ఆసుపత్రులకు జగన్ జబ్బు
కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా పేదలకు వైద్య సేవలు అందిస్తామని, ప్రభుత్వ వైద్యశాలలను రోగులకు అనుగుణంగా అప్గ్రేడ్ చేసి ఆ మేరకు సేవలు విస్తరిస్తామని సీఎం జగన్ ప్రతిపక్ష నాయకుడి హోదాలో హామీ ఇచ్చారు.
నాడు-నేడు ద్వారా అసంపూర్తిగానే పనులు
పత్తాలేని పరికరాలు.. అవస్థల్లో రోగులు
న్యూస్టుడే, చిత్తూరు(వైద్యం), పుత్తూరు, పెనుమూరు
పుత్తూరు ఆస్పత్రికి రోగుల తాకిడి అధికం. రోజూ 500-600 మంది రోగులు వచ్చి చికిత్స పొందుతుంటారు. గత ఎన్నికల సందర్భంగా సీఎం జగన్ సైతం 100 పడకల స్థాయికి పెంచుతామని ఇచ్చన హామీ ఇప్పటివరకు నెరవేరలేదు. దీంతో ఏవైనా అత్యవసర కేసులు వస్తే ప్రథమ చికిత్స నిర్వహించి తిరుపతికి రెఫర్ చేయాల్సిన పరిస్థితి. అనుభవజ్ఞలైన డాక్టర్లు ఉన్నా మౌలిక వసతులు లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో రెఫర్ చేస్తున్నారు.
పెనుమూరులో 50 పడకల ఆస్పత్రికి రెండేళ్ల క్రితం డిప్యూటీ సీఎం నారాయణస్వామి, అప్పటి వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని, మంత్రి పెద్దిరెడ్డి భూమిపూజ చేశారు. రెండేళ్లవుతున్నా పునాదుల దశ దాటలేదు. ఉన్న పీహెచ్సీ భవనాల్లోనే సామాజిక ఆరోగ్య కేంద్రం నడుస్తోంది. వచ్చే రోగులకు సౌకర్యాల్లేక ఇబ్బందులు పడుతున్నారు. డిప్యూటీ సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న కార్వేటినగరంలోనూ పీహెచ్సీని అప్గ్రేడ్ చేస్తూ 50 పడకల స్థాయికి పెంచారు. పనులు ప్రారంభించినా.. అసంపూర్తిగానే ఉన్నాయి.
కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా పేదలకు వైద్య సేవలు అందిస్తామని, ప్రభుత్వ వైద్యశాలలను రోగులకు అనుగుణంగా అప్గ్రేడ్ చేసి ఆ మేరకు సేవలు విస్తరిస్తామని సీఎం జగన్ ప్రతిపక్ష నాయకుడి హోదాలో హామీ ఇచ్చారు.. ఇప్పుడా హామీలు అటకెక్కాయి.. నాడు-నేడుతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో భవనాలు నిర్మించి, మౌలిక సదుపాయాలు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. అయినా నేడు వైద్య సేవలు అందడం లేదు. ఫలితంగా రోగులు ప్రైవేటు ఆస్పత్రులకు పరుగులు పెడుతున్నారు.
జిల్లాలో నాడు-నేడు ద్వారా పలమనేరు, కుప్పం, నగరి, పుంగనూరు ఏరియా ఆస్పత్రుల్లో పనులు చేపట్టారు. ఇప్పటికీ అవి పూర్తిస్థాయిలో జరగకపోవడం గమనార్హం. పనులు ఇంకా సాగుతూనే ఉన్నాయి. బంగారుపాళ్యం ఆస్పత్రిలో నిర్మాణం పూర్తయినా ఇంకా ప్రారంభించలేదు. జిల్లా వ్యాప్తంగా ఆస్పత్రులలో అక్కడక్కడా డాక్టర్ల కొరత వేధిస్తోంది. పుత్తూరు వైద్య విధాన పరిషత్తు ఆస్పత్రిలో చిన్న పిల్లలు వైద్యుడి పోస్టు ఖాళీగా ఉంది. పుంగనూరు ఏరియా ఆస్పత్రిలోనూ పలు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. చిత్తూరు ప్రజలు ఏ పెద్ద సమస్య వచ్చినా సీఎంసీ ఆస్పత్రి లేదా ఇతర ఆస్పత్రులకు రోగులను తరలిస్తున్నారు.ఆస్పత్రి అభివృద్ధి కమిటీలకు ప్రభుత్వం రూ.9కోట్లు విడుదల చేసింది. ఈ నిధులతో అత్యవసర మందుల కొనుగోలుకు చేసుకోవచ్చు. పీహెచ్సీ, సీహెచ్సీ, ఏరియా ఆస్పత్రులకు స్థానిక ఎమ్మెల్యేలు ఛైర్మన్లుగా నియమిస్తూ వైకాపా ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. అత్యవసర మందులు కొనుగోలు చేయాలన్నా వారి అనుమతి తప్పనిసరి. కొనుగోలు చేశాక సీఎఫ్ఎంఎస్లో బిల్లు అప్లోడ్ చేస్తే నిధులు ఉన్నప్పుడు ఆ బిల్లులు క్లియర్ చేస్తున్నారు. ఆ బిల్లుల జాప్యంతో కొందరు డాక్టర్లు ముందుగానే ఖర్చు చేసి బిల్లులు వచ్చాక తీసుకున్న సంఘటనలు ఉన్నాయి.
అమలు కాని 143జీవో..
రాష్ట్ర ప్రభుత్వం పీహెచ్సీకు వచ్చే రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో జీవో నంబరు 143ని జారీ చేసింది. ఈ మేరకు పీహెచ్సీలో 14 మంది ఉండాలి. ఇద్దరు డాక్టర్లు, సీహెచ్వో, ఎంపీహెచ్వో, పీహెచ్ఎన్, హెల్త్ ఎడ్యుకేటర్, ఫిమేల్ సూపర్వైజర్, హెడ్ నర్సు, ఎఫ్ఎన్వో, అటెండర్, స్టాఫ్ నర్సులు ముగ్గురు, కంప్యూటర్ ఆపరేటర్, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మాసిస్టు పోస్టులు విధిగా ఉండాలి. అయితే ఎక్కడా ఆ మేరకు సిబ్బంది లేరు. దీంతో ఉన్న సిబ్బందితోనే నెట్టుకు వస్తున్నారు.
పీహెచ్సీల్లో ప్రసవాల్లేవు..
అన్ని ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాలు జరగాలని ప్రభుత్వమే స్వయంగా ఆదేశాలు ఇచ్చినా.. జిల్లాలోని కొన్ని పీహెచ్సీల్లోనే ప్రసవాలు జరుగుతున్నాయి. పుత్తూరు మండలంలోని గొల్లపలి, పరమేశ్వరమంగళం పీహెచ్సీల్లో అయితే ప్రసవాలు ఇప్పటివరకు జరగకపోవడం గమనార్హం. పీహెచ్సీలకు వచ్చే గర్భిణులను సమీప సీహెచ్సీలు, ఏరియా ఆస్పత్రులకు రెఫర్ చేసి చేతులు దులుపుకోవడం గమనార్హం.
ప్రమాదం జరిగితే పరుగులే
జిల్లాలోని పలు ఆస్పత్రుల్లో అంబులెన్స్లు లేవు. మూడు జాతీయ రహదారులున్నా ప్రమాద సమయంలో అత్యవసర సేవలు అందించే ట్రామా సెంటర్ల ఏర్పాటులోనూ నిర్లక్ష్యమే. ప్రథమ చికిత్స నిర్వహించి తిరుపతికి తరలిస్తుంటారు. అక్కడకు వెళ్లేలోగా పలువురు మృత్యువాత పడిన సంఘటనలున్నాయి.
మెరుగైన సేవలు అందడం లేదు
- శివ, గట్టు, పుత్తూరు మండలం
ప్రభుత్వం స్థానిక ఆస్పత్రులలో మెరుగైన వైద్య సేవలు అందిస్తామని గొప్పలు చెబుతోంది.స్థానిక ఆస్పత్రులకు వెళితే తిరుపతికి రెఫర్ చేస్తున్నారు. రోగులను రెఫర్ చేసిన సమయంలో పుత్తూరు ఆస్పత్రిలో అంబులెన్స్ ఉన్నా డ్రైవర్ లేకపోవడంతో అది నిరుపయోగంగా ఉంది. దీంతో 108 వచ్చే దాకా ఆగాల్సిందే. 108 అత్యవసర కేసుకు వెళితే ఇక ప్రైవేటు వాహనంలో తీసుకెళ్లాల్సిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మంత్రి రోజాను అడ్డుకున్న వేమాపురం వాసులు
[ 04-05-2024]
మంత్రి రోజా ప్రచారాన్ని వడమాలపేట మండలం వేమాపురం గ్రామస్థులు శుక్రవారం రాత్రి అడ్డుకున్నారు. పూడి పంచాయతీలోని వేమాపురం గ్రామంలో మంత్రి రోజా ప్రచారం నిర్వహించడానికి ప్రచారం రథంలో వచ్చారు. -
కళ్లు మూసుకున్నారా ఐదేళ్లు..
[ 04-05-2024]
‘రాజకీయ నాయకుడికి విలువలు, విశ్వసనీయత ఉండాలి. మాట ఇస్తే నిలబెట్టుకోవాలి. ఇచ్చిన హామీ నెరవేర్చకపోతే పదవికి రాజీనామా చేయాలి.’ -
ఈ పాపం నీదే జగన్..
[ 04-05-2024]
మండు టెండలో రెండో రోజూ వృద్ధులను ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ముప్పుతిప్పలు పెట్టారు. ఇంటింటికీ పింఛన్ల పంపిణీ చేసేందుకు సరిపడా సిబ్బంది ఉన్నా తన స్వార్థ ప్రయోజనం కోసం వేదనకు గురిచేశారు. -
నగరిలో సైకిల్ జోరు..
[ 04-05-2024]
నగరిలో మంత్రి రోజాను వ్యతిరేకిస్తూ అసమ్మతి నాయకులు ఇన్నాళ్లు గళం విప్పుతూ వచ్చారు. ఆమెకు టికెట్ ఇవ్వొద్దని అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లినా అధిష్ఠానం ఇచ్చింది. -
జగనే సర్పంచులకు గండం
[ 04-05-2024]
దోపిడీకి కాదేదీ అనర్హం అన్నట్లు వైకాపా ప్రభుత్వం పంచాయతీ నిధులనూ వదల్లేదు.. గ్రామ స్వరాజ్యం కోసం గాంధీజీ కన్న కలలను సీఎం జగన్ కల్లోలం చేశారు.. ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన సర్పంచులు ఉత్సవ విగ్రహాల్లా మార్చారు. -
మా బతుకులు రోడ్డున వేశావ్.. జగన్!
[ 04-05-2024]
కష్టాన్ని నమ్ముకున్న బడుగు జీవులు వైకాపా పాలనలో ఇసుక కొరతతో నానా అవస్థలు పడ్డారు. చేద్దామంటే పనుల్లేక.. తిందామంటే తిండిలేక.. ఇతర ప్రాంతాలకు వెళ్లి పనులు చేద్దామంటే పనుల్లేక.. పెరిగిన నిత్యావసరాల ధరలు భవన నిర్మాణ రంగ కార్మికులకు పూట గడవని పరిస్థితులు దాపురించాయి. -
మేనమామ.. క్రీడలపై సవతి ప్రేమ..!
[ 04-05-2024]
బటన్ నొక్కి పిల్లలకు మేనమామలా సంక్షేమం ఇచ్చానని చెప్పిన సీఎం జగన్. క్రీడాకారులపై మాత్రం సవతి ప్రేమ చాటారని క్రీడా లోకం మండిపడిపోతోంది. కమర్షియల్ క్రీడల్లో సాధనకు రుసుమల్ని పెంచి.. పేద ఆటగాళ్లను ఆటలకు దూరం చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.. -
చిత్తూరును స్మార్ట్సిటీని చేస్తా
[ 04-05-2024]
పేదలకు అండగా నిలవడం నాకు ఇష్టం.. జిల్లా కేంద్రమైనా చిత్తూరులో అభివృద్ధి జాడేలేదు.. యువత ఉద్యోగాల కోసం బెంగళూరు, చెన్నై సహా విదేశాలకు వెళ్తున్నారు.. జన్మభూమి రుణం తీర్చుకోవాలనే ఆశయంతో రాజకీయాల్లోకి రాక ముందే జీజేఎం ట్రస్టు ద్వారా ప్రజాసేవకు శ్రీకారం చుట్టా.. -
‘భవన’దీయుడి కోసం
[ 04-05-2024]
నంది కూడలిలో ఉన్న ఈ అత్యాధునిక భవనం నగరపాలక సంస్థకు చెందినది. తిరుపతి స్మార్ట్సిటీ కార్పొరేషన్ నిధులు రూ.2 కోట్లు వెచ్చించి తిరుమలకు వచ్చే యాత్రికుల సౌకర్యార్థం నిర్మించారు. -
వృద్ధులమని తెలుసు.. ఇంటికివ్వలేని మనసు
[ 04-05-2024]
జగన్ ప్రభుత్వ చర్యలతో వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బయట ఎండకు, బ్యాంకుల్లో ఉక్కపోతతో అల్లాడిపోయారు. గురు, శుక్రవారాలు రెండు రోజులపాటు బ్యాంకుల చుట్టూ తిరిగినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. -
బారుకు వెళ్తేనే బీరు
[ 04-05-2024]
ఎండాకాలంలో బీర్లకున్న డిమాండ్ అంతాఇంతా కాదు. మండుటెండలో ప్రభుత్వ మద్యం దుకాణాలు తిరిగినా బీరు దొరక్క బార్ల మెట్లెక్కాల్సి వస్తోంది. రూ.350 - రూ.410 వరకు చెల్లించి బీర్లు తాగాల్సిన పరిస్థితి నెలకొంది. -
‘తాపీ’గా లేం జగన్!
[ 04-05-2024]
వైకాపా సర్కార్ తెచ్చిన ఇసుక విధానం, సామగ్రి ధరల పెరుగుదల కూలీలకు శాపంగా మారింది. అరకొర పనులు, అప్పుల బాధలు, సమస్యలు భరించలేక కార్మికులు బలవన్మరణాలకు దారితీస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
అమెరికా జట్టులో మనోళ్లదే జోరు
-
మేనమామనన్నావ్.. మా కిట్లు ఆపేశావ్
-
పేర్ని కిట్టూపై ఎందుకంత ప్రేమ?.. స్వామి భక్తి ప్రదర్శిస్తున్న పోలీసులు
-
దళిత యువకుడికి పోలీసుల చిత్రహింసలు.. డిగ్రీ పరీక్షలు రాయకుండా నిర్బంధం
-
గులకరాయి ఘటనను.. ఎన్నికల్లో లబ్ధికి వినియోగించుకోకుండా అడ్డుకోండి
-
గరిష్ఠ ఉష్ణోగ్రతల్లో రోజుకో రికార్డు