వీరూ.. వీర విధేయులే!.. వైకాపా సైన్యంలా పలువురు అధికారులు
ఏఈఆర్వో.. ఆయన ఎన్నికల నియమావళి పాటించాలి. కానీ నకిలీ పట్టాలు పప్పుబెల్లాల్లా పంచుతుంటే.. మౌనంగా ఉన్నారు.
నిష్పక్షపాత ఎన్నికలు సాధ్యమేనా?
సర్వత్రా ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాలు
బందరు
ఏఈఆర్వో.. ఆయన ఎన్నికల నియమావళి పాటించాలి. కానీ నకిలీ పట్టాలు పప్పుబెల్లాల్లా పంచుతుంటే.. మౌనంగా ఉన్నారు. స్వయంగా జేసీ గీతాంజలి శర్మ కార్యాలయానికి వచ్చి పరిశీలించే వరకు ఉన్నతాధికారులకు చెప్పలేదు. ఆయన ప్రస్తుతం బందరు తహసీల్దారు. ఇలాంటి వ్యక్తి ఎన్నికల వేళ నిష్పక్షపాతంగా ఉంటారని ఎలా నమ్మగలమని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. యువనేతతో ఆయన సంబంధాలు సరేసరి..!
జగ్గయ్యపేట
అక్కడి మున్సిపల్ కమిషనరే.. ఏఈఆర్వో. కానీ.. కోడ్ వేళనే మున్సిపల్ కల్యాణమండపం వైకాపా నేతలకు ఉచితంగా కట్టబెట్టేశారని ఆర్వోకు ఫిర్యాదు అందింది. ఏడాదిన్నరగా కమిషనర్గా ఉన్న ఆయన వైకాపా నాయకులతో, ముఖ్య ప్రజాప్రతినిధితో సంబంధాలు నెరిపి వారికి అనుకూల నిర్ణయాలు తీసుకున్నారు. ఆయనపైనా ఈసీకి ఫిర్యాదులు వెళ్లాయి.
విజయవాడ సెంట్రల్
వైకాపా అభ్యర్థి... మాజీ మంత్రి వెలంపల్లి.ఇక్కడ ఎన్నికల అధికారి కమిషనర్ స్వప్నిల్ దినకర్. వైకాపా కార్పొరేటర్లతో సమీక్ష పెడితే.. కమిషనర్ సభ్యుడిగా హాజరయ్యారు. వెలంపల్లి ఆదేశాలను శిరసావహించారనేది తెదేపా కార్పొరేటర్ల ఫిర్యాదు. ప్రతి భేటీలోనూ ఇదే తీరు. మేయరు భాగ్యలక్ష్మి గ్రీవెన్సులో ఫిర్యాదులు స్వీకరిస్తే.. కమిషనర్ ఒక ఉద్యోగిలా పక్కన ఉండేవారు. సెంట్రల్లో కోడ్కు ముందే వెలంపల్లి ఇష్టారీతిన తాయిలాలు పంచారు. వాలంటీర్లకు, సచివాలయ సిబ్బందికి కుక్కర్లు, చీరలు, దుస్తులు పంచారు. పత్రికల్లో చిత్రాలు వచ్చినా కమిషనర్ కదల్లేదు. ఇప్పుడు ఆయన రిటర్నింగ్ అధికారి.
ఉమ్మడి కృష్ణాలో జిల్లాస్థాయి అధికారులపై తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. వైకాపా ప్రజాప్రతినిధులతో అంటకాగిన వీరు ఇప్పుడు ఎన్నికల నిర్వహణ విధుల్లో ఉన్నారు. ఇలాంటి వారు నిష్పక్షపాతంగా వ్యవహరిస్తారనే నమ్మకం ఎలాగని రాజకీయ పార్టీలు ప్రశ్నిస్తున్నాయి. కృష్ణా కలెక్టర్ పి.రాజబాబు వ్యవహారం, కృష్ణా ఎస్పీగా పనిచేసిన జాషువా తీరు వెలుగు చూశాక అధికార గణంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. నేతల సిఫార్సులతో పోస్టులు తెచ్చుకున్న అధికారులు.. వారు చెప్పినట్లు తలాడిస్తున్నారనేది సుస్పష్టం.
నవ్విపోదురు గాక..
- తాడిగడప కమిషనర్ ప్రకాష్రావు వైకాపా నేతలతో అంటకాగారు. ఒక యూసీపై చర్యలు తీసుకోలేదనే తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. ఆయన బదిలీ అవగా ఆ స్థానంలో వచ్చిన వెంకటేశ్వరరావు మంత్రి జోగి ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తే ప్రభుత్వం తరపున ఏర్పాట్లు చేశారు. చికెన్ భోజనాల బిల్లు మున్సిపాలిటీ నుంచి చెల్లించారు.
- పెనమలూరు పరిధిలో ఎంపీడీవోలు సైతం పొదుపు మహిళలతో పెట్టిన ప్రచార కార్యక్రమాలకు అధికారికంగా సహకరించారు. వి మంత్రి జోగి సిఫార్సుతో గృహనిర్మాణ సంస్థ జిల్లా అధికారిని బలవంతంగా బదిలీ చేయించారు. ఆమె స్థానంలో మరో అధికారిణి నియమించారు. పోస్టు అనంతపురం. విధులు ఎన్టీఆర్ జిల్లా. ఇక పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తున్నారు. వి గుడివాడ ఆర్డీవో.. రిటర్నింగ్ అధికారి హోదాలో ఉన్నారు. ఇంటి పట్టాలపై ఆ అధికారిణితో ఎమ్మెల్యే నాని ఫోన్ సంభాషణ వెలుగు చూసిన ఉదంతం కంటే ఉదాహరణలు ఏం కావాలని పార్టీలు వ్యాఖ్యానిస్తున్నాయి. వి ఇటీవల ఏఈఆర్వోలుగా ఉన్న వారిని జిల్లాలకు బదిలీ చేశారు. పక్క జిల్లాల నుంచి వచ్చిన తహసీల్దార్లు నేతలను పట్టుకుని సిఫార్సులతో మంచి మండలాలు దక్కించుకున్నారు. మట్టి, ఇసుక ఆదాయం సమకూరే మండలాలకు వచ్చారు. కృష్ణా నదిలో నేతలే ఇసుక తవ్వకాలు, మట్టి దందా చేస్తున్నా చూస్తూ కూర్చున్నారు.
- జిల్లాలో దీర్ఘకాలంగా ఉన్న మరో నలుగురు అధికారులపై ఈసీకి ఫిర్యాదులు వెళ్లాయి. కానూరు ఏడీఈ, డీసీవో ఉన్నారు.
గత ఎన్నికల ఉదంతం..
2019 ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్లో గెలిచిన వైకాపా, ఓడిన తెదేపా అభ్యర్థి మధ్య తేడా 25 ఓట్లు. ఓట్ల లెక్కింపులో మతలబు విమర్శలు ఉన్నాయి. తెదేపా రీకౌంటింగ్ పట్టుబట్టినా.. నాటి కలెక్టర్ ఇంతియాజ్ అనుమతించలేదు. ఆయన ఇప్పుడు వైకాపా కర్నూలు అభ్యర్థి. ఈ చిదంబర రహస్యం ఇప్పటికీ మిస్టరీగానే మిగిలింది.
ఉమ్మడి కృష్ణాలో పలువురు..
కొందరు అధికారులు నేటికీ వైకాపా నేతలతో అంటకాగుతున్నారు. ‘మీకేం ఆందోళన వద్దు.. వచ్చేది మన ప్రభుత్వమే.. మేం చూసుకుంటామని’ వైకాపా నేతలు అధికారులకు భరోసా ఇస్తున్నారు. కొందరు తప్పని పరిస్థితుల్లో.. మరికొందరు అభిమానంతో, ఇంకొందరు తమకు పోస్టు ఇప్పించారని నేతల కొమ్ముకాస్తున్నారు. ఇప్పటికే ఈసీ రాష్ట్రస్థాయిలో కొరడా ఝళిపించినా.. వీరు మాత్రం నేతలతో సంబంధాలు కొనసాగిస్తున్నారు. ఏఈఆర్వోలు, స్క్వాడ్లు, ఇతర కమిటీలలో సభ్యులు, రూట్ అధికారులుగా ఉన్న వీరిలో ఎక్కువ మంది వైకాపా నేతలతో సత్సంబంధాలు ఉన్నవారే.
ఈనాడు, అమరావతి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏమైనా ఇచ్చేస్తాం.. ఎంతైనా కొనేస్తాం!
[ 02-05-2024]
ఆ నియోజకవర్గంలో ఓ సామాజిక వర్గం వారు తెదేపాకు మద్దతివ్వాలని నిర్ణయించారు. ఇది తెలిసిన వైకాపా ప్రజాప్రతినిధి అక్కడ వాలిపోయారు. అప్పటికప్పుడు రూ.10 లక్షల చెక్కు, రూ.3 లక్షలు నగదు ఇచ్చారు. తర్వాత ఓటుకు ఇంతని ఇస్తానని హామీ ఇచ్చారు. -
జనం గొంతులో.. జగన్ గరళం..!
[ 02-05-2024]
ప్రజారోగ్యం ప్రమాదంలో పడ్డప్పుడు పాలకులు ఏం చేయాలి? తాగునీరే గరళమై.. జనం ప్రాణాలనే బలి తీసుకుంటుంటే ఏం చర్యలు తీసుకోవాలి? -
నాడు జోరుమీదొచ్చారు.. నేడు జారుకున్నారు
[ 02-05-2024]
ఎన్నిక ప్రకటన ముందు ప్రజలను మభ్యపెట్టేందుకు జోగి రమేష్ పోరంకి ద్వారకా రెసిడెన్సీలో ప్రజాదర్బార్ నిర్వహించారు. ప్రజల నుంచి స్వీకరించిన వినతులు బుట్టదాఖలయ్యాయి. ఆన్లైన్లో నమోదు చేసి రశీదులు ఇచ్చినా ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలేదు. -
పేరు రక్షితం.. నీరు కలుషితం
[ 02-05-2024]
ప్రజలకు రోజూ స్వచ్ఛమైన తాగునీరు అందిస్తున్నామని పాలకులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం అది అమలు కావడం లేదు. చాలాచోట్ల డ్రెయిన్ల వెంబడి పైపులైన్లు ఉండడం.. లీకైన వాటిని మరమ్మతులు చేపట్టకపోవడంతో మురుగునీరు సరఫరా అవుతుందని ప్రజలు మొరపెట్టుకుంటున్నారు. -
ప్రతి పథకమూ దోపిడీ కోసమే
[ 02-05-2024]
రాష్ట్రంలో ఐదేళ్లలో అమలు చేసిన ప్రతి పథకాన్నీ తన దోపిడీకి అనుగుణంగా మార్చుకున్న జగన్, అతని టీంకు మే 13న జరిగే ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పి ఎన్డీయే కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఎన్టీఆర్ తనయుడు నందమూరి రామకృష్ణ కోరారు. -
ఈ ప్రశ్నకు జవాబు చెప్పు?
[ 02-05-2024]
‘నాడు-నేడు కింద ప్రభుత్వ పాఠశాలల్లో అభివృద్ధి చేస్తున్నాం.. విద్యార్థులకు ఆంగ్లమాధ్యమంలో బోధనతో పాటు, టోఫెల్, స్లాష్, క్లాస్రూం ఎస్సెస్మెంట్ పరీక్షలు చేపడుతూ వారి సామర్థ్యాన్ని ఏ ప్రభుత్వం చేయలేని పద్ధతిలో పెంపొందిస్తున్నాం’ -
‘రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్’
[ 02-05-2024]
మూడు రాజధానుల పేరుతో రాష్ట్ర అభివృద్ధిని సర్వనాశనం చేసిన ఘనుడు జగన్మోహన్రెడ్డి అని మాజీ మంత్రి, తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు. -
వైకాపా ప్రభుత్వాన్ని సాగనంపుదాం
[ 02-05-2024]
వైకాపా ప్రభుత్వాన్ని ప్రజలు సాగనంపాలని కూటమి అభ్యర్థి కాగిత కృష్ణప్రసాద్ పిలుపునిచ్చారు. బుధవారం మండలంలోని శింగరాయపాలెం, బల్లిపర్రు, కాకర్లమూడి, మడక, అచ్చయ్యవారిపాలెం, పుల్లపాడు తదితర గ్రామాల్లో ఆయన రోడ్ షో నిర్వహించారు. -
చీకటి పాలన నుంచి విముక్తులవుదాం: కొల్లు
[ 02-05-2024]
ఐదేళ్ల చీకటి పాలన నుంచి విముక్తులయ్యేందుకు అన్ని వర్గాల ప్రజలు సిద్ధంగా ఉండాలని మాజీ మంత్రి, తెదేపా అభ్యర్థి కొల్లు రవీంద్ర కోరారు. -
దళిత వ్యతిరేకి జగన్: జవహర్
[ 02-05-2024]
దళిత వ్యతిరేకి జగన్మోహన్రెడ్డికి తగు రీతిన బుద్ధి చెప్పేందుకు అందరూ సంఘటితం కావాలని మాజీ మంత్రి, తెదేపా నాయకులు కేఎస్ జవహర్ కోరారు. -
సంక్షేమ పాలన తెదేపాతోనే సాధ్యం
[ 02-05-2024]
కూటమి విజయాన్ని ఎవరూ ఆపలేరని ఎన్టీఆర్ తనయుడు నందమూరి రామకృష్ణ అన్నారు. పెడన మండలం నందమూరు, జింజేరు, జింజేరు గౌడపాలెం గ్రామాల్లో బుధవారం -
తెదేపా అభ్యర్థులకు ఘన స్వాగతం
[ 02-05-2024]
పెనమలూరు తెదేపా అభ్యర్థి బోడే ప్రసాద్, బందరు జనసేన ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరిల విజయాన్ని కాంక్షిస్తూ బుధవారం రాత్రి వరకు ఉయ్యూరులో బైక్ ర్యాలీ జరిగింది. -
వైకాపా కుక్కర్ కూపన్ల కేసు కంచికే..!
[ 02-05-2024]
అజిత్సింగ్నగర్ తోటవారివీధిలోని లక్కీ క్వాలిటీ ప్రింటర్స్లో ఎన్నికల అధికారులు స్వాధీనం చేసుకున్న వైకాపా కుక్కర్ కూపన్ల కేసు.. కంచికి చేరింది. -
వైద్యుడి కుటుంబం మృతి కేసులో విచారణ వేగవంతం
[ 02-05-2024]
పటమట పరిధిలో వైద్యుడు శ్రీనివాస్ కుటుంబం మృతి కేసులో విచారణను పోలీసులు వేగవంతం చేశారు. ఈ కేసును సీపీ స్వయంగా పర్యవేక్షిస్తుండంతో పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తును ముమ్మరం చేసి కీలక సమాచారం రాబట్టినట్లు తెలుస్తోంది. -
వెలంపల్లికి చేదు అనుభవం
[ 02-05-2024]
సెంట్రల్ నియోజకవర్గ వైకాపా అభ్యర్థి వెలంపల్లి శ్రీనివాసరావుకు మద్యం మత్తులో ఉన్న వ్యక్తి నుంచి చేదు అనుభవం ఎదురైంది. బుధవారం ఆయన 23, 62 డివిజన్లలో పర్యటించారు. -
కొడాలి నానిని నిలదీసిన గ్రామస్థులు
[ 02-05-2024]
వలివర్తిపాడు గ్రామంలో ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని) బుధవారం ఎన్నికల ప్రచారం చేస్తుండగా..పలువురు మహిళలు ఆయన్ను తమ గ్రామంలో సమస్యలు పరిష్కరించలేదంటూ నిలదీశారు.
తాజా వార్తలు (Latest News)
-
మృత్యువుతో గెలిచి.. పదిలో మెరిసి
-
వాట్సప్లో కొత్త ఖాతాల నుంచి సందేశాలు రావిక..?
-
#ఆఫీస్ పికాకింగ్.. కార్పొరేట్ ప్రపంచంలో మరో ట్రెండ్.. ఏమిటిది?
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (02/05/24)
-
‘అద్దె ఇల్లే సో బెటరు’.. కారణం చెప్పిన బాంబే షేవింగ్ కంపెనీ సీఈఓ
-
గూగుల్తో ఇంగ్లిష్ ప్రాక్టీస్.. కొత్త ఏఐ ఫీచర్ను ఎలా వాడాలి?