‘చంద్రబాబు ప్రత్యర్థిగా జగన్ నిలబడినా ఓటమే’
కుప్పం నుంచి ప్రస్తుత సీఎం జగన్మోహన్రెడ్డి బరిలో నిలిచినా ఓటమి ఖాయమని, ఓడిపోయే అభ్యర్థికి ఓటు వేసి దాన్ని వృథా చేసుకోవద్దని, రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఓటేసి విలువను కాపాడుకోవాలని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ కోరారు.
ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్
నేడు 8వ సారి నామినేషన్ దాఖలు
మాట్లాడుతున్న ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, పాల్గొన్న ఇన్ఛార్జి పీఎస్ మునిరత్నం, పీఏ మనోహర్
కుప్పం పట్టణం, న్యూస్టుడే: కుప్పం నుంచి ప్రస్తుత సీఎం జగన్మోహన్రెడ్డి బరిలో నిలిచినా ఓటమి ఖాయమని, ఓడిపోయే అభ్యర్థికి ఓటు వేసి దాన్ని వృథా చేసుకోవద్దని, రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఓటేసి విలువను కాపాడుకోవాలని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ కోరారు. స్థానిక తెదేపా కార్యాలయంలో గురువారం విలేకర్లతో మాట్లాడారు. అధినేత కుప్పం శాసన సభ స్థానానికి 8వ సారి పోటీ చేస్తున్నారన్నారు. ఈ దఫా లక్ష ఓట్ల ఆధిక్యం అధించేందుకు అడుగులు వేస్తున్నామన్నారు. కార్యక్రమానికి భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు. కుప్పం అభివృద్ధికి 20 అంశాలతో మేనిఫెస్టోను రూపొందించినట్లు వివరించారు. చంద్రబాబు తరఫున ఆయన సతీమణి శుక్రవారం ఒంటి గంటకు నామినేషన్ దాఖలు చేయనున్నట్లు తెలిపారు. ఉదయం 10 గంటలకు లక్ష్మీపురంలోని శ్రీవరదరాజులస్వామి దేవాలయంలో పూజలు చేసి.. కుప్పం చెరువుకట్ట నుంచి తెదేపా, జనసేన, భాజపా శ్రేణుల భారీ ర్యాలీగా ఆర్వో కార్యాలయానికి చేరుకుంటారని వివరించారు. సాయంత్రం 5 గంటలకు తెదేపా కార్యాలయంలో ప్రముఖులతో ముఖాముఖి, 20న అధినేత పుట్టిన రోజు సందర్భంగా కదిరిబండ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారన్నారు. తెదేపా కార్యాలయంలో ముస్లిం మహిళలతో ముఖాముఖిలో పాల్గొంటారన్నారు. ఆర్టీసీ బస్టాండు కూడలిలోని ఎన్టీఆర్ అన్న క్యాంటీన్లో అన్నదానం, మధ్యాహ్నం 2 గంటలకు సీనియర్ నాయకులకు ఆమె కృతజ్ఞతలు తెలుపుతారని వివరించారు. సాయంత్రం 4 గంటలకు బెంగళూరుకు పయనమవుతారు. ఇన్ఛార్జి పీఎస్ మునిరత్నం, పీఏ మనోహర్, సురేష్బాబు, రాజ్కుమార్, సత్యేంద్రశేఖర్ పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బలి తీసుకునే పన్నాగం.. ఇంటింటా పంపిణీకి ఎగనామం
[ 01-05-2024]
తనలాంటి మానవతావాది, దయార్ద హృదయుడు లేడని మాటల్లో చెప్పే ముఖ్యమంత్రి జగన్.. ఆచరణలో మాత్రం ఆమడదూరంలో ఉన్నారు. పేదలకు పంపిణీ చేసే పింఛను నగదు బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తానని చెప్పడమే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. -
రాజీనామా చేయాలంటూ వాలంటీర్లకు కౌన్సిలర్ బెదిరింపులు
[ 01-05-2024]
రాజీనామా చేయాలంటూ నలుగురు మహిళా వాలంటీర్లపై కౌన్సిలర్ ఒత్తిడి తీసుకురాగా.. వారు విబేధించారు. దీంతో అతను వచ్చేది మా ప్రభుత్వమే అప్పుడు చూసుకుంటామంటూ బెదిరింపులకు పాల్పడగా కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. -
సకల జనులకు మేలు.. సూపర్ సిక్స్ పథకాలు
[ 01-05-2024]
సూపర్ సిక్స్ పథకాలతో ఇప్పటికే ప్రజాదరణ పొందిన ఏన్డీయే కూటమి తాజాగా విడుదల చేసిన మ్యానిఫెస్టో మరింత ఆకర్షణగా నిలిచింది. ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. -
ఆమె ఓటే శాసనం
[ 01-05-2024]
సార్వత్రిక ఎన్నికల్లో అభ్యర్థుల విజయాన్ని మహిళలు నిర్ణయించనున్నారు.. పలమనేరు నియోజకవర్గంలో అధిక ఓటర్లు ఉండగా, నగరిలో ఓటర్ల సంఖ్య తక్కువగా ఉంది. -
వైకాపా.. కుతంత్రాలకు పెట్టింది పేరు
[ 01-05-2024]
రానున్న ఎన్నికల్లో వైకాపాకు భంగపాటు తప్పదని ఆ పార్టీ నాయకులు ఇప్పటికే ఓ అంచనాకు వచ్చారు. విపక్ష తెలుగుదేశానికి రోజురోజుకు ఆదరణ పెరుగుతుండటంతో వైకాపా నాయకుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. -
మడమ తిప్పి.. నిండా ముంచేసి
[ 01-05-2024]
జగనన్న మాటలకు.. చేష్టలకు ఆర్టీసీ ఉద్యోగులు నిండా మునిగారు.. ప్రభుత్వంలో విలీనం చేస్తామంటే అందరూ ఆశపడ్డారు.. తమ తలరాతలు మారాయని సంబరపడ్డారు.. తీరా ప్రభుత్వంలో చేరాక అక్కడి ఆదేశాలతో ఉద్యోగుల జీవితాలు చతికిల పడ్డాయి. -
వైకాపాకు ఓటేస్తే మీ భూములు కొట్టేస్తారు
[ 01-05-2024]
ప్రజలు వైకాపాకు ఓటేస్తే మీ భూములే కొట్టేస్తారని మాజీ మంత్రి అమరనాథరెడ్డి ఆరోపించారు. బైరెడ్డిపల్లె మండలం ధర్మపురిలో మంగళవారం ఎన్నికల ప్రచారంలో ప్రసంగించారు. -
బాలకృష్ణను కలిసిన తెదేపా నాయకులు
[ 01-05-2024]
తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ చిత్తూరు నుంచి ఒంగోలు పర్యటన నిమిత్తం మంగళవారం బయలుదేరి వెళ్లారు. -
బాధితులను పరామర్శించిన చల్లాబాబు
[ 01-05-2024]
చౌడేపల్లెలో జరిగిన దాడి సంఘటనలో సబ్జైల్లో ఉన్న తెదేపా మండల అధ్యక్షుడు రమేశ్రెడ్డి, మంజునాథరెడ్డి, మణికంఠ, సునీల్కుమార్, ఆదిశేషులను పుంగనూరు నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి చల్లాబాబు పరామర్శించారు. -
జగన్.. అవ్వాతాతలను ఏడి‘పింఛెన్’
[ 01-05-2024]
ప్రతి నెలా వృద్ధులు, వికలాంగులు, వితంతువులు వివిధ రకాల పింఛన్ల లబ్ధిదారులు ఈసారి టెన్షన్ పడాల్సిన పరిస్థితి ఎదురవుతోంది.. బ్యాంకు ఖాతాలకు ఆధార్ అనుసంధానం అయిన వారికి మాత్రమే బ్యాంకుల్లో జమ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. -
రాజీనామా చేసి.. ప్రచారంలో తిరగాల్సిందే
[ 01-05-2024]
పోలింగ్ తేదీ సమీపిస్తున్నకొద్దీ వాలంటీర్లపై అధికార పార్టీ నేతల ఒత్తిళ్లు పెరిగిపోతున్నాయి. రాజీనామా చేసి.. పార్టీ ప్రచారంలో భాగస్వాములు కావటంతో పాటు పోలింగ్ రోజున దగ్గరుండి ఓట్లు వేయించాలని తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి వైకాపా ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్రెడ్డి వాలంటీర్లకు హుకుం జారీ చేశారు. -
రాజీనామా చేసిన వాలంటీర్లకు వైకాపా తాయిలాలు
[ 01-05-2024]
కుప్పం నియోజకవర్గ పరిధి నాలుగు మండలాల్లో రాజీనామా చేసిన వాలంటీర్లకు వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి భరత్ సోమ, మంగళవారాల్లో ఒక్కో వాలంటీరుకు రూ.5 వేల చొప్పున అందించారు.
తాజా వార్తలు (Latest News)
-
గూగుల్తో ఇంగ్లీష్ ప్రాక్టీస్.. కొత్త ఏఐ ఫీచర్ను ఎలా వాడాలి?
-
లైంగిక దౌర్జన్యం కేసు - తొలిసారి స్పందించిన ప్రజ్వల్ రేవణ్ణ
-
స్విమ్మింగ్ పూల్లో కేథరిన్.. సముద్ర తీరాన శ్రీనిధి
-
నీ డెబ్యూ నాటికి నేనింకా చెడ్డీలతోనే ఉండుంటా: మిశ్రాతో రోహిత్
-
తెరపైకి రజనీకాంత్ జీవితం.. హీరోగా ఎవరంటే!
-
‘హార్దిక్ దృఢంగా ఉండు.. విమర్శించిన వాళ్లే నిన్ను ప్రశంసించే రోజు వస్తుంది’