పారిశ్రామిక కేంద్రంగా తిరుపతి : మంత్రి అమర్నాథ్
తిరుపతి జిల్లాను పారిశ్రామిక హబ్గా అభివృద్ధి చేయాలన్నది ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి సంకల్పమని పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు.
ఇలగనూరు వద్ద సీఎం భూమిపూజ చేయనున్న ప్రాంతాన్ని పరిశీలిస్తున్న మంత్రి, కలెక్టర్, ఎమ్మెల్యే
శ్రీకాళహస్తి, ఏర్పేడు, న్యూస్టుడే: తిరుపతి జిల్లాను పారిశ్రామిక హబ్గా అభివృద్ధి చేయాలన్నది ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి సంకల్పమని పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. ఆదివారం శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకున్న ఆయన.. ఈ నెల 23న శ్రీకాళహస్తి, ఏర్పేడు మండలాల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పర్యటించనున్న ప్రాంతాలను సందర్శించారు. మంత్రి మాట్లాడుతూ ఆధ్యాత్మికంగా, పర్యాటకంగా అభివృద్ధి చెందిన తిరుపతి జిల్లా రానున్న రోజుల్లో పారిశ్రామికంగా కూడా అభివృద్ధి కానుందని తెలిపారు. ఏర్పేడు మండలం టీసీఎల్ వద్ద వివిధ విభాగాల ప్రారంభోత్సవం, పరిశ్రమ ఏర్పాటుకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. రూ.వెయ్యి కోట్లతో ఇక్కడి పరిశ్రమను అభివృద్ధి పరిచారని, తద్వారా పది వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభించే అవకాశముందన్నారు. శ్రీకాళహస్తి మండలం ఇలగనూరు వద్ద 290 ఎకరాల్లో రూ.800 కోట్ల వ్యయంతో అపాచీ సంస్థ ఏర్పాటుకు ముఖ్యమంత్రి భూమిపూజ చేయనున్నట్లు వివరించారు. తిరుపతి జిల్లాలోని ఈఎంసీ క్లస్టర్ల పరిధిలో 700 ఎకరాలకు పైగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నట్లు వివరించారు. కార్యక్రమంలో తిరుపతి ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్రెడ్డి, ఏపీఐఐసీ ఎండీ సుబ్రహ్మణ్యం, జిల్లా పాలనాధికారి వెంకటరమణారెడ్డి, ఎస్పీ పరమేశ్వరరెడ్డి, జేసీ బాలాజీ, ఈఎంసీ సీఈవో గౌతమి, మంత్రి ఓఎస్డీ మధు, ఏపీఐఐసీ జోనల్ మేనేజరు సోనసుహాన, డిప్యూటీ కలెక్టర్ శ్రీనివాసులు, అధికారులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మంత్రి రోజాను అడ్డుకున్న వేమాపురం వాసులు
[ 04-05-2024]
మంత్రి రోజా ప్రచారాన్ని వడమాలపేట మండలం వేమాపురం గ్రామస్థులు శుక్రవారం రాత్రి అడ్డుకున్నారు. పూడి పంచాయతీలోని వేమాపురం గ్రామంలో మంత్రి రోజా ప్రచారం నిర్వహించడానికి ప్రచారం రథంలో వచ్చారు. -
కళ్లు మూసుకున్నారా ఐదేళ్లు..
[ 04-05-2024]
‘రాజకీయ నాయకుడికి విలువలు, విశ్వసనీయత ఉండాలి. మాట ఇస్తే నిలబెట్టుకోవాలి. ఇచ్చిన హామీ నెరవేర్చకపోతే పదవికి రాజీనామా చేయాలి.’ -
ఈ పాపం నీదే జగన్..
[ 04-05-2024]
మండు టెండలో రెండో రోజూ వృద్ధులను ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ముప్పుతిప్పలు పెట్టారు. ఇంటింటికీ పింఛన్ల పంపిణీ చేసేందుకు సరిపడా సిబ్బంది ఉన్నా తన స్వార్థ ప్రయోజనం కోసం వేదనకు గురిచేశారు. -
నగరిలో సైకిల్ జోరు..
[ 04-05-2024]
నగరిలో మంత్రి రోజాను వ్యతిరేకిస్తూ అసమ్మతి నాయకులు ఇన్నాళ్లు గళం విప్పుతూ వచ్చారు. ఆమెకు టికెట్ ఇవ్వొద్దని అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లినా అధిష్ఠానం ఇచ్చింది. -
జగనే సర్పంచులకు గండం
[ 04-05-2024]
దోపిడీకి కాదేదీ అనర్హం అన్నట్లు వైకాపా ప్రభుత్వం పంచాయతీ నిధులనూ వదల్లేదు.. గ్రామ స్వరాజ్యం కోసం గాంధీజీ కన్న కలలను సీఎం జగన్ కల్లోలం చేశారు.. ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన సర్పంచులు ఉత్సవ విగ్రహాల్లా మార్చారు. -
మా బతుకులు రోడ్డున వేశావ్.. జగన్!
[ 04-05-2024]
కష్టాన్ని నమ్ముకున్న బడుగు జీవులు వైకాపా పాలనలో ఇసుక కొరతతో నానా అవస్థలు పడ్డారు. చేద్దామంటే పనుల్లేక.. తిందామంటే తిండిలేక.. ఇతర ప్రాంతాలకు వెళ్లి పనులు చేద్దామంటే పనుల్లేక.. పెరిగిన నిత్యావసరాల ధరలు భవన నిర్మాణ రంగ కార్మికులకు పూట గడవని పరిస్థితులు దాపురించాయి. -
మేనమామ.. క్రీడలపై సవతి ప్రేమ..!
[ 04-05-2024]
బటన్ నొక్కి పిల్లలకు మేనమామలా సంక్షేమం ఇచ్చానని చెప్పిన సీఎం జగన్. క్రీడాకారులపై మాత్రం సవతి ప్రేమ చాటారని క్రీడా లోకం మండిపడిపోతోంది. కమర్షియల్ క్రీడల్లో సాధనకు రుసుమల్ని పెంచి.. పేద ఆటగాళ్లను ఆటలకు దూరం చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.. -
చిత్తూరును స్మార్ట్సిటీని చేస్తా
[ 04-05-2024]
పేదలకు అండగా నిలవడం నాకు ఇష్టం.. జిల్లా కేంద్రమైనా చిత్తూరులో అభివృద్ధి జాడేలేదు.. యువత ఉద్యోగాల కోసం బెంగళూరు, చెన్నై సహా విదేశాలకు వెళ్తున్నారు.. జన్మభూమి రుణం తీర్చుకోవాలనే ఆశయంతో రాజకీయాల్లోకి రాక ముందే జీజేఎం ట్రస్టు ద్వారా ప్రజాసేవకు శ్రీకారం చుట్టా.. -
‘భవన’దీయుడి కోసం
[ 04-05-2024]
నంది కూడలిలో ఉన్న ఈ అత్యాధునిక భవనం నగరపాలక సంస్థకు చెందినది. తిరుపతి స్మార్ట్సిటీ కార్పొరేషన్ నిధులు రూ.2 కోట్లు వెచ్చించి తిరుమలకు వచ్చే యాత్రికుల సౌకర్యార్థం నిర్మించారు. -
వృద్ధులమని తెలుసు.. ఇంటికివ్వలేని మనసు
[ 04-05-2024]
జగన్ ప్రభుత్వ చర్యలతో వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బయట ఎండకు, బ్యాంకుల్లో ఉక్కపోతతో అల్లాడిపోయారు. గురు, శుక్రవారాలు రెండు రోజులపాటు బ్యాంకుల చుట్టూ తిరిగినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. -
బారుకు వెళ్తేనే బీరు
[ 04-05-2024]
ఎండాకాలంలో బీర్లకున్న డిమాండ్ అంతాఇంతా కాదు. మండుటెండలో ప్రభుత్వ మద్యం దుకాణాలు తిరిగినా బీరు దొరక్క బార్ల మెట్లెక్కాల్సి వస్తోంది. రూ.350 - రూ.410 వరకు చెల్లించి బీర్లు తాగాల్సిన పరిస్థితి నెలకొంది. -
‘తాపీ’గా లేం జగన్!
[ 04-05-2024]
వైకాపా సర్కార్ తెచ్చిన ఇసుక విధానం, సామగ్రి ధరల పెరుగుదల కూలీలకు శాపంగా మారింది. అరకొర పనులు, అప్పుల బాధలు, సమస్యలు భరించలేక కార్మికులు బలవన్మరణాలకు దారితీస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
అమెరికా జట్టులో మనోళ్లదే జోరు
-
మేనమామనన్నావ్.. మా కిట్లు ఆపేశావ్
-
పేర్ని కిట్టూపై ఎందుకంత ప్రేమ?.. స్వామి భక్తి ప్రదర్శిస్తున్న పోలీసులు
-
దళిత యువకుడికి పోలీసుల చిత్రహింసలు.. డిగ్రీ పరీక్షలు రాయకుండా నిర్బంధం
-
గులకరాయి ఘటనను.. ఎన్నికల్లో లబ్ధికి వినియోగించుకోకుండా అడ్డుకోండి
-
గరిష్ఠ ఉష్ణోగ్రతల్లో రోజుకో రికార్డు