వానాకాలం సాగుకు సన్నద్ధం
ఓ వైపు ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ కొనసాగుతుండగా... మరోవైపు అన్నదాతలు సాగుకు సన్నద్ధమవుతున్నారు.
ప్రణాళిక రూపొందించిన వ్యవసాయాధికారులు
న్యూస్టుడే, మెదక్: ఓ వైపు ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ కొనసాగుతుండగా... మరోవైపు అన్నదాతలు సాగుకు సన్నద్ధమవుతున్నారు. సకాలంలో వర్షాలు కురిస్తే సీజనల్ లేదంటే ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని వ్యవసాయశాఖ అధికారులు సూచిస్తున్నారు. నైరుతి రుతుపవనాలు ఈ నెలాఖరుకు కేరళకు తాకనున్నట్లు వాతావరణ శాఖ ప్రకటించడంతో వానాకాలానికి అవసరమైన ఎరువులు, విత్తనాలకు ప్రణాళిక ఖరారు చేశారు.
వ్యవసాయమే ఆధారం..
జిల్లాలో అధిక శాతం వ్యవసాయమే ఆధారం. ఏటా రెండు పంటలు సాగు చేస్తారు. రైతులు ఘనపూర్, హల్దీ ప్రాజెక్టుల పరిధిలో చెరువులు, కుంటలు, బోరుబావులపై ఆధారపడుతున్నారు. వానాకాలంలో వర్షాలే దిక్కు. జిల్లాలో ప్రధానంగా వరి, పత్తి, మొక్కజొన్న, జొన్న, కందులు పండిస్తుంటారు. గతేడాది వానాకాలంలో 3 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. ఈసారి 3.27 లక్షల ఎకరాల్లో వేస్తారని వ్యవసాయశాఖ అంచనా. గతేడాది కంటే 27 వేల ఎకరాలు పెరగనుందని అధికారులు ప్రణాళికలు రూపొందించారు. 2023లో పత్తి 37,321 ఎకరాల్లో వేశారు. ఈసారి అదనంగా 3వేల ఎకరాలు పెరగనుంది. మొక్కజొన్న గతం కంటే 2,820 ఎకరాల్లో అదనంగా వేస్తారని అంచనా.
అందుబాటులో ఉండేలా...
ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. జనుము విత్తనాలు 1,150, జీలుగ 4,080 క్వింటాళ్లు అందుబాటులో ఉన్నాయి. యూరియా 29 వేలు, డీఏపీ 4,015, ఎంవోపీ 3,780, ఎస్ఎస్పీ 3,600, కాంప్లెక్స్ 28వేలు కలిపి మొత్తం 68,895 మెట్రిక్ టన్నుల ఎరువులు వచ్చే సీజన్కు అవసరమవుతాయి. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, ఆగ్రోస్ కేంద్రాలు, ప్రైవేట్ డీలర్ల వద్ద అందుబాటులో ఉంచనున్నారు. మెదక్లో రేక్ పాయింట్ ఉండడంతో సకాలంలో ఎరువులు జిల్లాకు చేరనున్నాయి.
అవగాహన కల్పిస్తాం..
- గోవింద్, జిల్లా వ్యవసాయశాఖ అధికారి
వానాకాలం పంటల సాగుకు ప్రణాళిక రూపొందించాం. సకాలంలో వర్షాలు కురిస్తే వరి, పత్తి, మొక్కజొన్న వేసుకోవాలి. వానలు ఆలస్యమైతే ప్రత్యామ్నాయాలు చూసుకోవాలి. దీనిపై అన్నదాతలకు అవగాహన కల్పిస్తాం.
రైతులకు చల్లని కబురు..
కొద్ది నెలలుగా జిల్లాలో భూగర్భ జల మట్టాలు తగ్గుముఖం పడుతున్నాయి. ప్రస్తుతం చెరువుల్లో నీళ్లు పూర్తిగా తగ్గిపోయి, ఎండిపోయే స్థితికి చేరుకున్నాయి. దీంతో రైతులు వరుణ దేవుడిపైనే భారం వేశారు. ఈ క్రమంలో వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. ఈనెల 31 వరకు నైరుతి రుతు పవనాలు కేరళ తీరాన్ని తాకనున్నాయని తెలిపింది. దీంతో అన్నదాతల్లో ఆశలు చిగురిస్తున్నాయి. కొన్ని రోజులుగా అడపాదడపా వర్షాలు కురుస్తున్నాయి. లానినా ప్రభావంతో ఈసారి ఆగస్టు-సెప్టెంబరు నెలల మధ్య సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదు కావొచ్చని వాతావరణ శాఖ ప్రకటించింది. వర్షాలనుబట్టి రైతులు దుక్కులు దున్నే అవకాశముంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పదేళ్ల సంబరం.. ప్రగతి గణనీయం
[ 02-06-2024]
ప్రత్యేక తెలంగాణ ఆవిర్భవించాక చారిత్రక నేపథ్యం ఉన్న జిల్లా.. గత పదేళ్లలో వివిధ రంగాల్లో గణనీయమైన అభివృద్ధి సాధించింది. సాగు, తాగునీటి రంగాలతో పాటు, విద్య, వైద్య పరంగా పురోగతి చెందింది. -
పదేళ్ల వయసు.. వేనోళ్ల యశస్సు
[ 02-06-2024]
జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం.. అంటూ గొంతెత్తి పాడుతున్నారు ఉమ్మడి మెదక్, వికారాబాద్ జిల్లాల జనం.. స్వరాష్ట్ర సాధనలో ఎంతోమంది సమిధలవగా.. వారి ఆశయాల స్ఫూర్తిగా తెలంగానం ప్రగతి దిశగా అడుగులు వేస్తోంది.. పదేళ్ల పయనంలో ఉమ్మడి మెదక్, వికారాబాద్ జిల్లాలు అభివృద్ధిలో తమదైన ముద్ర వేయడం విశేషం.. -
తెలంగాణ దశాబ్ది.. రావిఆకులపై ఒదిగి
[ 02-06-2024]
ఎందరో అమరుల త్యాగఫలం, అలుపెరగని పోరాటాలకు దక్కిన ప్రతిఫలం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం. -
పోరాట స్ఫూర్తికి నిలయం
[ 02-06-2024]
హత్నూర మండలం దౌల్తాబాద్లో నిర్మించిన తెలంగాణ తల్లి మండపం ప్రత్యేకంగా నిలిచింది. మలి విడత ఉద్యమకారుల పోరాట స్ఫూర్తికి నిలయంగా మారింది. -
8 ఏళ్లు.. పాదరక్షల్లేకుండా..
[ 02-06-2024]
స్వరాష్ట్ర సాధన సమయంలో ఒక్కొక్కరు ఒక్కో తరహాలో తమ ఆకాంక్షను చాటారు. కొందరు దీక్షలు సైతం చేపట్టారు. తూప్రాన్ మండలం మల్కాపూర్కు చెందిన కిష్టాల స్వామి ఇదే కోవలోకి వస్తారు. -
ఎయిర్ఫోర్స్లో ఉద్యోగాల పేరిట మోసం
[ 02-06-2024]
ఎయిర్ఫోర్స్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని రూ.63 లక్షలు వసూలు చేసి పారిపోయిన నిందితుడిపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పేట్బషీరాబాద్ ఎస్ఐ ప్రవీణ్కుమార్ వివరాల ప్రకారం.. ఉమ్మడి కామారెడ్డి జిల్లా పిట్లం ప్రాంతానికి చెందిన కెతావత్ సంతోష్(30) కొంపల్లిలోని జయభేరి కాలనీలో నివసించేవాడు. -
దశాబ్ది.. దశదిశలా అభివృద్ధి
[ 02-06-2024]
ఒకప్పుడు అరకొర వసతులు.. అంతంత మాత్రంగా కార్యాలయాలు.. ప్రగతి ఫలితాలు నామమాత్రమే.. ప్రస్తుతం సకల సదుపాయాలు.. కార్పొరేట్ స్థాయిలో భవనాలు.. సంక్షేమ, అభివృద్ధి ఫలితాలు నేరుగా ప్రజలకు చెంతకు చేరుతున్న వైనం నాడు-నేడు వ్యత్యాసాన్ని చెబుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
దేశంలోనే సుదీర్ఘ కాలం సీఎం.. 39 ఏళ్లలో తొలి ఓటమి
-
స్టార్టప్లు నేర్పిన పాఠాలివే: గజల్ అలఘ్
-
అక్కడ జడేజా బ్యాటింగ్.. నేను నోరు మూసుకోవడం బెటర్: మంజ్రేకర్
-
ఇవి చిన్న మార్పులే కావొచ్చు.. ఆరోగ్యానికి ఎంతో మేలు!
-
కౌంటింగ్ రోజు వైకాపా కుట్రలను తిప్పికొట్టాలి: చంద్రబాబు