logo

తెదేపా ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి

కుందుర్పి మండలంలోని వడ్డేపాళ్యం గ్రామంలో ఆదివారం రాత్రి తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకలు రాళ్ల దాడికి తెగబడ్డాయి.

Published : 29 Apr 2024 03:47 IST

బాలుడికి గాయం

గాయపడిన  వీరేశ్‌ను పరామర్శిస్తున్న అమిలినేని సురేంద్రబాబు, నాయకులు

కుందుర్పి, న్యూస్‌టుడే: కుందుర్పి మండలంలోని వడ్డేపాళ్యం గ్రామంలో ఆదివారం రాత్రి తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకలు రాళ్ల దాడికి తెగబడ్డాయి. ఓ బాలుడికి రాయి తగలడంతో తలకు గాయమైంది. కళ్యాణదుర్గం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు ఆదివారం రాత్రి వడ్డేపాళ్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనడంతో ఓర్వలేని వైకాపా నాయకులు ఒక్కసారిగా రాళ్లతో దాడికి దిగారు. ప్రచార రథంపైకి రాళ్లు రువ్వడంతో అమిలినేనికి త్రుటిలో ప్రమాదం తప్పింది. ఒక రాయి ప్రచార రథానికి తాకి అక్కడే ఉన్న  వీరేశ్‌ నుదిటికి తగలడంతో గాయమైంది. బాలుడిని స్థానిక ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. వైకాపా మూకలను తెదేపా శ్రేణులు పట్టుకునేందుకు ప్రయత్నించగా పరారయ్యారు. గాయపడిన బాలుడిని అమిలినేని సురేంద్రబాబుతోపాటు ,స్థానిక నాయకులు పరామర్శించి, కుటుంబానికి ధైర్యం చెప్పారు. ఘటనపై బాధితుడి తల్లిదండ్రులు, తెదేపా నాయకులు పోలీసుస్టేషనులో ఫిర్యాదు చేశారు. వీరేశ్‌ను మెరుగైన వైద్యం కోసం కళ్యాణదుర్గం తరలించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు