logo

విద్యుదాఘాతంతో ఒకరి మృతి

నందివాడ మండలం తమిరిశలోని ఓ ఫ్యాక్టరీకి చెందిన ఆర్వో వాటర్‌ ప్లాంట్‌లో స్థానికుడైన నగుళ్ల నాగరాజు(40) పని చేస్తుండేవాడు.

Published : 22 Apr 2024 05:06 IST

తమిరిశ (గుడ్లవల్లేరు), న్యూస్‌టుడే: నందివాడ మండలం తమిరిశలోని ఓ ఫ్యాక్టరీకి చెందిన ఆర్వో వాటర్‌ ప్లాంట్‌లో స్థానికుడైన నగుళ్ల నాగరాజు(40) పని చేస్తుండేవాడు. శనివారం రాత్రి ప్లాంట్‌లోనే నిద్రపోతూ ప్రమాదవశాత్తూ కాలును పక్కనున్న విద్యుత్తు మోటార్‌పై వేయగా..విద్యుదాఘాతంతో మృతి చెందాడు. ఉదయం సిబ్బంది గుర్తించి బంధువులకు, పోలీసులకు తెలిపారు. తండ్రి వీర్రాజు ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై నంబూరి చంటిబాబు వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని