తినలేకపోతున్నాం..!
జిల్లాలో పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం తినేందుకు పిల్లలు ఇష్టపడటం లేదు. సన్నాలకు బదులు వేరే బియ్యం సరఫరా అవుతున్నాయి. దీంతో అన్నం బాగా ముద్దవ్వటం, లావుగా ఉంటోంది. అది తింటే కడుపులో నొప్పి వస్తోందని కొందరు
పాడైపోయిన గుడ్లు
అధికారుల దృష్టికి తీసుకెళ్లాం
ఇప్పటికే జిల్లాలో చాలా పాఠశాలల్లో పిల్లలు మధ్యాహ్న భోజనం తినటం లేదని, కడుపు నొప్పి సమస్యలతో బాధపడుతున్నారని విద్యాశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లామని జిల్లా ప్రధానోపాధ్యాయుల సంఘం నాయకులు తెలిపారు.
ముద్దయిన అన్నం
త్వరలోనే సన్న బియ్యం వస్తాయి
సమస్యలను ఇప్పటికే గుర్తించాం. జిల్లాలో దీనిపై కలెక్టర్ నివేదిక కోరారు. ఇటీవల శాఖ సంచాలకులు పెదకాకానికి రాగా ఆయన దృష్టికి సమస్యను తీసుకెళ్లాం. రాష్ట్ర పౌరసరఫరాలశాఖ అధికారులను సంప్రదించాం. ప్రస్తుతం ఉన్న నిల్వలు త్వరలోనే అయిపోతాయని, ఆ తర్వాత నుంచి సన్న బియ్యం సరఫరా చేస్తామని హామీనిచ్చారు. త్వరలోనే సమస్య పరిష్కారమవుతుంది. కోడిగుడ్లు పాడవటానికి కారణాలు తెలుసుకుని గుత్తేదారుణ్ని అప్రమత్తం చేస్తాం.
-వి.శ్రీనివాసరావు, ఏడీ, మధ్యాహ్న భోజన పథకం, గుంటూరు
* నాలుగు రోజుల క్రితం పెదకాకాని జడ్పీ ఉన్నత పాఠశాలకు మధ్యాహ్న భోజన పథకం రాష్ట్ర సంచాలకులు దివాన్ మైదీన్ వచ్చారు. కొందరు విద్యార్థులు, తల్లిదండ్రుల కమిటీ సభ్యులు ఆయన్ని కలిసి అన్నం తినలేకపోతున్నట్లు ఫిర్యాదు చేశారు. కడుపులో నొప్పి వస్తోందని, బియ్యాన్ని మార్చాలని కోరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.