బలి తీసుకునే పన్నాగం.. ఇంటింటా పంపిణీకి ఎగనామం
తనలాంటి మానవతావాది, దయార్ద హృదయుడు లేడని మాటల్లో చెప్పే ముఖ్యమంత్రి జగన్.. ఆచరణలో మాత్రం ఆమడదూరంలో ఉన్నారు. పేదలకు పంపిణీ చేసే పింఛను నగదు బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తానని చెప్పడమే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం.
బస్సులు లేని ఊళ్ల నుంచి బ్యాంకులకు ఎలా రావాలని వృద్ధుల ఆవేదన
వృద్ధులను బ్యాంకుల చుట్టూ తిప్పి.. లబ్ధి పొందాలని జగన్ కుతంత్రం
ఈనాడు, చిత్తూరు
తనలాంటి మానవతావాది, దయార్ద హృదయుడు లేడని మాటల్లో చెప్పే ముఖ్యమంత్రి జగన్.. ఆచరణలో మాత్రం ఆమడదూరంలో ఉన్నారు. పేదలకు పంపిణీ చేసే పింఛను నగదు బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తానని చెప్పడమే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. వైకాపా అధినేత అయిన జగన్ను వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలిపించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్రెడ్డి కంకణం కట్టుకున్నారు. ఆయన బాటలోనే పంచాయతీరాజ్ అధికారులు నడిచి వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, నేతన్నలను బ్యాంకుల వద్దకు నడిపించేందుకు సన్నద్ధమయ్యారు.
జిల్లావ్యాప్తంగా 1,92,021 మంది పింఛనుదారులు మే నెల పెన్షన్ను బ్యాంకుల వద్దకు వెళ్లి తీసుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. గ్రామీ ణ ప్రాంతాల్లోని పండుటాకులు, వితంతువులు అనివార్యంగా బ్యాంకుల వద్దకు ఎండలో ప్రయా ణం చేయాలి. అష్టకష్టాలు పడి అక్కడకు చేరుకున్నా అరకొర సిబ్బంది కారణంగా ఒకేరోజు వందలాది మందికి పింఛన్లు ఇచ్చే పరిస్థితి లేదు.
మండుటెండలో ముళ్లబాటలో..
జిల్లాలో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటుతున్నాయి. ఈ పరిస్థితిలో వృద్ధులు 10 నుంచి 15 కిలోమీటర్లు ప్రయాణం సాగించాలి. బ్యాంకుల వద్ద నిరీక్షించాలి. జిల్లాలోని అనేక గ్రామాలకు బస్సు, ఆటోల సౌకర్యం లేదు. ఈ గ్రామాల్లోని లబ్ధిదారుల పరిస్థితి అగమ్యగోచరం. అలాగే కొన్ని గ్రామాలకు రవాణా సౌకర్యం ఉన్నా గుంతల దారిలో ప్రయాణించడం అంత తేలిక కాదు. తమను ఎండలో వేధించి ఏమైనా జరిగితే ఆ నెపాన్ని విపక్షాలపై నెట్టేందుకు జగన్ కుట్ర చేస్తున్నారని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు.
బైరెడ్డిపల్లె మండలం ధర్మపురి గ్రామానికి చెందిన సుశీలకు వితంతు పింఛను వస్తోంది. మే నెల పింఛను నగదు బ్యాంకులో జమ చేస్తే పది కిలోమీటర్ల దూరంలోని కొలమాసనపల్లి సప్తగిరి గ్రామీణ బ్యాంకుకు వెళ్లాలి. అక్కడకు వెళ్లేందుకు తమ గ్రామం నుంచి బస్సు సదుపాయం లేదని, ఆటోలు, ద్విచక్ర వాహనాల్లోనే కొలమాసనపల్లికి చేరుకోవాలని వాపోతోంది. అక్కడకు చేరుకున్న తర్వాత మరుసటి రోజు రమ్మని చెబితే వ్యయప్రయాసలు తప్పవు.
యాదమరి మండలంలో 566 పింఛన్లున్నాయి. వీటిలో 364 మందికి బ్యాంకు ఖాతాలో జమ చేయనున్నారు. వీరిలో వయోవృద్ధులు, దివ్యాంగులు ఉన్నారు. వీరంతా పది కి.మీ.దూరంలోని కాశిరాళ్ల సప్తగిరి గ్రామీణ బ్యాంకుకు వెళ్లాలి. అక్కడి నుంచి వెళ్లేందుకు ఈ గ్రామం నుంచి బస్సు సౌకర్యం లేదు. అంత దూరం వెళ్లి బ్యాంకులో నిలబడి తీసుకోవాలంటే ఇబ్బందులు తప్పవని వాపోతున్నారు.
పెనుమూరు మండలం శాతంబాకం పంచాయతీ కృష్ణాపురం గ్రామానికి చెందిన పింఛనుదారులకు గ్రామంలో బ్యాంకు అందుబాటులో లేదు. వారు గ్రామం నుంచి సుమారు పది కి.మీ.దూరంలోని ఉగ్రాణంపల్లె సప్తగిరి గ్రామీణ బ్యాంకుకు రావాల్సి ఉంది. సరే వెళ్దామనుకున్నా ఆ గ్రామం నుంచి బస్సు సౌకర్యం లేదు. ఆటోల్లో కానీ.. నడిచిగానీ రావాల్సిందే. దీంతో వారికి ఎదురయ్యే కష్టాలు అన్నీఇన్నీ కావు.
సమీపంలోనే సచివాలయాలున్నా..
పింఛను నగదును గత, ప్రస్తుత ప్రభుత్వం నగదు రూపంలో నేరుగా చేతికి అందిస్తోంది. దీంతో బ్యాంకు ఖాతాలున్నా వృద్ధులు వినియోగించడంలేదు. ఖాతా తెరిచే సమయంలో ఏటీఎం కార్డు ఇచ్చినా పెద్దగా ప్రయోజనం లేదని పక్కన పడేశారు. ఈ క్రమంలో లావాదేవీలు జరగక పలువురి ఖాతాలు క్రియాశీలకంగా లేవు. మరికొందరైతే బ్యాంకుకే నగదు చెల్లించాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇటువంటి వ్యక్తుల ఖాతాల్లో డబ్బు జమ చేస్తే బ్యాంకర్లకే ప్రయోజనం. కొందరి కార్డులు చదువుకోవడానికి ఇతర ప్రాంతాలకు వెళ్లిన మనవళ్లు, మనవరాళ్లు ఉపయోగిస్తున్నారు. ఆధార్ అనుసంధానమైన బ్యాంకు ఖాతాలోనే నగదు జమ చేస్తామని ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చినందున లింక్ అయిందో లేదో తెలుసుకునేందుకు అనివార్యంగా రెండు- మూడు కిలోమీటర్ల దూరంలోని సచివాలయాలకు వెళ్లాలి. ఆటోలు, ద్విచక్ర వాహనాలు, బస్సులు లేకపోతే నడిఎండలో నడుచుకుంటూ ప్రయాణం సాగించాలి.
పొదుపు సంఘాల మహిళలతో నిండి..
ప్రతి నెలా మొదటి వారం బ్యాంకులు పొదుపు సంఘాల మహిళలతో రద్దీగా ఉంటాయి. విశ్రాంత ఉద్యోగులూ పింఛన్ల కోసం బారులు తీరుతారు. ఇదే సమయంలో వృద్ధులూ వెళ్తే అనేక ఇబ్బందులు పడతారు. స్థానికంగా ఉన్న పరిస్థితులను బట్టి ఒకట్రెండు రోజులపాటు బ్యాంకుల చుట్టూ తిరగాలి.
సాధారణ రోజుల్లోనే రెండు గంటలు
బైరెడ్డిపల్లెలోని ఇండియన్ బ్యాంకుకు ఖాతాదారుడు సాధారణ రోజుల్లో వెళితే బయటకు వచ్చేందుకు రెండు గంటలు పడుతోంది. పింఛనుదారులూ అక్కడికే చేరుకుంటే నగదు చేతికి అందడానికి నాలుగైదు రోజులవుతుంది.
మృతుల ఖాతాల్లోనూ జమ
ఎవరెవరికి బ్యాంకుల్లో, ఇంటింటికి వెళ్లి నగదు అందజేయాలనే వివరాలను ప్రభుత్వం సచివాలయ ఉద్యోగులకు ఇచ్చింది. చనిపోయిన వ్యక్తులను జాబితాలో నుంచి తీసే అధికారం ఇప్పుడు అధికారులు, ఉద్యోగులకు లేదు. ఒక్క కుప్పం నియోజకవర్గంలోనే ఇలా 100- 120 మంది వరకు ఉంటారని అంచనా. జిల్లావ్యాప్తంగా 700- 850 మంది మృతుల ఖాతాల్లో డబ్బు పెడితే ప్రభుత్వ ఖజానాకు గండిపడినట్టేనని సచివాలయ ఉద్యోగులే అంటున్నారు. ః మే 1న ఏడు నియోజకవర్గాల్లోని 80,843 మందికి ఇళ్లకు వెళ్లి పింఛను సొమ్ము ఇవ్వాలని అధికారులు చెప్పారు. తక్కువ మొత్తమే అయినందున మంగళవారం మధ్యాహ్నానికి దాదాపు జమ అయింది. వీరికి బుధవారం పంపిణీ చేస్తారు. ః మే 1న బ్యాంకులకు సెలవు. ఎక్కువమంది వృద్ధులు, వితంతువులు బ్యాంకుల వద్దకు వచ్చే అవకాశం ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నాడు.. మోదం నేడు.. భారం
[ 22-05-2024]
విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చామని, అనేక సంస్కరణలు చేపట్టామని వైకాపా ప్రభుత్వం గొప్పలు చెబుతోంది. -
వజ్రాయుధాన్ని వదిలేసిన.. 2,01,903 మంది
[ 22-05-2024]
ఐదేళ్లకు ఒకసారి వచ్చే ఓట్ల పండుగలో రెండు లక్షలకు పైగా ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకోలేదు. ఓటు వజ్రాయుధమంటూ మాటల్లో చెప్పిన యంత్రాంగం.. ఓటర్లను కేంద్రాలకు వచ్చేలా అవగాహన కల్పించడంలో విఫమైందనే అపవాదు మూటకట్టుకుంది. -
గౌరవ వేతనమేదీ?
[ 22-05-2024]
ఎన్నికల విధుల్లో పాల్గొన్న బూత్ స్థాయి అధికారుల(బీఎల్వో)కు చెల్లించాల్సిన పారితోషికాన్ని గత రెండేళ్లుగా ఎన్నికల సంఘం చెల్లించడం లేదు. -
విస్తరించలేక నీరుగార్చారు
[ 22-05-2024]
వైకాపా ప్రభుత్వం బిందు సేద్యం పథకాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసి గాలికొదిలేసింది. బిందు సేద్యం ప్రాధాన్యాన్ని గుర్తెరిగిన నాటి తెదేపా ప్రభుత్వ పాలనలో రైతు దరఖాస్తు చేస్తే చాలు.. వెంటనే డ్రిప్ కంపెనీ ప్రతినిధులు పొలాన్ని పరిశీలించి అవసరమైన పరికరాలు అందజేసేవారు. -
వర్షమొస్తే.. పారేది మురుగే
[ 22-05-2024]
చిత్తూరులో కాసింత వర్షం వస్తే చాలు మురుగు రహదారులపై పొంగుతోంది. -
గోదాములకు చేరని పాఠ్య పుస్తకాలు
[ 22-05-2024]
మరో 20 రోజుల్లో పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. జూన్ 12న నూతన విద్యాసంవత్సరం ప్రారంభానికి సిద్ధమైనా నేటికీ పాఠ్యపుస్తకాలు రాకపోవడం గమనార్హం. -
తప్పుడు కేసులు పెట్టినవారిపై న్యాయ పోరాటం
[ 22-05-2024]
పుంగనూరు నియోజకవర్గంలో తమ పార్టీ నాయకులు, కార్యకర్తలపై తప్పుడు కేసులు నమోదు చేసిన వారికి శిక్ష పడే వరకు న్యాయ పోరాటం చేస్తామని బీసీవైపీ అధ్యక్షుడు రామచంద్రయాదవ్ అన్నారు. -
ఈవీఎంల భద్రత పక్కాగా పర్యవేక్షించాలి
[ 22-05-2024]
చిత్తూరు నగరంలోని ఎస్వీసెట్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ను మంగళవారం జిల్లా ఎస్పీ మణికంఠ పరిశీలించారు. -
దుస్థితిలో డాలర్ల విక్రయ కేంద్రం
[ 22-05-2024]
శ్రీవారి ఆలయానికి ఎదురుగా ఉన్న తితిదే బంగారు, వెండి, రాగి డాలర్ల విక్రయ కేంద్రం నిర్వహణ లేక అధ్వానంగా మారింది. ఒకవైపు పైకప్పు సీలింగ్ ఊడిపోయింది. -
నడింపల్లెలో అతిసారం వ్యాప్తి
[ 22-05-2024]
మండల పరిధి నడింపల్లె పంచాయతీలో అతిసారం ప్రబలి సుమారు 15 మంది అస్వస్థతకు గురయ్యారు. మూడు రోజులుగా పలువురు వాంతులు, విరేచనాలతో స్థానిక ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. -
ల్యాప్టాప్ల మాయగాడి అరెస్టు
[ 22-05-2024]
నివాసాలు, ఉద్యోగుల అతిథిగృహాలు, విద్యార్థి వసతి గృహాల్లో రాత్రిళ్లు ల్యాప్టాప్లు దొంగిలిస్తున్నాడనే ఆరోపణపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరుకు చెందిన కుమార్ అనే యువకుడిని బెంగళూరు కుమారస్వామి లేఔట్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. -
చిత్తూరులో నేడు రాకపోకలు ఇలా..
[ 22-05-2024]
చిత్తూరు నడివీధి గంగమ్మ జాతర నిమజ్జన వేడుకలు, ఓంశక్తి భక్తుల విన్యాసాల నేపథ్యంలో నగరంలో బుధవారం మధ్యాహ్నం రెండు గంటల నుంచి ట్రాఫిక్ ఆంక్షలు అమలు కానున్నాయి. -
పైసాచిక.. కడుపుకోతలు
[ 22-05-2024]
ప్రైవేటు ఆసుపత్రుల్లో సిజేరియన్లు తల్లుల ప్రాణాలు తీస్తున్నాయి. ఇక్కడ జరుగుతున్న విచ్చలవిడి శస్త్రచికిత్సలతో మాతృమరణాలు పెరుగుతుండటంపై ఆందోళన వ్యక్తమవుతోంది. -
మూడోకన్ను.. మూసుకుపోయింది
[ 22-05-2024]
సీసీటీవీ ఫుటేజీల ద్వారా దొంగలను కనిపెట్టాం.. మూడో నేత్రం ద్వారా నిందితులను పట్టుకున్నాం.. ఇదీ నిత్యం పోలీస్ అధికారులు కేసులను పరిష్కరించిన సమయంలో చెబుతూ వచ్చే మాటలు. -
మిగ్జాం తెంచింది ప్రభుత్వం ముంచింది
[ 22-05-2024]
త ఏడాది డిసెంబరులో మిగ్జాం తుపాను దాటికి మండలంలోని వంతెనలు కుప్పకూలగా నేటికీ ప్రభుత్వం వాటిని పట్టించుకోవడం లేదు. -
సర్వదర్శనానికి 15 గంటలు
[ 22-05-2024]
శ్రీవారి భక్తులు మంగళవారం సాయంత్రానికి వైకుంఠం క్యూకాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్లు, నారాయణగిరి షెడ్లు నిండిపోయి ఏటీసీ వరకు క్యూలైన్లో వేచిఉన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
గొంతుపై కాలుతో తొక్కి.. భార్య ప్రాణం తీసిన భర్త
-
బంగారం, వెండి ధరలు.. ఏ నగరంలో ఎంతెంత..?
-
ఐపీఎల్లో ‘ఎలిమినేట్’ అయ్యేదెవరు? ‘రాయల్’గా ముందుకెళ్లేదెవరు?
-
5 నిమిషాల్లో 6 వేల అడుగుల కిందకి.. సింగపూర్ విమానంలో భయానక దృశ్యాలు
-
సీబీఐలో లంచాధికారులు.. ఒక్కో కాలేజీ నుంచి రూ.2-10లక్షలు వసూలు
-
64ఎంపీ కెమెరాతో వివో కొత్త ఫోన్.. ఫీచర్లు ఇవే..