బరిలో ఇద్దరు వారసులు
స్థానిక సంస్థల నుంచి లోక్సభ ఎన్నికల వరకు ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకుల వారసులు బరిలో నిలుస్తుంటారు.
వంశీకృష్ణ , రాజేందర్రావు
స్థానిక సంస్థల నుంచి లోక్సభ ఎన్నికల వరకు ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకుల వారసులు బరిలో నిలుస్తుంటారు. ఇందులో కొందరు ప్రజాదరణ పొందుతుండగా మరికొందరు వెనుకబడిపోతున్నారు. ఇటీవలి శాసనసభ ఎన్నికల్లో కోరుట్లలో సిట్టింగ్ ఎమ్మెల్యే విద్యాసాగర్రావు తనయుడు డాక్టర్ సంజయ్ పోటీ చేసి శాసనసభలో అడుగుపెట్టారు. తండ్రి అడుగుజాడల్లో రాజకీయాల్లోకి వచ్చి కొన్ని విడతలుగా శాసనసభ్యులుగా ఎన్నికవుతున్న కేటీఆర్, శ్రీధర్బాబులు మరోసారి విజయం సాధించారు. ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లోనూ ఉమ్మడి జిల్లా పరిధిలో ఇద్దరు వారసులు అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. పెద్దపల్లిలో మాజీ ఎంపీ, ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి తనయుడు వంశీ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. కరీంనగర్లో మాజీ ఎమ్మెల్యే వెలిచాల జగపతిరావు తనయుడు, మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ రాజేందర్రావు హస్తం పార్టీ నుంచే బరిలో దిగారు. ఈ ఇద్దరి భవిష్యత్తు జూన్ 4న వెల్లడవుతుంది.
న్యూస్టుడే, కరీంనగర్ పట్టణం
ఎల్లారెడ్డి చేతిలో పీవీ ఓటమి
1952లో దేశంలో మొదటిసారి లోక్సభ ఎన్నికలు నిర్వహించారు. ఆ ఎన్నికల్లో కరీంనగర్ నియోజకవర్గం నుంచి పీడీఎఫ్ అభ్యర్థిగా బద్దం ఎల్లారెడ్డి ఎన్నికయ్యారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పీవీ నరసింహారావుపై ఆయన విజయం సాధించారు. ఇల్లంతకుంట మండలం గాలిపెల్లిలో 1906లో జన్మించిన ఎల్లారెడ్డి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ఆయన కీలక భూమిక పోషించారు.
న్యూస్టుడే, మానకొండూర్
ప్రజాస్వామ్యానికి జీవనాడి
ఓటుహక్కు కలిగిన వారందరూ తప్పకుండా ఓటు వేయాలంటూ ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు ప్రతి ఎన్నికల సమయంలో విస్తృత ప్రచారం చేస్తున్నాయి. ‘ఓటు వేయకుంటే బతికి ఉన్నా చనిపోయినట్టే’ అని నిరక్షరాస్యులు సైతం భావిస్తారు. ఇక నెటిజన్లు మాత్రం ప్రాణుల మనుగడకు ఆక్సిజన్ ఎలాగో ప్రజాస్వామ్య మనుగడకు ఓటు కూడా అంతేనంటూ ప్రాధాన్యం చాటుతున్నారు. ఇందుకు సూచికగా ‘ఓటు = ్న2 ’తో పోస్టరును సామాజిక మాధ్యమాల్లో పంపుతున్నారు. ఇది చూసిన పలువురు ‘ఇది నిజమే కదా మరి’ అంటూ పంచుతున్నారు.
న్యూస్టుడే, ఫెర్టిలైజర్ సిటీ
బాలలకు భవితోపదేశం
ఎన్నికల నిర్వహణ తీరుపై విద్యార్థి దశలోనే పూర్తి స్థాయి అవగాహన ఉంటే.. ఓటరుగా మారాక సమర్థవంతమైన పాలకులను ఎన్నుకొనే అవకాశం ఉంటుంది. ఇదే ఉద్దేశంతో పదో తరగతి సాంఘికశాస్త్రంలో ప్రచురించిన ‘భారతదేశంలో ఎన్నికల ప్రక్రియ’ పాఠ్యాంశం భావిపౌరులకు ఎన్నో కొత్త విషయాలు నేర్పిస్తోంది. రాజ్యాంగ నిర్మాణం, ఎన్నికల నిర్వహణ తీరుపై పిల్లలకు అవగాహన కలిగించడంతో పాటు తమ తల్లిదండ్రులు తప్పనిసరిగా పోలింగ్లో పాల్గొనేలా వారి నుంచి హామీ పత్రాలు తీసుకోవడం బాధ్యత పెంచుతోంది. ఎన్నికల సంఘం బాధ్యతలు, ప్రధాన ఎన్నికల కమిషనర్ నియామకం, పార్టీలు, అభ్యర్థులు పాటించాల్సిన నిబంధనలను పాఠ్యాంశాల్లో సమగ్రంగా చర్చించారు. విద్యార్థులకే కాకుండా ఎన్నికలకు సంబంధించిన అంశాలు తెలుసుకోవాలనుకునే వారికి ఈ పాఠ్యాంశం ఉపయుక్తంగా ఉంటుంది.
న్యూస్టుడే, గోదావరిఖని పట్టణం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
డీజిల్ ట్యాంకర్ బోల్తా.. ఆరుగురికి తీవ్ర గాయాలు
[ 15-05-2024]
తాడికల్ వద్ద జాతీయ రహదారిపై మినీ డీజిల్ ట్యాంకర్ బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. -
అక్రమ నిర్మాణాలపై బల్దియా నజర్
[ 15-05-2024]
కరీంనగర్ నగర పాలక పరిధిలో నూతన భవనాలు, బహుళ అంతస్తుల నిర్మాణాలు జోరుగా నిర్మిస్తున్నారు. అనుమతులకు విరుద్ధంగా భవనాలు చకచకా నిర్మిస్తుండగా కనీసం పర్యవేక్షణ కూడా చేయడం లేదు. అక్రమ లేఅవుట్లతో అనర్థమని తెలిసినా అదేదీ పరిగణనలోకి తీసుకోకుండానే ఇళ్లు నిర్మించుకుంటున్నారు. -
స్ట్రాంగ్ రూంల వద్ద నిరంతర నిఘా
[ 15-05-2024]
ఈవీఎం స్ట్రాంగ్ రూంల వద్ద భద్రత కోసం నిరంతరం గట్టి నిఘా ఏర్పాటు చేశామని కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి పేర్కొన్నారు. పోలింగ్ ప్రక్రియ పూర్తి కాగానే కరీంనగర్, చొప్పదండి, మానకొండూర్, హుజూరాబాద్, హుస్నాబాద్, సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంలు కరీంనగర్లోని ఎస్సారార్ కళాశాలకు సోమవారం రాత్రి వరకు చేరుకున్నాయి. -
గొర్రెల పంపిణీ లేనట్లేనా!
[ 15-05-2024]
కొత్త రాష్ట్ర ప్రభుత్వం గొర్రెల పంపిణీ పథకం నిలిపివేయనున్నట్లు తాజాగా తీసుకున్న నిర్ణయాల ద్వారా తెలుస్తోంది. జిల్లాలో రెండో విడత గొర్రెల పంపిణీకి ఇప్పటికే డీడీలు చెల్లించిన వారందరికీ తిరిగి డబ్బులు వాపసు ఇవ్వడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. -
ఎవరి లెక్కలు వారివే!
[ 15-05-2024]
‘ఫలానా మండలంలో మనకే మంచి పట్టు ఉంది.. అక్కడ బాగానే ఓట్లు పడ్డాయి. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఉన్న విధంగానే కొందరు ఓటర్లు మనవైపే ఉన్నారు.. మరో మండలంలో మనకు ఆదరణ కాస్త తక్కువైంది.’.. అంటూ ప్రధాన పార్టీల అభ్యర్థులు, నాయకులు ఓట్ల లెక్కలేసుకుంటున్నారు. -
8,34,164 మంది ఓటుకు దూరం
[ 15-05-2024]
ఎన్నికల్లో ప్రతి ఓటు చాలా కీలకం. దేశ చరిత్రలో ఒక్క ఓటు తేడాతో ఓడిపోయిన అభ్యర్థులూ ఉన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధం లాంటిదని కేంద్ర ఎన్నికల సంఘం, జిల్లా యంత్రాంగం ఎంతగా ప్రచారం చేసినప్పటికీ దాని వినియోగంలో మాత్రం చాలా మంది దూరంగా ఉంటున్నారు. -
ధన్వాడలో ఉప ముఖ్యమంత్రి పూజలు
[ 15-05-2024]
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం ధన్వాడలోని శ్రీ దత్తాత్రేయస్వామి ఆలయ వార్షికోత్సవ కార్యక్రమం మంగళవారం వైభవంగా జరిగింది. -
తీరిక దొరికింది ఇలా..
[ 15-05-2024]
ఎన్నికల షెడ్యూలు వెలువడింది మొదలు పోలింగ్ వరకు అభ్యర్థులు క్షణం తీరిక లేకుండా గడిపారు. -
ఓటెత్తిన నారీమణులు
[ 15-05-2024]
ఈసారి లోక్సభ ఎన్నికల్లో మహిళలు ఓటు హక్కు వినియోగంలో హవా చాటారు.. ఉమ్మడి జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో మహిళలు ఎక్కువ ఓటుహక్కు కలిగి ఉండగా.. వినియోగంలోనూ అదే స్థాయిలో సత్తా చాటారు. -
చికిత్స పొందుతూ జడ్పీటీసీ మాజీ సభ్యుడి మృతి
[ 15-05-2024]
జూలపల్లి జడ్పీటీసీ మాజీ సభ్యుడు పాటకుల నర్సయ్య(48) చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందారు. పోలీసుల కథనం ప్రకారం ఈ నెల 10న నర్సయ్య ఇంట్లో తీవ్ర గాయాలతో అచేతనావస్థలో పడి ఉండటంతో గమనించిన బంధువులు కరీంనగర్లోని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. -
‘కక్ష సాధింపు చర్యలకు పాల్పడిన కాంగ్రెస్’
[ 15-05-2024]
లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని అడ్డంపెట్టుకుని కక్షసాధింపు చర్యలకు పాల్పడిందని పెద్దపల్లి లోక్సభ భారాస అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. -
నగదు ప్రవాహానికి అడ్డుకట్ట
[ 15-05-2024]
లోక్సభ ఎన్నికల్లో ప్రలోభాల నియంత్రణకు ఎన్నికల సంఘం నియమించిన నిఘా బృందాల తనిఖీల్లో రూ.9.82 కోట్ల సొత్తు పట్టుబడింది. అధికార యంత్రాంగం చాకచాక్యంగా వ్యవహరించడంతో డబ్బు ప్రవాహనానికి అడ్డుకట్ట వేసినట్లయింది. -
వార్షిక లాభాల ప్రకటన ఎప్పుడో?
[ 15-05-2024]
సింగరేణి సంస్థ గడచిన ఏడాది సాధించిన లాభాల ప్రకటనపై ఆసక్తి నెలకొంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.2,222 కోట్ల లాభాలను సాధించిన సంస్థ 2023-24 ఆర్థిక సంవత్సరంలో భారీగా బొగ్గు ఉత్పత్తి చేసింది. -
సర్వే చేశారు... పనులు మరిచారు
[ 15-05-2024]
ఆధ్యాత్మిక పట్టణమైన వేములవాడలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీరాజరాజేశ్వరస్వామి దర్శనానికి రోజూ వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు వస్తుంటారు. -
లక్ష మెజారిటీ ఖాయం : జీవన్రెడ్డి
[ 15-05-2024]
నిజామాబాద్ లోక్సభ స్థానంలో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి టి.జీవన్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మెట్పల్లి మండలం వేంపేటలో మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. -
అయిదేళ్లుగా ఎదురుచూపులే!
[ 15-05-2024]
రైతులకు పెట్టుబడి సాయాన్ని అందించే కేంద్రప్రభుత్వ పీఎంకిసాన్ సమ్మాన్ నిధి పథకంలో చేరేందుకు జిల్లాలోని వేలాదిమంది రైతులు అయిదేళ్లుగా ఎదురుచూస్తున్నారు. -
మృత్యు మలుపు
[ 15-05-2024]
మేడిపల్లి జాతీయ రహదారిపై ఏటా ప్రమాదాల రూపంలో మృత్యుఘంటికలు మోగుతున్నాయి. సరాసరి నెలరోజులకు ఒక ప్రాణం ఏదో ప్రమాదంలో గాలిలో కలసిపోతోంది.
తాజా వార్తలు (Latest News)
-
గోల్ఫ్ ఆడడం, నచ్చింది తినడం.. మిస్టర్ కూల్ ‘ఫేవరెట్ ప్లేస్’ అదేనట!
-
డీజీపీ, ఇంటెలిజెన్స్ ఏడీజీలతో సీఎస్ జవహర్రెడ్డి అత్యవసర భేటీ
-
కార్చిచ్చుల వేళ.. అగ్నిమాపక సిబ్బందికి ఎన్నికల విధులా..?
-
ముంబయిలో బిల్బోర్డ్ ట్రాజెడీ.. ఎనిమిదేళ్ల క్రితమే పుస్తకంలో ప్రస్తావించిన రచయిత
-
ఐపీఎల్ ప్లేఆఫ్స్.. రెండు బెర్తుల కోసం ఐదు టీమ్లు.. ఏ జట్టు పర్సంటేజీ ఎంతంటే?
-
స్పామ్ కాల్స్కు ఇక గుడ్బై.. త్వరలో కొత్త మార్గదర్శకాలు