మోదీతోనే దేశం బలోపేతం
నరేంద్ర మోదీ మళ్లీ ప్రధాని అయితేనే దేశం ఆర్థికంగా బలోపేతమవుతుందని, భద్రతపరంగా సురక్షితంగా ఉంటుందని భాజపా మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ పేర్కొన్నారు.
భాజపా మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ
ప్రసంగిస్తున్న డీకే అరుణ, వేదికపై సీనియర్ నేత నాగురావు, మహిళా నేతలు
మహబూబ్నగర్ గ్రామీణం, న్యూస్టుడే : నరేంద్ర మోదీ మళ్లీ ప్రధాని అయితేనే దేశం ఆర్థికంగా బలోపేతమవుతుందని, భద్రతపరంగా సురక్షితంగా ఉంటుందని భాజపా మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ పేర్కొన్నారు. భాజపా మహిళా మోర్చా ఆధ్వర్యంలో సోమవారం మహబూబ్నగర్లో నిర్వహించిన నారీ శక్తివందన్ కార్యక్రమంలో డీకే అరుణ పాల్గొని మాట్లాడారు. భారత్ వైపు శత్రుదేశాలు కన్నెత్తి చూడొద్దంటే, ప్రపంచంలో ఆర్థిక శక్తిగా ఎదగాలంటే, దేశంలో పేదరికం పోవాలంటే కేంద్రంలో భాజపా ప్రభుత్వమే ఏర్పాటు కావాలని పేర్కొన్నారు. గడిచిన పదేళ్లలో కేంద్రంలోని భాజపా ప్రభుత్వం మహిళల కోసం అనేక పథకాలు అమలు చేసిందన్నారు. మహిళా మోర్చాలోని ప్రతి నాయకురాలు ఇంటింటికి వెళ్లి కేంద్ర ప్రభుత్వ పథకాలు, చేసిన మంచి పనులు మహిళలకు వివరించాలని కోరారు. లోక్సభ ఎన్నికల్లో ప్రజలను ముఖ్యంగా మహిళలను ఓటు అడిగే నైతిక హక్కును కాంగ్రెస్ పార్టీ కోల్పోయిందని డీకే అరుణ పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు అమలుకు సాధ్యం కాని హామీలు ఇచ్చి మహిళలను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మోసం చేశారని ఆరోపించారు. స్వయం సహాయ సంఘాల్లో సభ్యులుగా ఉన్న ప్రతి మహిళలకు నెలకు రూ.2,500 జీవన భృతి ఇస్తామని, రూ.500లకే వంటగ్యాస్ సరఫరా చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 100 రోజులు దాటినా అమలు చేయలేదన్నారు. ఉచిత బస్సు ప్రయాణం మాత్రమే అమలు చేసి అంతా చేశామని చెబుతున్నారని విమర్శించారు. లోక్సభ ఎన్నికల్లో ఒక ఆడబిడ్డ పోటీ చేస్తుంటే తట్టుకోలేక సీఎం రేవంత్రెడ్డి, కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నోటికొచ్చినట్లు మాట్లాడడం ఎంతవరకు సమంజసమో మహిళలు ఆలోచించాలన్నారు. గతంలో సీఎంగా ఉన్న కేసీఆర్ కూడా అహంకారంతో నోటికొచ్చినట్లు మాట్లాడి ఓటమిపాలయ్యారని, రేవంత్రెడ్డికి రాబోవు రోజుల్లో అదే గతి పడుతుందని డీకే అరుణ హెచ్చరించారు. సమావేశంలో భాజపా సీనియర్ నాయకులు నాగూరావు నామాజీ, విజయలక్ష్మి, నిరంజనమ్మ, మహబూబ్నగర్, నారాయణపేట జిల్లాల మహిళా మోర్చా అధ్యక్షురాళ్లు సాహితీరెడ్డి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పాలమూరుకు అగ్రనేతలు
[ 04-05-2024]
పాలమూరులో ఎన్నికల ప్రచారానికి ప్రధాన పార్టీలకు చెందిన అగ్రనేతలు రానున్నారు. పోలింగ్ గడువు దగ్గర పడుతుండటంతో ఆయా పార్టీలు ప్రచారాన్ని ఉద్ధృతం చేశాయి. -
పీఎంశ్రీకి మరో 46 పాఠశాలలు
[ 04-05-2024]
సర్కారు బడుల బలోపేతమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పీఎంశ్రీ (ప్రధాన మంత్రి స్కూల్స్ ఫర్ రైసింగ్ ఇండియా) యోజనను గత విద్యా సంవత్సరం నుంచి అమలు చేస్తోంది. -
పులులకు ఆవాసం.. గ్రామస్థులకు పునరావాసం
[ 04-05-2024]
ఆక్రమణలు, అభివృద్ధి పేర నానాటికి కుంచించుకు పోతున్న అటవీ ప్రాంతంతో అడవికి రారాజైన పెద్దపులుల ఉనికికి భంగం కలుగుతోంది. నల్లమలలో -
ఉత్తర భారతంలో భాజపాకు సగం సీట్లే
[ 04-05-2024]
ఉత్తర భారతదేశంలో జరిగిన ఎన్నికల్లో భాజపాకు సగం సీట్లు కూడా రావడం లేదని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. -
పురపాలిక.. మేల్కోవాలిక!
[ 04-05-2024]
మహబూబ్నగర్ పురపాలక సంఘ భవనం పూర్తిగా దెబ్బతింది. భవనం పిల్లర్లు, సజ్జలు, గోడలు, మెట్లు పెచ్చులు ఊడుతున్నాయి. -
విలక్షణ పోరు.. ఇక్కడి తీరు
[ 04-05-2024]
నాగర్కర్నూలు లోక్సభ నియోజకవర్గం 1967లో ఏర్పాటైంది. ఇప్పటి వరకు 14సార్లు ఎన్నికలు జరిగాయి. ప్రస్తుతం 15వ సారి ఎన్నిక జరుగుతోంది. -
మళ్లీ మోసపోవద్దు
[ 04-05-2024]
గత శాసనసభ ఎన్నికల్లో ఆరు గ్యారంటీలు నమ్మి మోసిపోయినట్లుగా ఇపుడు మళ్లీ బుట్టలోపడొద్దని మహబూబ్నగర్ లోక్సభ స్థానం భాజపా అభ్యర్థి డీకే అరుణ అన్నారు. -
భాజపాతోనే భారత్ వికాసం : భరత్ ప్రసాద్
[ 04-05-2024]
దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే మోదీ విజన్తోనే సాధ్యమని నాగర్కర్నూల్ పార్లమెంట్ స్థానం భాజపా అభ్యర్థి భరత్ ప్రసాద్ పేర్కొన్నారు. -
ప్రవీణ్కుమార్ ప్రచారంలో ఉద్రిక్తత
[ 04-05-2024]
నాగర్కర్నూల్ జిల్లా బల్మూర్ మండల కేంద్రంలో చేపట్టిన భారాస ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ లోక్సభ ఎన్నికల ప్రచారం ఉద్రిక్తతకు దారి తీసింది. -
మోదీ హయాంలో దేశం 30 ఏళ్ల వెనుకబాటు
[ 04-05-2024]
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పదేళ్ల పాలనలో దేశాన్ని ముప్పై ఏళ్లు వెనక్కి తీసుకెళ్లారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. -
ప్రజాపాలన కాంగ్రెస్తోనే సాధ్యం
[ 04-05-2024]
రాష్ట్రంలో ప్రజాపాలనకు శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వెంటే జిల్లా ప్రజలు ఉన్నారని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్రెడ్డి తెలిపారు. -
మంచినీటికి ముప్పుతిప్పలు
[ 04-05-2024]
జిల్లా కేంద్రమైన వనపర్తిలో తాగునీటి సమస్య రోజురోజుకు పెరిగిపోతోంది. పురపాలక సంఘంలోని పలు కాలనీలకు రామన్పాడు తాగునీటిని పూర్తిస్థాయిలో సరఫరా చేయడం లేదు. -
ఓటుకు తప్పని దూరాభారం
[ 04-05-2024]
ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఎన్నికల సంఘం విస్తృత ప్రచారం చేస్తున్నా, కొన్ని తండాలవాసులు ఓటేయడానికి దూరం వెళ్లాల్సివస్తోంది. -
రేపటి నీట్కు 11 కేంద్రాలు
[ 04-05-2024]
వైద్యవిద్య కోర్సులో ప్రవేశాల కోసం ఈ నెల 5న నిర్వహించే నీట్కు ఉమ్మడి పాలమూరులో 11 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. -
ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఊరట
[ 04-05-2024]
ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించడానికి జిల్లా అధికారులు చర్యలు చేపట్టారు. విద్యార్థులకు ఈనెల 24 నుంచి 30 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు బోర్డు అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
అమెరికా జట్టులో మనోళ్లదే జోరు
-
మేనమామనన్నావ్.. మా కిట్లు ఆపేశావ్
-
పేర్ని కిట్టూపై ఎందుకంత ప్రేమ?.. స్వామి భక్తి ప్రదర్శిస్తున్న పోలీసులు
-
దళిత యువకుడికి పోలీసుల చిత్రహింసలు.. డిగ్రీ పరీక్షలు రాయకుండా నిర్బంధం
-
గులకరాయి ఘటనను.. ఎన్నికల్లో లబ్ధికి వినియోగించుకోకుండా అడ్డుకోండి
-
గరిష్ఠ ఉష్ణోగ్రతల్లో రోజుకో రికార్డు