ఏళ్లుగా ఉద్యోగులకు శిక్షే
అనేక సంస్కరణలు తీసుకొచ్చామంటూ ఊకదంపుడు ఉపన్యాసాలిచ్చే సీఎం జగన్ మాటలు ఎండమావులుగానే మిగిలిపోతున్నాయి. 2019 ఎన్నికలకు ముందు సమగ్ర శిక్షాలో పని చేస్తున్న ఉద్యోగులకు ఎంటీఎస్, హెచ్ఆర్ పాలసీ అమలు చేస్తామని.. పలు హామీలు ఇచ్చి వాటిని గాలికొదిలేశారు.
సమ్మె చేస్తుంటే బెదిరించి విరమింపజేశారు
సమగ్ర శిక్షా సిబ్బంది సమస్యలు పట్టించుకోని ప్రభుత్వం
సమస్యలు పరిష్కరించాలని సీఎంకు పంపే పోస్టు కార్డులు చూపుతూ..
కలెక్టరేట్(గుంటూరు), న్యూస్టుడే: అనేక సంస్కరణలు తీసుకొచ్చామంటూ ఊకదంపుడు ఉపన్యాసాలిచ్చే సీఎం జగన్ మాటలు ఎండమావులుగానే మిగిలిపోతున్నాయి. 2019 ఎన్నికలకు ముందు సమగ్ర శిక్షాలో పని చేస్తున్న ఉద్యోగులకు ఎంటీఎస్, హెచ్ఆర్ పాలసీ అమలు చేస్తామని.. పలు హామీలు ఇచ్చి వాటిని గాలికొదిలేశారు. గడిచిన ఐదేళ్లలో సమగ్ర శిక్షాలో పని చేస్తున్న ఏ ఒక్క ఉద్యోగికి సీఎం జగన్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ అమలు చేయలేదు. దీంతో ఈ ఏడాది జనవరిలో ఉద్యోగులు సమ్మెబాట పట్టారు. 21 రోజుల పాటు నిరాహార దీక్షలు చేసి ప్రభుత్వం తమ సమస్యలు పట్టించుకోవాలని విన్నవించారు. దానిని విరమింపజేసేందుకు ప్రభుత్వం అనేక రకాల ఒత్తిళ్లు తీసుకొచ్చింది. చివరకు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఉద్యోగులతో చర్చించారు. అతి త్వరలోనే ఎంటీఎస్ అమలు చేస్తామని, సమ్మె కాలానికి జీతం ఇస్తామని హామీ ఇచ్చారు. వీటి అమలుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు. కానీ ఏ ఒక్కటీ అమలు చేయకుండా.. వైకాపా సర్కారు పెద్ద శిక్షే వేసిందని ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు.
దశాబ్దాలుగా అదే స్థాయిలో..
సమగ్ర శిక్షాలో జిల్లాలో ఎంఐఎస్ సమన్వయకర్తలు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, అకౌంటెంట్స్, క్లస్టర్ రిసోర్స్పర్సన్స్, మెసెంజర్స్, ఐఈడీ సమన్వయకర్తలు.. ఇలా వివిధ రకాల పేర్లతో ఈ ప్రాజెక్టులో ఉద్యోగులు సుమారు వెయ్యి మంది వరకు విధులు నిర్వహిస్తున్నారు. దశాబ్దాల కాలంగా వీరు ఇదే ప్రాజెక్టు కింద పని చేస్తున్నా వీరి జీవితాల్లో మాత్రం ఎటువంటి వృద్ధి కనిపించని పరిస్థితి. గత ఎన్నికల సమయంలో జగన్ ప్రతిపక్ష నేతగా సమగ్ర శిక్షాలో పనిచేస్తున్న వారిని రెగ్యులర్ చేస్తామని, మినిమం టైం స్కేల్ అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఆ నమ్మకంతో నాలుగున్నరేళ్లుగా ఎదురుచూసినా సమగ్ర శిక్షా ప్రాజెక్టు ఉద్యోగులకు నిరాశే మిగిలింది. ఏటా ఈ ప్రాజెక్టులో పనిచేసే ఉద్యోగులను తొలగించి.. తర్వాత రోజు మళ్లీ ప్రత్యేకంగా బాండ్ రాయించుకుని విధుల్లోకి తీసుకుంటారు. గతంలో నెల రోజుల పాటు తొలగించేవారు.. ప్రస్తుతం ఒక్కరోజు మాత్రమే తొలగిస్తున్నారు.
కమిటీ పేరుతో కాలయాపన
మినిమం టైం స్కేల్, హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని జనవరిలో 21 రోజులు సమ్మె చేశాం. ప్రభుత్వం చర్చల పేరుతో పిలిచి ప్రత్యేకించి కమిటీని ఏర్పాటు చేసి త్వరలోనే సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది. చర్చించి మూడు నెలలు గడిచినా నేటికీ కమిటీ నియమించలేదు. ఐదేళ్లుగా తమకు ఉద్యోగ భద్రత కల్పిస్తారేమోనని ఎదురుచూస్తున్నా చివరకు నిరాశే మిగిలింది.
- అబ్దుల్ రహీం, ఎస్ఎస్ఎ ఉద్యోగుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి
ఇస్తామని చెప్పి.. రూపాయి ఇవ్వలేదు
సమగ్ర శిక్షాలో పని చేస్తున్న ఉద్యోగులంతా కలిసి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఒత్తిడి తెచ్చేలా సమ్మె చేపట్టాం. అయితే స్పందించలేదు. చర్చల సమయంలో సమ్మె కాలానికి గౌరవ వేతనం ఇస్తామని చెప్పారు. ఇంతవరకు రూపాయి కూడా ఇవ్వలేదు. అసలే తక్కువ వేతనాలు.. అందులోనూ ప్రభుత్వం ఇస్తామని చెప్పి ఇవ్వకపోవడంతో ఇబ్బందులకు గురికావాల్సిన పరిస్థితి ఉంది.
- ఎస్ఎస్ఏ ఉద్యోగుల సంఘం నాయకులు
ఎంటీఎస్ అమలు చేయాలి
సమగ్ర శిక్షా ఉద్యోగులకు మినిమం టైం స్కేల్(ఎంటీఎస్)ను అమలు చేయాలి. ఎన్నికల సమయంలో అమలు చేస్తామని మాటిచ్చి అధికారంలోకి వచ్చాక కనీసం తమ పరిస్థితిని కన్నెత్తయినా చూడడం లేదు. కనీసం చర్చల్లో సూచించిన విధంగా సమయానికి కమిటీలను కూడా నియమించడం లేదు. ఏళ్లుగా ఇదే ఉద్యోగంలో ఉన్నా తాము ఉద్యోగులుగా చెప్పుకునే పరిస్థితి లేకుండా పోయింది.
- గంగయ్య, ఎస్ఎస్ఎ ఉద్యోగుల సంఘం కోశాధికారి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెదేపా ఆధ్వర్యంలో ట్రాక్టర్లతో భారీ ప్రదర్శన
[ 03-05-2024]
మండలంలోని ఇంజనంపాడు, కమలమూడి, కాట్రపాడు, రొట్టె చెరుకూరు, లేములపాడు, అనంతపురం గ్రామాల్లో తెదేపా ఎంపీ, ఎమ్మెల్యే... -
కక్షగట్టి రప్పించారు.. కసితీరా వేధించారు..
[ 03-05-2024]
అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అవసరమైతే తప్ప ఇళ్లల్లో నుంచి బయటకు రావొద్దని ఒకవైపు ప్రచారం చేయిస్తున్న పాలకులు ఆరు పదుల వయసు పైబడిన సామాజిక పింఛనుదారులను మాత్రం మండుటెండలో బజారుకీడ్చి వారిని ఇబ్బందుల పాల్జేశారు. -
మీతోనే ముప్పు.. మీవల్లే ముంపు!
[ 03-05-2024]
వారి బాగోగులను అనుక్షణం పట్టించుకోవాలి.అక్కడి ప్రకృతి, పర్యావరణంతోపాటు నదులు, వాగులు, వంకలు సహా పంట పొలాలను రక్షించు కోవాలి. -
నా వంతుగా.. మామకు మద్దతుగా..
[ 03-05-2024]
సినీ హీరో నిఖిల్ గురువారం చీరాలలో సందడి చేశారు. కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎంఎం కొండయ్యకు మద్దతుగా ఆయన పట్టణంలో ప్రచారం చేపట్టారు. -
బీసీ నాయకులకు జగన్ కుర్చీ కూడా వేయనివ్వరు
[ 03-05-2024]
బీసీ నాయకులు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి దగ్గరకు వెళితే కనీసం కుర్చీ కూడా వేయరు, ఎవరికి వేయాలో ఆయన కనుసైగలతో సూచిస్తారని మనమంతా విన్నాం, బీసీల పట్ల ఆయన చూపే గౌరవం తీరు ఆ పార్టీ ఆలోచనా విధానాన్ని తెలియచేస్తుందని కూటమి గుంటూరు ఎంపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. -
పోలీసు.. నేత.. చెట్టపట్టాల్!
[ 03-05-2024]
అధికార వైకాపా నేతల కనుసన్నల్లోనే ఇప్పటికీ పోలీసు యంత్రాంగం జోగుతోంది. విధి నిర్వహణలో వారు చెప్పిందే పోలీసులకు వేదంగా ఉంటోంది. -
ఉద్యోగుల ఓట్లకు..గండికొట్టాలనేనా?
[ 03-05-2024]
ఉమ్మడి గుంటూరులో ఎన్నికల విధుల్లో పాల్గొనే ప్రభుత్వ ఉద్యోగులు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఇవ్వాల్సిన ఫారం-12కు ఎన్నికల అధికారులు మోకాలడ్డుతున్నారు. -
క్షీణించిన శ్రీలక్ష్మి ఆరోగ్యం
[ 03-05-2024]
వైకాపా నాయకుల దౌర్జన్యాలు, కబ్జాలతో నష్టపోయిన బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ నిరవధిక నిరాహార దీక్ష చేపట్టిన ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు కోపూరి శ్రీలక్ష్మి ఆరోగ్యం క్షీణించడంతో కుటుంబసభ్యులు గురువారం ఆమెను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే ధ్యేయం
[ 03-05-2024]
తెదేపా అధికారంలోకి రావడం ఖాయం. వచ్చే ఐదేళ్లలో నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాలను కల్పించి తీరతాం’.. అని గుంటూరు పశ్చిమ తెదేపా అభ్యర్థి గళ్లా మాధవి స్పష్టం చేశారు. -
అధికార పార్టీని చిత్తుగా ఓడించండి
[ 03-05-2024]
రాష్ట్రంలో అరాచకపాలన సాగిస్తున్న ప్రభుత్వం మారాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ‘ఇండియా’ కూటమి అభ్యర్థులు జంగాల అజయ్కుమార్, జొన్నా శివశంకరరావు తరఫున మంగళగిరిలో గురువారం సాయంత్రం జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని మాట్లాడారు. -
లోకేశ్ మంగళగిరి రూపురేఖలు మారుస్తారు
[ 03-05-2024]
గతంలో ఎమ్మెల్యేలుగా పనిచేసిన మంగళగిరి వైకాపా అభ్యర్థి తల్లి కాండ్రు కమల, మామ మురుగుడు హనుమంతరావు నియోజకవర్గానికి ఏం చేశారని ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ ప్రశ్నించారు. -
ఆంధ్రాప్యారిస్ పేరుకు తగ్గట్లు అభివృద్ధి చేస్తాం
[ 03-05-2024]
ఆంధ్రాప్యారిస్ను పేరుకు తగిన విధంగా అభివృద్ధి చేసి చూపిస్తామని, తమకు మద్దతు ఇవ్వాలని కూటమి గుంటూరు ఎంపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, తెనాలి ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు -
మహిళలే నిర్ణేతలు
[ 03-05-2024]
ఓటర్ల తుది జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేసింది. జనవరి 22 తర్వాత జరిగిన చేర్పులు, మార్పులు అనంతరం 22,029 మంది ఓటర్లు పెరిగారు. -
ఉద్యోగుల ఓట్లకు.. గండికొట్టాలనేనా?
[ 03-05-2024]
ఉమ్మడి గుంటూరులో ఎన్నికల విధుల్లో పాల్గొనే ప్రభుత్వ ఉద్యోగులు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఇవ్వాల్సిన ఫారం-12కు ఎన్నికల అధికారులు మోకాలడ్డుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
నిర్మాతలే కావాలని రూమర్స్ సృష్టించేవారు.. : సోనాలి బింద్రే
-
ఓటమి లేదా టై.. మేం ఊహించిన ఫలితమిదే: థ్రిల్లింగ్ విక్టరీపై నితీశ్ రెడ్డి
-
బెంగాల్ గవర్నర్పై లైంగిక వేధింపుల ఆరోపణలు.. స్పందించిన రాజ్భవన్
-
‘ఆడబిడ్డలు ఓడిపోయారు.. అతడే గెలిచాడు’: బ్రిజ్ భూషణ్ కుమారుడికి టికెట్పై సాక్షి పోస్ట్
-
శంషాబాద్లో ప్రయాణికులను వదిలేసి వెళ్లిన విమానాలు!
-
లాభాల్లో సూచీలు.. 75,000 ఎగువకు సెన్సెక్స్.. 22,750 పైన నిఫ్టీ