మేలు సంగతి తర్వాత.. ముందు నీళ్లివ్వండి
‘మేం అధికారంలోకి రాగానే ఈ ప్రాంతాన్ని అభివృద్ధికి చిరునామాగా మారుస్తాం. సకల సౌకర్యాలు కల్పించి ప్రజల కష్టాలు తీరుస్తాం.’ ఇవీ వైకాపా నేతలు సమయం చిక్కినప్పుడల్లా ప్రజలకు ఇచ్చిన హామీలు.‘
తుళ్లూరు, మేడికొండూరు, ఫిరంగిపురం గ్రామీణం, న్యూస్టుడే
నెక్కల్లులో వీధి కుళాయి నుంచి బిందెలతో నీరు మోసుకు వెళుతున్న గ్రామస్తులు
‘మేం అధికారంలోకి రాగానే ఈ ప్రాంతాన్ని అభివృద్ధికి చిరునామాగా మారుస్తాం. సకల సౌకర్యాలు కల్పించి ప్రజల కష్టాలు తీరుస్తాం.’ ఇవీ వైకాపా నేతలు సమయం చిక్కినప్పుడల్లా ప్రజలకు ఇచ్చిన హామీలు.‘
మీకు మేలు జరిగి ఉంటేనే ఓటు వేయండని వైకాపా అధినేత జగన్ ఊదరగొడుతున్నారు. కానీ తాడికొండ నియోజకవర్గంలో ఏ ప్రాంతానికి వెళ్లినా.. మేలు సంగతి దేవుడెరుగు ముందు తాగేందుకు నీళ్లు ఇవ్వండి’ అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వైకాపా ప్రభుత్వానికి ముందు చూపు లేకపోవడంతో గ్రామాల్లో నీటి ఎద్దడి ఏర్పడింది. రాజధాని ప్రాంతమైన తాడికొండ నియోజకవర్గంలో తాగు నీటి వెతలు తప్పడం లేదు. చెరువులకు ఆలస్యంగా నీరు వదలడంలో మూడు నెలలుగా ఇంటింటికీ నీటి సరఫరా సక్రమంగా జరగలేదు. వీధి కుళాయిలు ద్వారా నీరు సరఫరా చేయలేని చోట్ల అధికారులు బోర్లు ద్వారా అందిస్తున్నా అవి నీరు సరిపోవడం లేదు. మేడికొండూరులో ప్రజలు డ్రమ్ములో నిల్వ చేసుకొని వాడుకుంటున్నారు. ఎలాంటి సౌకర్యం లేని వాళ్లు ఒక్కో ట్రాక్టర్ ట్యాంకర్ రూ.1200లు చొప్పున కొనుగోలు చేసుకుంటున్నారు.
చందాలు వేసుకొని బిల్లులు కడుతున్నాం
తుళ్లూరు మండలం నెక్కల్లు గ్రామంలోని మిక్చర్ కాలనీలో ప్రభుత్వం ఇంటింటికీ కుళాయిలు లేకపోవడంతో గత ప్రభుత్వంలో కాలనీలో బోర్లు వేసి మోటార్లు బిగించారు. అప్పటి నుంచి కాలనీ వాసులు చందాలు వేసుకొని విద్యుత్తు ఛార్జీలు కట్టి మోటారు ద్వారా వీధుల్లో కుళాయి ఏర్పాటు చేసుకున్నారు. విద్యుత్తు ఛార్జీలు చెల్లించడం లేదని కొద్ది రోజుల కిందట మోటారుకు ఉన్న మీటరు ఆ శాఖ అధికారులు తొలగించారు. కాలనీలో సుమారు 300 మంది జనాభా నివసిస్తున్నారు. అందరూ బడుగు బలహీన వర్గాలకు చెందిన వారే. పగలంతా కూలీ పనులకు వెళ్లి వచ్చి దూర ప్రాంతాల నుంచి బిందెలతో నీళ్లు మోసుకొచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. తమ గోడు పట్టించుకోవడం లేదని ఏ మోహం పెట్టుకొని ఓట్లు అడగటానికి వస్తారో చూస్తామని హెచ్చరిస్తున్నారు.
పాడైన పైప్లైన్.. చెరువుకు చేరని నీరు
ఉప్పలపాడు (పెదనందిపాడు), న్యూస్టుడే: నీటి ఎద్దడి ఎదుర్కొంటున్న ఉప్పలపాడు చెరువుకు కారసాల సమగ్ర తాగు నీటి పథకం నుంచి నీరు రావడం లేదు. నీటి ఇబ్బందులపై గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. పథకం పైప్లైన్ ఉప్పలపాడు ఓగేరు వాగు సమీపంలో పాడైపోయింది. దీంతో గత రెండు రోజుల నుంచి చెరువుకు నీరు సరఫరా కావడం లేదు. చెరువుకు పది శాతం మాత్రమే నీరు వచ్చినట్లు పంచాయితీ అధికారులు తెలిపారు. పైప్లైన్ వెంటనే బాగు చేయించి చెరువును నింపేందుకు చర్యలు చేపడతామని గ్రామీణ నీటి సరఫరా విభాగ ఏఈ రాజేష్ తెలిపారు.
చేతి పంపు మరమ్మతుకు గురైంది
మిక్చర్ కాలనీలో నివాసం ఉంటున్న నాకు 70 ఏళ్లు. మా వీధిలో ఉన్న చేతి పంపు మరమ్మతుకు గురైనా అధికారులు పట్టించుకోవడం లేదు. విద్యుత్తు అధికారులు మీటరు తొలగించారు. తాగు నీటి కోసం దూర ప్రాంతానికి వెళ్లి నీరు తెచ్చుకోలేక ఇబ్బంది పడుతున్నా.
- సామ్రాజ్యం, గృహిణి, నెక్కల్లు గ్రామం.
ఇంటింటికి కుళాయిలు లేవు
తమ వద్ద పంచాయతీ అధికారులు బెదిరిస్తూ పన్నులు కట్టించుకుంటున్నారు. మేం ఉండే కాలనీకి ట్యాంకు నుంచి ఇంటింటికీ కుళాయి ఏర్పాటు చేయలేదు.
పార్వతి, రైతుకూలీ, మిక్చర్ కాలనీ, నెక్కల్లు గ్రామం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కక్షగట్టి రప్పించారు.. కసితీరా వేధించారు..
[ 03-05-2024]
అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అవసరమైతే తప్ప ఇళ్లల్లో నుంచి బయటకు రావొద్దని ఒకవైపు ప్రచారం చేయిస్తున్న పాలకులు ఆరు పదుల వయసు పైబడిన సామాజిక పింఛనుదారులను మాత్రం మండుటెండలో బజారుకీడ్చి వారిని ఇబ్బందుల పాల్జేశారు. -
మీతోనే ముప్పు.. మీవల్లే ముంపు!
[ 03-05-2024]
వారి బాగోగులను అనుక్షణం పట్టించుకోవాలి.అక్కడి ప్రకృతి, పర్యావరణంతోపాటు నదులు, వాగులు, వంకలు సహా పంట పొలాలను రక్షించు కోవాలి. -
నా వంతుగా.. మామకు మద్దతుగా..
[ 03-05-2024]
సినీ హీరో నిఖిల్ గురువారం చీరాలలో సందడి చేశారు. కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎంఎం కొండయ్యకు మద్దతుగా ఆయన పట్టణంలో ప్రచారం చేపట్టారు. -
బీసీ నాయకులకు జగన్ కుర్చీ కూడా వేయనివ్వరు
[ 03-05-2024]
బీసీ నాయకులు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి దగ్గరకు వెళితే కనీసం కుర్చీ కూడా వేయరు, ఎవరికి వేయాలో ఆయన కనుసైగలతో సూచిస్తారని మనమంతా విన్నాం, బీసీల పట్ల ఆయన చూపే గౌరవం తీరు ఆ పార్టీ ఆలోచనా విధానాన్ని తెలియచేస్తుందని కూటమి గుంటూరు ఎంపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. -
పోలీసు.. నేత.. చెట్టపట్టాల్!
[ 03-05-2024]
అధికార వైకాపా నేతల కనుసన్నల్లోనే ఇప్పటికీ పోలీసు యంత్రాంగం జోగుతోంది. విధి నిర్వహణలో వారు చెప్పిందే పోలీసులకు వేదంగా ఉంటోంది. -
ఉద్యోగుల ఓట్లకు..గండికొట్టాలనేనా?
[ 03-05-2024]
ఉమ్మడి గుంటూరులో ఎన్నికల విధుల్లో పాల్గొనే ప్రభుత్వ ఉద్యోగులు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఇవ్వాల్సిన ఫారం-12కు ఎన్నికల అధికారులు మోకాలడ్డుతున్నారు. -
క్షీణించిన శ్రీలక్ష్మి ఆరోగ్యం
[ 03-05-2024]
వైకాపా నాయకుల దౌర్జన్యాలు, కబ్జాలతో నష్టపోయిన బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ నిరవధిక నిరాహార దీక్ష చేపట్టిన ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు కోపూరి శ్రీలక్ష్మి ఆరోగ్యం క్షీణించడంతో కుటుంబసభ్యులు గురువారం ఆమెను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే ధ్యేయం
[ 03-05-2024]
తెదేపా అధికారంలోకి రావడం ఖాయం. వచ్చే ఐదేళ్లలో నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాలను కల్పించి తీరతాం’.. అని గుంటూరు పశ్చిమ తెదేపా అభ్యర్థి గళ్లా మాధవి స్పష్టం చేశారు. -
అధికార పార్టీని చిత్తుగా ఓడించండి
[ 03-05-2024]
రాష్ట్రంలో అరాచకపాలన సాగిస్తున్న ప్రభుత్వం మారాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ‘ఇండియా’ కూటమి అభ్యర్థులు జంగాల అజయ్కుమార్, జొన్నా శివశంకరరావు తరఫున మంగళగిరిలో గురువారం సాయంత్రం జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని మాట్లాడారు. -
లోకేశ్ మంగళగిరి రూపురేఖలు మారుస్తారు
[ 03-05-2024]
గతంలో ఎమ్మెల్యేలుగా పనిచేసిన మంగళగిరి వైకాపా అభ్యర్థి తల్లి కాండ్రు కమల, మామ మురుగుడు హనుమంతరావు నియోజకవర్గానికి ఏం చేశారని ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ ప్రశ్నించారు. -
ఆంధ్రాప్యారిస్ పేరుకు తగ్గట్లు అభివృద్ధి చేస్తాం
[ 03-05-2024]
ఆంధ్రాప్యారిస్ను పేరుకు తగిన విధంగా అభివృద్ధి చేసి చూపిస్తామని, తమకు మద్దతు ఇవ్వాలని కూటమి గుంటూరు ఎంపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, తెనాలి ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు -
మహిళలే నిర్ణేతలు
[ 03-05-2024]
ఓటర్ల తుది జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేసింది. జనవరి 22 తర్వాత జరిగిన చేర్పులు, మార్పులు అనంతరం 22,029 మంది ఓటర్లు పెరిగారు. -
ఉద్యోగుల ఓట్లకు.. గండికొట్టాలనేనా?
[ 03-05-2024]
ఉమ్మడి గుంటూరులో ఎన్నికల విధుల్లో పాల్గొనే ప్రభుత్వ ఉద్యోగులు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఇవ్వాల్సిన ఫారం-12కు ఎన్నికల అధికారులు మోకాలడ్డుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఓటమి లేదా టై.. మేం ఊహించిన ఫలితమిదే: థ్రిల్లింగ్ విక్టరీపై నితీశ్ రెడ్డి
-
బెంగాల్ గవర్నర్పై లైంగిక వేధింపుల ఆరోపణలు.. స్పందించిన రాజ్భవన్
-
‘ఆడబిడ్డలు ఓడిపోయారు.. అతడే గెలిచాడు’: బ్రిజ్ భూషణ్ కుమారుడికి టికెట్పై సాక్షి పోస్ట్
-
శంషాబాద్లో ప్రయాణికులను వదిలేసి వెళ్లిన విమానాలు!
-
లాభాల్లో సూచీలు.. 75,000 ఎగువకు సెన్సెక్స్.. 22,750 పైన నిఫ్టీ
-
భారత్పై బైడెన్కు అమితమైన గౌరవం: శ్వేతసౌధం