ఉద్యమనేత శ్రీరామరెడ్డి కన్నుమూత
చిక్కబళ్లాపుర, న్యూస్టుడే: కమ్యూనిస్టు నేత, ప్రజా సంఘర్ష సమితి చిక్కబళ్లాపుర జిల్లాశాఖ సంచాలకుడు, మాజీ శాసనసభ్యుడు జి.వి.శ్రీరామరెడ్డి (73) కన్నుమూశారు. శుక్రవారం ఉదయం ఆయనకు ఛాతిలో నొప్పి రావడంతో తమ నివాసం నుంచి వెంటనే బాగేపల్లి ఆసుపత్రికి తరలించారు. చికిత్స
జి.వి.శ్రీరామరెడ్డి (పాతచిత్రం)
బెంగళూరు(ఎలక్ట్రానిక్ సిటీ), చిక్కబళ్లాపుర, న్యూస్టుడే: కమ్యూనిస్టు నేత, ప్రజా సంఘర్ష సమితి చిక్కబళ్లాపుర జిల్లాశాఖ సంచాలకుడు, మాజీ శాసనసభ్యుడు జి.వి.శ్రీరామరెడ్డి (73) కన్నుమూశారు. శుక్రవారం ఉదయం ఆయనకు ఛాతిలో నొప్పి రావడంతో తమ నివాసం నుంచి వెంటనే బాగేపల్లి ఆసుపత్రికి తరలించారు. చికిత్స ఫలించక 7.30 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. చిక్కబళ్లాపుర జిల్లా బాగేపల్లి నియోజకవర్గం నుంచి ఆయన రెండుసార్లు శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు. ఇటీవలి కాలంలో రాజకీయాలకు దాదాపు దూరమయ్యారు. ఆయన అవివాహితుడు. తమ జీవిత కాలాన్ని పార్టీ కోసమే వినియోగించారు. తమ పదవీ కాలంలో నిత్యం రైతుల సమస్యల పరిష్కారానికే కృషి చేశారు. అనేక సామాజిక పోరాటాల్లో చురుగ్గా పాల్గొనేవారు. సీపీఎంకు బాగేపల్లి నియోజకవర్గంలో మంచి పట్టుండేది. ఇందుకు శ్రీరామరెడ్డి వ్యక్తిత్వమే కారణమని భావిస్తారు. ఆయన ఏకంగా ఎనిమిదిసార్లు ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేసి రెండుసార్లు విధానసభకు ఎన్నికయ్యారు. బాగేపల్లి అనగానే జి.వి.శ్రీరామరెడ్డి అనే పేరు ప్రముఖంగా వచ్చేదంటే ఆయన ఏస్థాయిలో ప్రాచుర్యాన్ని సొంతం చేసుకున్నారో అర్థం చేసుకోవచ్ఛు చివరి రోజుల్లో పార్టీకి దూరంగా కొనసాగి ప్రజా సంఘర్ష సమితిని ఏర్పాటు చేసుకుని తమ సామాజిక పోరాటాన్ని కొనసాగించారు. అనేక ఆరోపణలు రావడంతో ఆయన పార్టీకి దూరం కావడానికి కారణంగా చెబుతారు. నియోజకవర్గానికి చెందిన అపార సంఖ్యలో అభిమానులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
ప్రముఖుల సంతాపం
బెంగళూరు(యశ్వంతపుర): గొప్ప సామాజిక కార్యకర్తను రాష్ట్రం కోల్పోయిందని ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై వ్యాఖ్యానించారు. పేదల సమస్యలపై నిరంతర పోరాటాలతో శ్రీరామరెడ్డి జీవితాన్ని త్యాగం చేశారని మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప ట్వీట్ చేశారు. గొప్ప పోరాట యోధుడిని కోల్పోయామని ప్రతిపక్ష నేత సిద్ధరామయ్య పేర్కొన్నారు. ఆయన తనకు మంచి స్నేహితుడు. మూఢనమ్మకాలు, పేదరికం, అసమానతలు, మతతత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు చేశారని గుర్తు చేశారు. విద్యార్థి దశ నుంచి పోరాటాలు చేసిన ఆయన విధానసభలో పేదల ధ్వనిగా నిలిచారని కేపీసీసీ అధ్యక్షుడు డీకేశివకుమార్ వ్యాఖ్యానించారు. మాజీ ఉపముఖ్యమంత్రి డాక్టర్ పరమేశ్వర్, మాజీ మంత్రులు ఎం.ఆర్.సీతారాం, ఎంబీపాటిల్, హెచ్.కె.పాటిల్, కృష్ణభైరేగౌడ తదితరులు సంతాపం వ్యక్తం చేశారు.
విషణ్ణవదనంతో భౌతిక కాయాన్ని తరలిస్తున్న అభిమానులు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లింగాయత్ల గ్యారంటీ.. విజయానికి దివిటీ
[ 03-05-2024]
కన్నడనాట ఈనెల 7న జరగనున్న 14 నియోజకవర్గాల ఎన్నికల్లో అత్యధిక స్థానాలు లింగాయత్ల ప్రాబల్యం ఉన్నవే! ఏప్రిల్ 26న ఎన్నికలు నిర్వహించిన 14 క్షేత్రాల్లో ఒక్కలిగల బలం ఎక్కువగా ఉంటే.. మలివిడత ఆ ఘనత లింగాయత్లదే. -
పెద్ద కుటుంబానికి తలవంపులు
[ 03-05-2024]
లైంగిక దౌర్జన్యం ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి హెచ్డీ రేవణ్ణ సిట్ అధికారుల ముందు గురువారం విచారణకు హాజరు కాలేదు. హాసన నుంచి భార్య భవానీతో కలిసి బెంగళూరుకు చేరుకున్న ఆయన పద్మనాభనగరలోని తండ్రి, మాజీ ప్రధాని దేవేగౌడ నివాసానికి వెళ్లారు. -
రాజకీయ వింతలు.. ప్రచారం కొత్తపుంతలు
[ 03-05-2024]
రాష్ట్రంలో రెండోదశ ఎన్నికలకు సమయం ముంచుకొస్తున్న కొద్దీ నేతల నోట ప్రజా సంక్షేమం, ప్రగతి మాట కంటే వివాదాస్పద అంశాలే దొర్లుతున్నాయి. ఎన్నికల ముందు ప్రణాళికల్లో రచించుకున్న దీర్ఘకాలిక లక్ష్యాల కంటే రోజువారీ సంఘటన అంశాలతో నేతలు ప్రచారాన్ని నెగ్గుకొస్తున్నారు. -
ప్రేమించలేదని.. వివాహిత ఇంటికి నిప్పు
[ 03-05-2024]
తనను పెళ్లి చేసుకోవాలంటూ ఒక వివాహితను వేధిస్తూ.. ఆమె అందుకు నిరాకరించడంతో ఇంటికి నిప్పు పెట్టిన అర్బాజ్ అనే పిచ్చి ప్రేమికుడ్ని సంపిగెహళ్లి ఠాణా పోలీసులు అరెస్టు చేశారు. -
సిద్ధు సర్కారు అన్ని రంగాల్లో విఫలం
[ 03-05-2024]
రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని భాజపా అగ్రనేత, మాజీ ముఖ్యమంత్రి బి.ఎస్.యడియూరప్ప ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బళ్లారి లోక్సభ భాజపా అభ్యర్థి బి.శ్రీరాములు తరఫున యడియూరప్ప కురుగోడు తాలూకాలో ప్రచారం నిర్వహించారు. -
కల్యాణ్ జువెలరీ దుకాణంలో అగ్నిప్రమాదం
[ 03-05-2024]
బళ్లారి నగరం తేరువీధిలో మార్టిన్ మార్గంలో ఉన్న కల్యాణ్ జువెలరి దుకాణంలో గురువారం సాయంత్రం జరిగిన అగ్నిప్రమాదంలో ఐదుగురు కార్మికులు గాయపడ్డారు. -
హరపనహళ్లిని ప్రగతి దారిలో నడిపించేదెవరు?
[ 03-05-2024]
దావణగెరె లోక్సభ నియోజకవర్గం, ప్రస్తుతం విజయనగర జిల్లా పరిధిలోకి వచ్చే, వెనుకబడిన తాలూకా హరపన హళ్లి అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాధాన్యం ఉంది. ఇప్పటి వరకు హరపన హళ్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలుగా గెలిచివారిలో సగంకన్నా ఎక్కువ మంది స్థానికేతరులే కావడం ప్రత్యేకం. -
ఓటేస్తే..ఉచితంగా నేత్రాలంకరణ
[ 03-05-2024]
తమకే ఓటు వేయాలని ఓటర్లకు తాయిలాలు ఇచ్చేవారే ఎక్కువ. ఇక్కడో యువతి ఓటు శాతం పెరగాలని ఓటేసి వచ్చిన మహిళలకు ఉచితంగా ఐబ్రో అలంకరణ భాగ్యాన్ని కల్పిస్తానని ప్రకటించారు.
తాజా వార్తలు (Latest News)
-
బెంగాల్ గవర్నర్పై లైంగిక వేధింపుల ఆరోపణలు.. స్పందించిన రాజ్భవన్
-
‘ఆడబిడ్డలు ఓడిపోయారు.. అతడే గెలిచాడు’: బ్రిజ్ భూషణ్ కుమారుడికి టికెట్పై సాక్షి పోస్ట్
-
శంషాబాద్లో ప్రయాణికులను వదిలేసి వెళ్లిన విమానాలు!
-
లాభాల్లో సూచీలు.. 75,000 ఎగువకు సెన్సెక్స్.. 22,750 పైన నిఫ్టీ
-
భారత్పై బైడెన్కు అమితమైన గౌరవం: శ్వేతసౌధం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM