో మన కన్నా దిగువన ఉన్న దేశాల్లో ఓటు హక్కు వినియోగం ఎక్కువ. మన దగ్గర ఓటు హక్కుపై చైతన్య పరిచేందుకు విభిన్న రూపాల్లో కార్యాచరణ చేపడుతున్నా నిర్లిప్తత వీడట్లేదు. సుపరిపాలన కావాలంటే రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి. -
భాజపా, భారాసలకు గుణపాఠం తప్పదు
[ 06-05-2024]
కుల, మతాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ లబ్ధిపొందాలనే కుటిల యత్నాలు చేస్తున్న భాజపా నుంచి దేశ ప్రజలకు రక్షణ కల్పించేందుకు వామపక్ష పార్టీల్లో ఒక్కటైన సీపీఎం ఇండియా కూటమిలో భాగస్వామ్యమైందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి, లోక్సభ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. -
చేసింది కొంత.. చేయాల్సింది కొండంత
[ 06-05-2024]
‘2021 ఏప్రిల్లో గ్రేటర్ వరంగల్ పరిధిలోని 66 డివిజన్ల కార్పొరేటర్ల పదవులకు ఎన్నికలు జరిగాయి. 2021 మే 6న మేయర్, ఉప మేయర్, కార్పొరేటర్లు ప్రమాణ స్వీకారం చేశారు.’ వరంగల్ మహా నగరపాలక సంస్థ పాలకవర్గం కొలువు తీరి (ప్రమాణ స్వీకారం) సోమవారంతో మూడేళ్లు పూర్తవుతుంది. -
కాంగ్రెస్ వచ్చాక పథకాలు ఆగాయి
[ 06-05-2024]
కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలను విస్మరించిందని, లోక్సభ ఎన్నికల్లో భారాసకు ఓటు వేసి గెలిపిస్తే ప్రభుత్వం మెడలు వంచి హామీలను అమలు చేయిస్తామని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. -
‘ప్రధాని మోదీ తెలంగాణకు చేసింది శూన్యం’
[ 06-05-2024]
రాష్ట్ర విభజన చట్టం హామీలను విస్మరించిన భాజపాకు లోక్సభ ఎన్నికల్లో ఓటమి తప్పదని, రాహుల్గాంధీ ప్రధాని కావడం ఖాయమని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య, వరంగల్ పశ్చిమ, వర్ధన్నపేట ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్రెడ్డి, కేఆర్ నాగరాజు అన్నారు. -
రైతుల దరి చేరని భూసార పరీక్షలు
[ 06-05-2024]
దిగుబడి అధికంగా రావాలని రైతులు మోతాదుకు మించి రసాయన ఎరువులు వాడుతున్నారు. నేల స్వభావాన్ని బట్టి ఏ పంట వేయాలి, ఏ ఎరువులు ఎంత వరకు వినియోగించాలో తెలియాలంటే కచ్చితంగా భూసార పరీక్ష చేయాల్సిందే. ప్రస్తుతం రసాయన ఎరువుల ధరలు అమాంతం పెరిగాయి. -
ఎట్టకేలకు తారు పడింది..!
[ 06-05-2024]
వెంకటాపురం మండలంలోని రాచపల్లి-మొట్లగూడెం రహదారికి ఎట్టకేలకు తారు పడింది. రూ.1.13 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ మార్గం ఏడాదిగా అసంపూర్తిగానే వెక్కిరించింది. -
వేసవి తాపం.. మారిన షిఫ్టు సమయం
[ 06-05-2024]
ఉపరితల గనుల్లో షిఫ్టు వేళలను సింగరేణి మార్పు చేసింది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న కారణంగా యాజమాన్యం ఉదయం, రెండో షిఫ్టు సమయాల్లో మార్పు చేసింది. సాధారణంగా ఉదయం షిఫ్టు 7 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 3 గంటలకు ముగుస్తుంది. -
ముందస్తుగా ఓటేశారు!
[ 06-05-2024]
లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఓ వైపు అభ్యర్థులు, రాజకీయ పార్టీల నాయకుల ప్రచారాలు.. మరో వైపు ఈ నెల 13న పోలింగ్ నిర్వహించేందుకు అధికారుల ఏర్పాట్లు కొనసాగుతుండగానే ఓటింగ్ ప్రక్రియ మొదలైంది. -
‘భాజపా, భారాసలకు ఓటేస్తే మురిగిపోతుంది’
[ 06-05-2024]
లోక్సభ ఎన్నికల్లో భాజపా, భారాసలకు ప్రజలు ఓటేస్తే మురిగిపోతుందే తప్ప.. పనికిరాదని వరంగల్ లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య అన్నారు. -
అనారోగ్యంతో ఓటరు.. బాధ్యత మరవలేదు!
[ 06-05-2024]
మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గ పరిధిలోని డోర్నకల్, మహబూబాబాద్లో ఆదివారం నుంచి ‘ఇంటి నుంచి ఓటు’ కార్యక్రమం ప్రారంభమైంది. డోర్నకల్కు చెందిన ఓటరు వెంకటేశ్వరరావు రెండేళ్లుగా పక్షవాతంతో బాధపడుతున్నారు. -
ప్రధాని మోదీ సభకు ఆహ్వాన పత్రిక
[ 06-05-2024]
ప్రధాని మోదీ బహిరంగ సభకు తరలిరావాలంటూ మొదటిసారి ప్రజలకు ఆహ్వాన పత్రికలు అందిస్తూ వినూత్న ప్రచారానికి వరంగల్ భాజపా నాయకులు శ్రీకారం చుట్టారు. -
నీట్కు 13 మంది గైర్హాజరు
[ 06-05-2024]
జిల్లా కేంద్రంలోని రెండు పరీక్ష కేంద్రాల్లో ఆదివారం జరిగిన జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్) ప్రశాంతంగా ముగిసింది. మధ్యాహ్నం 2 గంటల నుంచి జరిగిన పరీక్షకు ఉదయం 11 నుంచే విద్యార్థులను కేంద్రాల్లోకి అనుమతించారు. -
సిరా గుర్తు వేసే వేలు లేకపోతే..?
[ 06-05-2024]
పోలింగ్ రోజు ఓటరు ఓటేసినట్లు తెలిసేందుకు, అదే ఓటరు మళ్లీ ఓటు వేయకుండా ఉండేందుకు సిబ్బంది ఓటరు ఎడమ చేతి చూపుడు వేలికి సిరా గుర్తు పూస్తారు. ఈ సంగతి అందరికీ తెలిసిందే.
తాజా వార్తలు (Latest News)
-
రఫాపై ఇజ్రాయెల్ దండయాత్ర.. దాడులు మొదలుపెట్టిన సైన్యం!
-
నన్ను గదిలో బంధించి దాడి చేశారు: రాధికా ఖేడా తీవ్ర ఆరోపణలు
-
1600 అడుగుల వంతెనకు రూ.91 వేల కోట్లా.. హేళన చేస్తున్న అమెరికా వ్యాపారవేత్తలు
-
హౌస్కీపర్ ఇంట్లో నోట్ల గుట్టలు.. ప్రధాని మోదీ ఏమన్నారంటే..?
-
‘నువ్వు లేకపోయినా ఫర్వాలేదు’ అంటూ నెటిజన్ కామెంట్.. హీరో ఏమన్నారంటే?
-
‘నో డౌట్.. ఈ సీజన్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అతడే: గ్రేమ్ స్మిత్