తెదేపా ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి
కుందుర్పి మండలంలోని వడ్డేపాళ్యం గ్రామంలో ఆదివారం రాత్రి తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకలు రాళ్ల దాడికి తెగబడ్డాయి.
బాలుడికి గాయం
గాయపడిన వీరేశ్ను పరామర్శిస్తున్న అమిలినేని సురేంద్రబాబు, నాయకులు
కుందుర్పి, న్యూస్టుడే: కుందుర్పి మండలంలోని వడ్డేపాళ్యం గ్రామంలో ఆదివారం రాత్రి తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకలు రాళ్ల దాడికి తెగబడ్డాయి. ఓ బాలుడికి రాయి తగలడంతో తలకు గాయమైంది. కళ్యాణదుర్గం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు ఆదివారం రాత్రి వడ్డేపాళ్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనడంతో ఓర్వలేని వైకాపా నాయకులు ఒక్కసారిగా రాళ్లతో దాడికి దిగారు. ప్రచార రథంపైకి రాళ్లు రువ్వడంతో అమిలినేనికి త్రుటిలో ప్రమాదం తప్పింది. ఒక రాయి ప్రచార రథానికి తాకి అక్కడే ఉన్న వీరేశ్ నుదిటికి తగలడంతో గాయమైంది. బాలుడిని స్థానిక ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. వైకాపా మూకలను తెదేపా శ్రేణులు పట్టుకునేందుకు ప్రయత్నించగా పరారయ్యారు. గాయపడిన బాలుడిని అమిలినేని సురేంద్రబాబుతోపాటు ,స్థానిక నాయకులు పరామర్శించి, కుటుంబానికి ధైర్యం చెప్పారు. ఘటనపై బాధితుడి తల్లిదండ్రులు, తెదేపా నాయకులు పోలీసుస్టేషనులో ఫిర్యాదు చేశారు. వీరేశ్ను మెరుగైన వైద్యం కోసం కళ్యాణదుర్గం తరలించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉప్పొంగిన ఓటరు చైతన్యం
[ 15-05-2024]
జిల్లావ్యాప్తంగా ఓటర్లలో చైతన్యం వెల్లివిరిసింది. సోమవారం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఉత్సాహంతో పోటీపడి ఓటేశారు. -
కళ్యాణదుర్గం, ధర్మవరంలో రికార్డుస్థాయి పోలింగ్ శాతం
[ 15-05-2024]
ఉమ్మడి అనంత జిల్లాలో కళ్యాణదుర్గం, ధర్మవరం అసెంబ్లీ నియోజకవర్గాల్లో రాష్ట్రవ్యాప్తంగా రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది. -
పెద్దారెడ్డి విధ్వంసకాండ
[ 15-05-2024]
వైకాపా ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిని తన గుప్పిట్లో ఉంచుకోవడానికి చేస్తున్న అరాచకాలు అన్నీఇన్నీ కావు. పోలింగ్ రోజునే తనలోనే నిజస్వరూపాన్ని బయటపెట్టాడు. -
పోస్టల్ బ్యాలెట్తోనే మార్పు
[ 15-05-2024]
గడిచిన ఐదేళ్ల వైకాపా పాలనకు చరమగీతం పాడేందుకు ఓటర్లలో ఉవ్వెత్తున చైతన్యం ఎగసి పడింది. -
వామ్మో.. ఎన్నికల విధుల్లో ఎన్ని కష్టాలో
[ 15-05-2024]
ఎన్నికల విధులు ఉపాధ్యాయులకు వద్దు.. వారిని బోధనకు మాత్రమే పరిమితం చేస్తున్నామంటే చాలామంది ఉపాధ్యాయులు సంతోషించారు. -
తెదేపా సానుభూతిపరులపై వైకాపా మూకల దాడి
[ 15-05-2024]
మండలంలోని కొత్తూరు గ్రామంలో తెదేపా సానుభూతిపరులపై వైకాపా మూకలు దాడులకు తెగబడ్డారు. -
ఏజెంట్గా కూర్చున్నాడని కొడవళ్లతో..
[ 15-05-2024]
శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం మండలం ఓబుళనాయునిపల్లిలో తెదేపా వర్గీయుడైన బోగా లింగమయ్య, అతని కుమారుడు సింహాద్రిపైన వైకాపా నాయకులు దాడి చేశారు. -
పోలీసు వాహనం బోల్తా.. సీఐ, డ్రైవర్కు గాయాలు
[ 15-05-2024]
కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని గూబనపల్లి వద్ద పోలీసు వాహనం బోల్తాపడిన ప్రమాదంలో రాయదుర్గం గ్రామీణ సీఐ ప్రసాద్బాబు, డ్రైవర్ (హోంగార్డు) రమేశ్ తీవ్రంగా గాయపడ్డారు. -
నేటి నుంచి లక్ష్మీచెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలు
[ 15-05-2024]
పట్టణంలోని లక్ష్మీచెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 15వ తేదీ నుంచి ప్రారంభమై 25వ తేదీ వరకు జరుగుతాయి -
ఓటరే విజేత
[ 15-05-2024]
సార్వత్రిక సమరంలో ఓటర్లు విస్పష్ట తీర్పు ఇచ్చినట్లు పోలింగ్ సరళిని చూస్తే స్పష్టమవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
జేసీ ప్రభాకర్రెడ్డికి అస్వస్థత.. సికింద్రాబాద్ కిమ్స్లో చికిత్స
-
రఫాలో మాజీ సైన్యాధికారి మృతి.. భారత్కు ఐరాస క్షమాపణలు
-
400 సీట్లు గెలిస్తే.. భారత్లో పీవోకే విలీనం ఖాయం: హిమంత బిశ్వశర్మ
-
తుపాకీతో కాల్చుకొని.. సచిన్ సెక్యూరిటీగార్డు ఆత్మహత్య..!
-
ప్రాజెక్ట్ అస్త్ర.. జీమెయిల్లో జెమినీ.. లెక్కల్లో సాయం.. గూగుల్ కొత్త అప్డేట్స్!
-
చెట్టును ఢీకొన్న కారు.. మంటలు చెలరేగి వృద్ధ దంపతులు మృతి