కూటమి జోరుతో వైకాపా నేతల్లో భయం
వైకాపాకు వెన్నులో వణుకుపుట్టేలా తెదేపా కార్యకర్తలు పనిచేయాలని తెదేపా ఎలమంచిలి నియోజకవర్గ ఇన్ఛార్జి ప్రగడ నాగేశ్వరరావు కోరారు.
సీఎం రమేశ్ నామినేషన్కు రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్ రాక!
మాట్లాడుతున్న ప్రగడ నాగేశ్వరరావు
అచ్యుతాపురం, న్యూస్టుడే: వైకాపాకు వెన్నులో వణుకుపుట్టేలా తెదేపా కార్యకర్తలు పనిచేయాలని తెదేపా ఎలమంచిలి నియోజకవర్గ ఇన్ఛార్జి ప్రగడ నాగేశ్వరరావు కోరారు. ఈనెల 24న అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ నామినేషన్ కార్యక్రమానికి తెదేపా నాయకులు, కార్యకర్తలు, అభిమానులను తరలించడానికి అచ్యుతాపురంలో సోమవారం సాయంత్రం సమావేశం జరిగింది. సీఎం రమేశ్ నామినేషన్ కార్యక్రమం వైకాపా నాయకులు భయపడేటట్లు ఉండాలన్నారు. రాష్ట్రంలో కూటమి విజయం తథ్యమని తెలిసిపోవడంతో వైకాపా నాయకుల్లో భయం పట్టుకుందన్నారు. వారి భయాన్ని రెట్టింపు చేయడానికి నామినేషన్ కార్యక్రమం వేదిక కావాలన్నారు. సీఎం రమేశ్ నామినేషన్ కార్యక్రమానికి భాజపా నేత, రక్షణమంత్రి రాజ్నాథ్సింగ్ హాజరవుతున్నారన్నారు. తెదేపా రాష్ట్ర కార్యదర్శి దూలి రంగనాయకులు, నాయకులు రాజు, నానాజీ, కొలుకులూరి విజయ్బాబు, డ్రీమ్స్ నాయుడు, భీమరశెట్టి శ్రీనివాసరావు, దాడి ములిసినాయుడు, ఆడారి మంజు, మేరుగు బాపునాయుడు తదితరులు పాల్గొన్నారు.
సమావేశంలో మాట్లాడుతున్న బుద్ధ నాగజగదీశ్వరరావు
అనకాపల్లి పట్టణం, న్యూస్టుడే: రాష్ట్రంలో బీసీలను సీఎం జగన్మోహన్రెడ్డి బానిసల్లా చూస్తున్నారని తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బుద్ధ నాగజగదీశ్వరరావు, జిల్లా భాజపా అధ్యక్షులు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు, భాజాపా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఈర్లె శ్రీరామ్మూర్తి అన్నారు. భాజపా ఎన్నికల కార్యాలయంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వీరు మాట్లాడుతూ పేరుకే జగన్మోహన్రెడ్డి బీసీలకు పదవులు ఇచ్చారు తప్ప, పెత్తనం అంతా తనతో పాటు నలుగురి వద్ద ఉంచుకున్నారన్నారు. జిల్లాలో బీసీ నాయకుడు బూడి ముత్యాలనాయుడుకి ఉపముఖ్యమంత్రి పదవి ఇచ్చినా, పంచాయతీ రాజ్శాఖ మంత్రి పదవికి అప్పగించినా సీఎం తన వద్దే అధికారాలు ఉంచుకున్నారని విమర్శించారు. రెండు రోజుల కిత్రం కశింకోట మండలం గొబ్బూరు వద్ద సిద్ధం సభలో బూడి ముత్యాలనాయుడికి మాట్లాడానికి మైకు ఇవ్వలేదంటే బీసీలపై ఉన్న ప్రేమ అర్థం అవుతుందన్నారు. భాజపా అభ్యర్థి సీఎం రమేశ్ను గెలిపించి అభివృద్ధికి ఓటర్లు సహకరించాలని కోరారు. దేశంలో మోదీ ప్రధానమంత్రి, రాష్ట్రంలో చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు.
బ్రాహ్మణ సాధికార సమితి జిల్లా కన్వీనరుగా రామశాస్త్రి
కె.కోటపాడు, న్యూస్టుడే: తెదేపా బ్రాహ్మణ సాధికార సమితి అనకాపల్లి జిల్లా కన్వీనర్గా కె.కోటపాడు మండలం మేడిచర్లకు చెందిన దుర్వాసుల రామశాస్త్రి నియమితులయ్యారు. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఉత్తర్వులు జారీ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జననేతనన్నావు.. జలమేదీ జగన్?
[ 04-05-2024]
బటన్లు నొక్కే జగన్కు జనాల బాధలు పట్టడం లేదు. ఈ అయిదేళ్లలో తాగునీటి పథకాలకు పార్టీ రంగులు వేసి ప్రచారం చేసుకోవాలని చూశారు తప్ప ప్రజల గొంతు తడిపే ప్రయత్నమే చేయలేదు. వైకాపా పాలనలో గ్రామాల్లో కొత్తగా నీళ్ల కుండీలను నిర్మించిందీ లేదు. -
జగన్ను ఇంటికి పంపితేనే మన్యం అభివృద్ధి
[ 04-05-2024]
అధ్వాన పాలనతో రాష్ట్రాన్ని అధోగతి పాల్జేసిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని రంపచోడవరం అసెంబ్లీ కూటమి అభ్యర్థిని మిరియాల శిరీషాదేవి ఎద్దేవా చేశారు. -
జగనన్న కక్ష.. అవ్వాతాతలకు శిక్ష
[ 04-05-2024]
పింఛను సొమ్ము సచివాలయ ఉద్యోగులతో పంపిణీ చేసే అవకాశం ఉన్నా తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం జగన్ ప్రభుత్వం వృద్ధులు, దివ్యాంగులను బలిపశువులను చేసింది. -
వైకాపా పతనం ఖాయం
[ 04-05-2024]
త్వరలో జరగనున్న ఎన్నికల్లో ఎన్డీఏ గెలుపు తథ్యమని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పాంగి రాజారావు, తెదేపా నియోజకవర్గ ఇన్ఛార్జి దొన్నుదొర పేర్కొన్నారు. -
వైకాపా వాహనం స్వాధీనం
[ 04-05-2024]
అనుమతులు లేకుండా వైకాపా ప్రచార సామగ్రి తరలిస్తున్న వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎంపీడీవో, ఎన్నికల అధికారి వెంకటరావు తెలిపారు. -
తెదేపాలో భారీగా చేరికలు
[ 04-05-2024]
దామనాపల్లి, సంకాడ పంచాయతీల నుంచి వైకాపా, సీపీఎంలకు చెందిన కార్యకర్తలు భారీగా తెదేపాలోకి చేరారు. మాడెం, బంధవీధి, దొడ్డికొండరెల్లివీధి, చిన్నజడుమూరు గ్రామాలనుంచి సుమారు 200 మంది పాడేరు కూటమి అసెంబ్లీ అభ్యర్థి గిడ్డి ఈశ్వరి సమక్షంలో తెదేపా తీర్థం పుచ్చుకున్నారు. -
ఉద్యోగాలిప్పిస్తామని టోకరా
[ 04-05-2024]
ఉద్యోగాలిప్పిస్తామని గిరిజన యువతను ఇద్దరు మహిళలు మోసం చేశారు. బాధితులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. -
పేదల పొట్టకొట్టిన జగమొండి
[ 04-05-2024]
అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఆకలితో ఉన్నవారి కడుపునింపడంలోనూ రాజకీయాలు చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్కే దక్కుతుంది. ఓపక్క పేదల పక్షపాతినని ఊదరగొడుతూనే మరోవైపు అదే పేదల పొట్టకొట్టారు. -
‘జగన్కు ఒక్క అవకాశమిచ్చి అందరం మోసపోయాం’
[ 04-05-2024]
‘గత ఎన్నికల్లో జగన్ ఒక్క అవకాశం అని అడిగితే ఇచ్చి అందరం మోసపోయాం. ఈ ఐదేళ్లలో అభివృద్ధి లేదు. సంక్షేమంలో ఆశ్రిత పక్షపాతం పెరిగిపోయింది. -
తెదేపాలో చేరిన వైకాపా నాయకులు
[ 04-05-2024]
ఎలమంచిలిలోని దిమిలిరోడ్డులో శుక్రవారం మధ్యాహ్నం నిర్వహించనున్న నందమూరి బాలకృష్ణ సభకు తెదేపా నాయకులు భారీ ఏర్పాట్లు చేశారు. ఈ కూడలిని జెండాలతో అందంగా తయారు చేశారు. -
కాంగ్రెస్తోనే ప్రత్యేక హోదా
[ 04-05-2024]
కాంగ్రెస్ గెలుపుతో రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించుకోవచ్చని ఆ పార్టీ నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి సతక బుల్లిబాబు అన్నారు. మంప, రేవళ్లు పంచాయతీల్లోని గ్రామాల్లో శుక్రవారం సీపీఐ నేతలతో కలిసి ఇంటింటి ప్రచారం చేపట్టారు. -
జగనన్నా.. ఏమిటీ పింఛన్ వెతలు..
[ 04-05-2024]
పింఛన్లకోసం బ్యాంకులకు వచ్చిన వృద్ధులకు రెండో రోజు కష్టాలు తప్పలేదు. వీఆర్పురం మండలం రేఖపల్లిలో బ్యాంకు వద్ద రేఖపల్లి, జీడిగుప్పల పీహెచ్సీల వైద్యులు శిబిరం ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
మంత్రి రోజాను అడ్డుకున్న వేమాపురం వాసులు
-
ఎన్నిక, తీర్పు రెండూ సంచలనమే.. భారాస ఎమ్మెల్సీ దండె విఠల్ భవిష్యత్తు ప్రశ్నార్థకం!
-
అమెరికా జట్టులో మనోళ్లదే జోరు
-
మేనమామనన్నావ్.. మా కిట్లు ఆపేశావ్
-
పేర్ని కిట్టూపై ఎందుకంత ప్రేమ?.. స్వామి భక్తి ప్రదర్శిస్తున్న పోలీసులు
-
దళిత యువకుడికి పోలీసుల చిత్రహింసలు.. డిగ్రీ పరీక్షలు రాయకుండా నిర్బంధం