పని భారం పెంచేశారు.. పోస్టులు భర్తీ చేయరు..
జిల్లా బీసీ సంక్షేమ శాఖ కార్యాలయం: ఇక్కడ ఐదు పోస్టులే ఉన్నాయి. అందులో ఒక సూపరింటెండెంట్, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, సబార్డినేట్, డేటా ఎంట్రీ ఆపరేటర్.
ఒత్తిడితో ఉద్యోగులు సతమతం
కలెక్టరేట్ (గుంటూరు), జిల్లాపరిషత్తు, న్యూస్టుడే: జిల్లా బీసీ సంక్షేమ శాఖ కార్యాలయం: ఇక్కడ ఐదు పోస్టులే ఉన్నాయి. అందులో ఒక సూపరింటెండెంట్, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, సబార్డినేట్, డేటా ఎంట్రీ ఆపరేటర్. ఇందులో సూపరింటెండెంట్ సీఎంవోలో పని చేస్తున్నారు. మిగిలిన నలుగురితో కార్యకలాపాలు నెట్టుకొస్తున్నారు. 2022లో జిల్లాల పునర్విభజన జరిగిన తర్వాత సింహభాగం సిబ్బందిని పల్నాడు, బాపట్ల జిల్లాలకు కేటాయించారు. ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ఆర్థిక అంశాలతో పాటు ఉద్యోగుల సర్వీస్ వివరాలు, పరిపాలన అంశాలకు సంబంధించి గుంటూరు జిల్లాకు చెందిన అధికారులు, సిబ్బంది పర్యవేక్షించాల్సి ఉంటుంది. కొత్తగా ఉద్యోగ నియామకాలు ప్రభుత్వం చేయడం లేదు. డిప్యుటేషన్ విధానానికి అవకాశం లేదు. దీంతో ఉన్న కొద్దిమంది పైనే మోయలేని పనిభారం ఉంటుంది.
సాంఘిక సంక్షేమ శాఖ: జిల్లాల పునర్విభజన తర్వాత పల్నాడు, బాపట్ల జిల్లాలకు ఉన్న సిబ్బందిలో ఎక్కువ మందిని సర్దుబాటు చేశారు. కానీ ఇప్పటికీ ఆ రెండు జిల్లాలకు సంబంధించిన వ్యవహారాలు గుంటూరు జిల్లా నుంచే చక్కబెట్టాల్సి వస్తుంది. అధికారికంగా పార్లమెంట్లో బిల్లు ఆమోదం పొందకపోవడంతో ఆర్థిక పరమైన అంశాలకు సంబంధించిన విధి, విధానాలు ఇక్కడ నుంచి సూచించాల్సిన పరిస్థితి.
జిల్లా పంచాయతీ కార్యాలయం: ఈ శాఖలో విభజన ముందు నుంచి కొన్ని పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. విభజన సమయంలో పల్నాడు, బాపట్ల జిల్లాలకు కొంతమందిని సర్దుబాటు చేశారు. ప్రస్తుతం పనిచేస్తున్న వారు కొద్ది మంది మాత్రమే. గుంటూరు జిల్లాకు సంబంధించిన ఉత్తర ప్రత్యుత్తరాలే కదా అనుకుంటే పొరపాటే. పంచాయతీ, ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్ ఇలా చాలా శాఖల్లో ఉద్యోగుల సర్వీసు వ్యవహారాలు, ఆర్థిక అంశాలను ఉమ్మడి జిల్లా నుంచే కార్యకలాపాలు నిర్వహించాల్సి వస్తోంది. రిటైర్ అయిన ఉద్యోగి స్థానంలో కొత్త వారిని నియమించుకునే పరిస్థితి లేక ఉన్నవారిపై పని ఒత్తిడి పెంచేశారు. దీనికి తోడు విశ్రాంత ఉద్యోగులతో పాటు సిబ్బంది హైకోర్టులో సర్వీస్కు సంబంధించి కేసులు వేస్తుండటంతో అఫిడవిట్ల దాఖలుకు, వాయిదాలకు హాజరయ్యేందుకు వెళ్లాల్సి వస్తుండటంతో సమయం పోతుంది.
ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను భర్తీ చేస్తాం. ఉద్యోగులపై పని ఒత్తిడిని తగ్గిస్తాం.. అంటూ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్ చెప్పిన మాటలు నేటికీ నీటి మూటలుగానే మిగిలాయి. ఖాళీలు భర్తీ చేయకపోగా పని ఒత్తిడి పెంచేయడంతో ఉద్యోగులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులంటే ఠంచనుగా 5 గంటలకు ఇంటికి వచ్చేసారనేది ఒకప్పటి నానుడి. ప్రస్తుతం ఏ కోశాన అలాంటి పరిస్థితి కనిపించడం లేదు కదా. ఎవరూ ఆ విషయాన్ని చెప్పుకుంటున్న సందర్భాలు లేవు. ఉద్యోగ విరమణ చేసినవారి స్థానంలో కొత్తవారిని నియమించలేదు. దీంతో పని ఒత్తిడి పెరిగిపోయింది.
ఆరోగ్య పరంగా ఇబ్బందులు
పని భారం, ఉన్నతాధికారులు, ప్రభుత్వం ఒత్తిడితో ఉద్యోగులు అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. వయో పరిమితి పెంపుతో చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. దీనికితోడు ఆయా శాఖల్లో ఖాళీలు ఎక్కువగా ఉండటంతో కొత్తవారిని నియమించుకోలేకపోతున్నారు. కనీసం డిప్యుటేషన్పై పని చేయించుకునేందుకు వీల్లేదు. దీంతో ఇద్దరు ముగ్గురు చేయాల్సిన పనులను కూడా ఒక్కరే నిర్వర్తిస్తున్న శాఖలు చాలానే ఉన్నాయి.
ఓ ఉద్యోగ సంఘ నాయకుడు
విభజించినా ఇక్కడ నుంచే వ్యవహారాలు
జిల్లాల పునర్విభజన తర్వాత గుంటూరు జిల్లాలో పనిచేస్తున్న ఉద్యోగులు ఎక్కువ మంది సిబ్బందిని పల్నాడు, బాపట్ల జిల్లాలకు సర్దుబాటు చేశారు. ఇక్కడున్న సిబ్బందికి ఒక్కొక్కరికి వారు చూసే విభాగాలకు అదనంగా విభాగాలు చేర్చారు. దీంతో ఒక ఉద్యోగి ఇద్దరు మనుషుల పనులు చేయాల్సి వస్తుంది. ప్రస్తుత సాంకేతిక విధానాలో టీసీ, వీసీలు అదనంగా తోడయ్యాయి. వారంలో రెండ్రోజులు వీటికే సరిపోతుంది. ఇంతటి తీవ్ర పని ఒత్తిడిని ఉద్యోగులు ఎదుర్కొంటున్నారు.
ఉద్యోగి
ఖాళీలు భర్తీ చేస్తే భారం తగ్గుతుంది
ఉద్యోగులు ఉద్యోగ విరమణ పొందితే ఆర్థిక ప్రయోజనాలు ఇవ్వాల్సి వస్తుందని.. ప్రభుత్వం 62 సంవత్సరాలకు వయో పరిమితి పెంచింది. దీంతో అప్పటికే ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయక పనిభారంతో పాటు ఆరోగ్య సమస్యలు కొని తెచ్చుకున్నట్లు ఉంటుంది. ఉదయం 10 గంటలకు విధుల్లో చేరిన ఉద్యోగులు తిరిగి సాయంత్రం ఏ సమయానికి ఇంటికి వెళతారంటే సమయం కచ్చితంగా చెప్పలేని పరిస్థితి.
ఉద్యోగి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కక్షగట్టి రప్పించారు.. కసితీరా వేధించారు..
[ 03-05-2024]
అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అవసరమైతే తప్ప ఇళ్లల్లో నుంచి బయటకు రావొద్దని ఒకవైపు ప్రచారం చేయిస్తున్న పాలకులు ఆరు పదుల వయసు పైబడిన సామాజిక పింఛనుదారులను మాత్రం మండుటెండలో బజారుకీడ్చి వారిని ఇబ్బందుల పాల్జేశారు. -
మీతోనే ముప్పు.. మీవల్లే ముంపు!
[ 03-05-2024]
వారి బాగోగులను అనుక్షణం పట్టించుకోవాలి.అక్కడి ప్రకృతి, పర్యావరణంతోపాటు నదులు, వాగులు, వంకలు సహా పంట పొలాలను రక్షించు కోవాలి. -
నా వంతుగా.. మామకు మద్దతుగా..
[ 03-05-2024]
సినీ హీరో నిఖిల్ గురువారం చీరాలలో సందడి చేశారు. కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎంఎం కొండయ్యకు మద్దతుగా ఆయన పట్టణంలో ప్రచారం చేపట్టారు. -
బీసీ నాయకులకు జగన్ కుర్చీ కూడా వేయనివ్వరు
[ 03-05-2024]
బీసీ నాయకులు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి దగ్గరకు వెళితే కనీసం కుర్చీ కూడా వేయరు, ఎవరికి వేయాలో ఆయన కనుసైగలతో సూచిస్తారని మనమంతా విన్నాం, బీసీల పట్ల ఆయన చూపే గౌరవం తీరు ఆ పార్టీ ఆలోచనా విధానాన్ని తెలియచేస్తుందని కూటమి గుంటూరు ఎంపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. -
పోలీసు.. నేత.. చెట్టపట్టాల్!
[ 03-05-2024]
అధికార వైకాపా నేతల కనుసన్నల్లోనే ఇప్పటికీ పోలీసు యంత్రాంగం జోగుతోంది. విధి నిర్వహణలో వారు చెప్పిందే పోలీసులకు వేదంగా ఉంటోంది. -
ఉద్యోగుల ఓట్లకు..గండికొట్టాలనేనా?
[ 03-05-2024]
ఉమ్మడి గుంటూరులో ఎన్నికల విధుల్లో పాల్గొనే ప్రభుత్వ ఉద్యోగులు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఇవ్వాల్సిన ఫారం-12కు ఎన్నికల అధికారులు మోకాలడ్డుతున్నారు. -
క్షీణించిన శ్రీలక్ష్మి ఆరోగ్యం
[ 03-05-2024]
వైకాపా నాయకుల దౌర్జన్యాలు, కబ్జాలతో నష్టపోయిన బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ నిరవధిక నిరాహార దీక్ష చేపట్టిన ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు కోపూరి శ్రీలక్ష్మి ఆరోగ్యం క్షీణించడంతో కుటుంబసభ్యులు గురువారం ఆమెను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే ధ్యేయం
[ 03-05-2024]
తెదేపా అధికారంలోకి రావడం ఖాయం. వచ్చే ఐదేళ్లలో నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాలను కల్పించి తీరతాం’.. అని గుంటూరు పశ్చిమ తెదేపా అభ్యర్థి గళ్లా మాధవి స్పష్టం చేశారు. -
అధికార పార్టీని చిత్తుగా ఓడించండి
[ 03-05-2024]
రాష్ట్రంలో అరాచకపాలన సాగిస్తున్న ప్రభుత్వం మారాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ‘ఇండియా’ కూటమి అభ్యర్థులు జంగాల అజయ్కుమార్, జొన్నా శివశంకరరావు తరఫున మంగళగిరిలో గురువారం సాయంత్రం జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని మాట్లాడారు. -
లోకేశ్ మంగళగిరి రూపురేఖలు మారుస్తారు
[ 03-05-2024]
గతంలో ఎమ్మెల్యేలుగా పనిచేసిన మంగళగిరి వైకాపా అభ్యర్థి తల్లి కాండ్రు కమల, మామ మురుగుడు హనుమంతరావు నియోజకవర్గానికి ఏం చేశారని ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ ప్రశ్నించారు. -
ఆంధ్రాప్యారిస్ పేరుకు తగ్గట్లు అభివృద్ధి చేస్తాం
[ 03-05-2024]
ఆంధ్రాప్యారిస్ను పేరుకు తగిన విధంగా అభివృద్ధి చేసి చూపిస్తామని, తమకు మద్దతు ఇవ్వాలని కూటమి గుంటూరు ఎంపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, తెనాలి ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు -
మహిళలే నిర్ణేతలు
[ 03-05-2024]
ఓటర్ల తుది జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేసింది. జనవరి 22 తర్వాత జరిగిన చేర్పులు, మార్పులు అనంతరం 22,029 మంది ఓటర్లు పెరిగారు. -
ఉద్యోగుల ఓట్లకు.. గండికొట్టాలనేనా?
[ 03-05-2024]
ఉమ్మడి గుంటూరులో ఎన్నికల విధుల్లో పాల్గొనే ప్రభుత్వ ఉద్యోగులు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఇవ్వాల్సిన ఫారం-12కు ఎన్నికల అధికారులు మోకాలడ్డుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఓటమి లేదా టై.. మేం ఊహించిన ఫలితమిదే: థ్రిల్లింగ్ విక్టరీపై నితీశ్ రెడ్డి
-
బెంగాల్ గవర్నర్పై లైంగిక వేధింపుల ఆరోపణలు.. స్పందించిన రాజ్భవన్
-
‘ఆడబిడ్డలు ఓడిపోయారు.. అతడే గెలిచాడు’: బ్రిజ్ భూషణ్ కుమారుడికి టికెట్పై సాక్షి పోస్ట్
-
శంషాబాద్లో ప్రయాణికులను వదిలేసి వెళ్లిన విమానాలు!
-
లాభాల్లో సూచీలు.. 75,000 ఎగువకు సెన్సెక్స్.. 22,750 పైన నిఫ్టీ
-
భారత్పై బైడెన్కు అమితమైన గౌరవం: శ్వేతసౌధం