బావాజీ తిరిగిన నేల.. పులకించనున్న వేళ
అడవులలో నివసిస్తున్న బంజారాలకు జ్ఞానబోధన చేసి ఆపదలో ఉన్న వారిని ఆదుకునే గురు లోకమసంద్ ప్రభు(బావాజీ)ని గిరిజనులు దైవంగా ఆరాధిస్తారు. ఉత్తర, దక్షిణ భారతదేశంలో గిరిజనులు బావాజీని అనుసరిస్తారు.
22 నుంచి బంజారాల జాతర
న్యూస్టుడే-మద్దూరు
అడవులలో నివసిస్తున్న బంజారాలకు జ్ఞానబోధన చేసి ఆపదలో ఉన్న వారిని ఆదుకునే గురు లోకమసంద్ ప్రభు(బావాజీ)ని గిరిజనులు దైవంగా ఆరాధిస్తారు. ఉత్తర, దక్షిణ భారతదేశంలో గిరిజనులు బావాజీని అనుసరిస్తారు. నారాయణపేట జిల్లా కొత్తపల్లి మండలం తిమ్మారెడ్డిపల్లిలో ప్రభు జన్మదినాన్ని(చైత్ర శుద్ధ పౌర్ణమి) పురస్కరించుకుని వేడుకలు చేస్తారు. నాలుగు రోజులపాటు జరిగే ఈ ఉత్సవాలలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహరాష్ట్ర, కర్ణాటక, ఒడిశా, తమిళనాడు రాష్ట్రాల నుంచి గిరిజన భక్తులు అధిక సంఖ్యలో హాజరై ప్రభుకు నైవేద్యాన్ని సమర్పిస్తారు.
ఇక్కడే ఎందుకంటే....
16వ శతాబ్దంలో లక్ష్మీబాయి, రాంజీమహరాజ్ దంపతులకు ఛైత్రశుద్ధ పౌర్ణమి రోజున గురులోకమసంద్ ప్రభువు జన్మించారు. పదో సంవత్సరం నుంచి దేవాలయాలు తిరుగుతూ ఆత్మజ్ఞానం పొందారు. అమృత్సర్లోని స్వర్ణ దేవాలయం దర్శించుకుని, కఠోర నియమాలతో 12 ఏళ్లు గ్రంథ పఠనం చేశారు. మహారాష్ట్రలోని నాందేడ్ అడవుల్లో తిరిగారు. దేశసంచారం చేస్తూ తిమ్మారెడ్డిపల్లి చేరుకున్నారు. ఇక్కడ 12 సంవత్సరాలు తపస్సు చేశారు. ఇక్కడే కాళికాదేవి ఆలయం నిర్మించుకుని 17వ శతాబ్దం మధ్యలో జీవసమాధి అయ్యారు. అప్పటి నుంచి బంజారాలు ఆయన జన్మదినాన్ని ఇక్కడ ఘనంగా జరుపుతారు.
ప్రత్యేక ఏర్పాట్లు..
ఉత్సవాల సందర్భంగా మహబూబ్నగర్, నారాయణపేట, తాండూరు డిపోల నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది..ఈ బస్సులు కోస్గి, నారాయణపేట, మహబూబ్నగర్, మద్దూరు బస్టాండ్ల నుంచి తిమ్మారెడ్డిపల్లికి చేరుకుంటాయి. నారాయణపేట జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పర్యవేక్షణలో ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తుల సౌకర్యార్థం తాగునీటి వసతి, నిరంతర విద్యుత్తు, వైద్యసిబ్బంది నియామకం, పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.
ఉత్సవాలు ఇలా
ఏప్రిల్ 22 నుంచి నాలుగు రోజులు ఉత్సవాలు జరుగుతాయి. మొదటిరోజు జెండా అవిష్కరణ, ధ్వజారోహణం, రాత్రికి ప్రభోత్సవం, భజనలు, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. రెండోరోజు ఆవరణలోని ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు, గిరిజన భక్తుల భజన కీర్తనలు, మూడోరోజు తెల్లవారుజామున రథోత్సవం, పల్లకీ సేవ, ప్రత్యేక పూజలు తీర్థప్రసాదాల వితరణ, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. నాలుగోరోజు కాళికాదేవికి ప్రత్యేక పూజలు, పల్లకిసేవ, హోమం నిర్వహిస్తారు. అమ్మవారికి మాంసాహారాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు రంగురంగుల జెండాలను చేతబూని స్వామి సమాధి ముందు ప్రతిష్ఠాపన చేస్తారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కందనూలు.. మొగ్గు ఎటు వైపో..
[ 02-05-2024]
నాగర్కర్నూల్ లోక్సభ నియోజకవర్గంలో ఓటర్లు విలక్షణ తీర్పు ఇస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలతో పోల్చుకుంటే లోక్సభ ఎన్నికల్లో ఓటర్లు ఇచ్చే తీర్పులో మార్పు కనిపిస్తోంది. -
ఉన్నత విద్యావంతులు కొందరే
[ 02-05-2024]
మహబూబ్నగర్ లోక్సభ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న ప్రధాన పార్టీల అభ్యర్థులు ఇంటర్లోపే విద్యార్హత ఉండటం విశేషం. -
అభ్యర్థికి టాటా.. పెరుగుతోంది నోటా
[ 02-05-2024]
ఎన్నికల్లో ప్రతి ఓటూ కీలకమే. అభ్యర్థుల గెలుపోటములు నిర్దేశించడంతో పాటు ప్రభుత్వాల ఏర్పాటుకు దోహదపడుతుంది. లోక్సభ ఎన్నికలైనా సరే.. గట్టిపోటీ ఉన్న చోట రెండు, మూడు వేల ఓట్లే కీలకంగా మారే పరిస్థితి ఉంటుంది. -
సూర్యప్రతాపం.. తగ్గిన ప్రచారం
[ 02-05-2024]
ఓ వైపు సూర్యప్రతాపం రోజురోజుకూ అధికం అవుతోంది. మరోవైపు ప్రచార గడువు దగ్గరకు వస్తోంది... ఈ వేడి వాతావరణంలో రాజకీయ పార్టీల ప్రచార సరళి మారిపోయింది. గతంలో ఉన్నంత జోష్ కనిపించడం లేదు. మంది ఉన్నచోట మాట్లాడి వెళ్లిపోతున్నారు. ఇంటింటి ప్రచారం పలచబడింది. -
రైల్వే లైన్ సాధనకు కృషి
[ 02-05-2024]
లోక్సభ ఎన్నికల్లో ఆశీర్వదిస్తే వనపర్తి ప్రజల చిరకాల వాంఛ అయిన రైల్వే లైన్ సాధనకు కృషి చేస్తానని నాగర్కర్నూల్ భాజపా ఎంపీ అభ్యర్థి భరత్ప్రసాద్ పేర్కొన్నారు. -
కమనీయం శ్రీనివాసుడి కల్యాణం
[ 02-05-2024]
అఖిలాండ కోటి బ్రహ్మండ నాయకుడు.. ఆపద మొక్కులవాడైన శ్రీవేంకటేశ్వరస్వామి నామస్మరణతో ఆ ప్రాంతమంతా మార్మోగింది. -
న్యాయవాదులు ఆలోచించి ఓటేయాలి : డీకే అరుణ
[ 02-05-2024]
మేధావి వర్గమైన న్యాయవాదులు లోక్సభ ఎన్నికల్లో ఆలోచించి ఓటు వేయాలని భాజపా లోక్సభ అభ్యర్థి డీకే అరుణ కోరారు. -
సైబర్ నేరాలపై అవగాహన అవసరం
[ 02-05-2024]
సైబర్ నేరాల పట్లపై అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని జిల్లా సైబర్ సెక్యూరిటీ విభాగం డీఎస్పీ సత్తయ్య పేర్కొన్నారు. -
నాలుగు ప్రాంతాల్లో రెడ్జోన్
[ 02-05-2024]
జోగులాంబ గద్వాల జిల్లాలో గతంలో ఎన్నడూ లేనంతగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. జిల్లాలోని నాలుగు ప్రాంతాలు రెడ్జోన్ పరిధిలోకి వెళ్లాయి. -
పొరుగుసేవల దరఖాస్తులపై అనుమానాలెన్నో !
[ 02-05-2024]
గద్వాల మెడికల్ కళాశాలలో ఔట్సోర్సింగ్ పద్ధతిలో వివిధ విభాగాలలో పనిచేయడానికి సిబ్బంది నియామకానికి అర్హత గల వ్యక్తుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఇందులో స్థానిక అభ్యర్థులకు మాత్రమే అవకాశం కల్పించారు. -
సామాజిక మాధ్యమాలపై నిఘా
[ 02-05-2024]
లోక్సభ ఎన్నికల ప్రక్రియలో భాగంగా అభ్యర్థుల నామపత్రాల దాఖలు గడువు పూర్తి కావడంతో ఎన్నికల బరిలో నిలిచిన ప్రధాన పార్టీల అభ్యర్థులు గెలుపే లక్ష్యంగా ప్రచారాన్ని ముమ్మరం చేశారు. -
తెలుగులోనూ తప్పారు!
[ 02-05-2024]
పదోతరగతి వార్షిక ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో నాగర్కర్నూల్ జిల్లా 21వ స్థానంలో నిలువడం నిరాశ కలిగించింది. విద్యార్థులు వార్షిక పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించడానికి జిల్లా విద్యాశాఖాధికారులు చొరవ చూపలేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
భాజపాతోనే ఎస్సీ వర్గీకరణ సాధ్యం
[ 02-05-2024]
కేంద్రంలో భాజపా మూడోసారి అధికారం చేపడితేనే ఎస్సీ వర్గీకరణ సాధ్యమవుతుందని కేంద్ర ప్రసార, సమాచారశాఖ సహాయమంత్రి మురుగన్ అన్నారు. -
మత్తు పదార్థాలకు దూరంగా ఉండండి : ఎస్పీ
[ 02-05-2024]
యువత గంజాయికి బానిసలుగా మారి తమ భవిష్యత్తు నాశనం చేసుకోవద్దని, మత్తుపదార్థాలకు దూరంగా ఉండాలని ఎస్పీ యోగేశ్గౌతం అన్నారు. -
సార్వత్రిక పరీక్షలకు 804 మంది హాజరు
[ 02-05-2024]
సార్వత్రిక పదో తరగతి, ఇంటర్ పరీక్షలకు 804 మంది విద్యార్థులు హాజరైనట్లు టాస్ కో ఆర్డినేటర్ శ్రీనివాస్ తెలిపారు. -
పెండింగ్ కేసుల దర్యాప్తు వేగవంతం చేయండి
[ 02-05-2024]
పెండింగ్లో ఉన్న కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలని ఎస్పీ రక్షితకృష్ణమూర్తి ఆదేశించారు. వనపర్తి సర్కిల్ పరిధిలో వనపర్తి పట్టణం, గ్రామీణం, రేవల్లి, వీపనగండ్ల పోలీస్స్టేషన్లకు సంబంధించి పెండింగ్ కేసులపై బుధవారం ఎస్సైలతో ఎస్పీ సమీక్ష సమావేశం నిర్వహించారు.