సైబర్ నేరస్థులకు ‘మ్యూల్’ ఖాతాలు
సైబర్ నేరస్థుల కోసం ‘మ్యూల్’ బ్యాంకు ఖాతాలు తెరుస్తున్న ముఠా గుట్టును తూర్పు మండలం టాస్క్ఫోర్స్, సైబర్ పోలీసులు, తెలంగాణ రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరోలు రట్టు చేశాయి. అయిదుగురు నిందితులను పోలీసులు శనివారం అరెస్టు చేశారు.
సహకరించిన అయిదుగురి అరెస్టు
నారాయణగూడ, న్యూస్టుడే: సైబర్ నేరస్థుల కోసం ‘మ్యూల్’ బ్యాంకు ఖాతాలు తెరుస్తున్న ముఠా గుట్టును తూర్పు మండలం టాస్క్ఫోర్స్, సైబర్ పోలీసులు, తెలంగాణ రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరోలు రట్టు చేశాయి. అయిదుగురు నిందితులను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. హైదరాబాద్ టాస్క్ఫోర్స్ డీసీపీ ఎస్.రష్మీ పెరుమాళ్ తెలిపిన వివరాల ప్రకారం.. రాత్రి రాత్రే ధనవంతులు కావాలనే అత్యాశతో మ్యూల్ బ్యాంక్ ఖాతాలు తెరిచి సైబర్ నేరస్థులకు సరఫరా చేస్తున్నారని, సైబర్ నేరాలకు కారణమవుతున్నారని తూర్పు మండలం టాస్క్ఫోర్స్ పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. హైదరాబాద్ సైబర్ పోలీసులు, తెలంగాణ స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరోతో కలిసి ఆపరేషన్ మొదలుపెట్టారు. సాంకేతిక ఆధారాలతో ఉత్తరాఖండ్ రాష్ట్రం యూఎస్ నగరా జిల్లాకు చెందిన సివిల్ వర్కర్ ఆరిఫ్ సైఫీ(40), పాతబస్తీ డబీర్పురకు చెందిన ఎలక్ట్రీషియన్ మహ్మద్ అబ్దుల్ నవీద్(30), లిఫ్ట్ మెకానిక్ సోహెల్ ఖాన్(20), పాతబస్తీ కాలాడేరాకు చెందిన సేల్స్మెన్ మహ్మద్ దాదే ఖాన్(21), చాంద్రాయణగుట్ట ఫూల్బాగ్కు చెందిన వెల్డర్ సోహెల్ఖాన్(25) మ్యూల్ ఖాతాలు సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు.
దేశవ్యాప్తంగా..: ప్రధాన నిందితుడు ఆరిఫ్ సైఫీ సౌదీకి వెళ్లి భవన నిర్మాణ రంగంలో సివిల్ ఫోర్మెన్గా పని చేశాడు. 2023 ఫిబ్రవరిలో షార్జాలో యూపీ మురాదాబాద్కు చెందిన జయీద్, పంజాబ్కు చెందిన సందీప్సింగ్లతో పరిచయం ఏర్పడింది. వారు క్రిప్టో కరెన్సీ వ్యాపారం చేస్తున్నామని, తమ వ్యాపారానికి బ్యాంక్ ఖాతాలు అవసరమని, ప్రతీ లావాదేవీకి రూ.1500 ఇస్తామని చెప్పారు. ఈ విషయాన్ని షార్జాలో ఉంటున్న హైదరాబాద్ చాదర్ఘాట్కు చెందిన ఫాతిమా బేగం (ప్రస్తుతం షార్జాలోనే ఉన్నారు) ఆరిఫ్ సైఫీ చెప్పిన మాటలకు ఆకర్షితురాలైంది. ఖాతాలు తెరిపించడం, సిమ్ కార్డులు ఇస్తే రూ.10 వేలు ఇస్తామని కూడా చెప్పాడు. ఫాతిమా అల్లుడు మహ్మద్ అబ్దుల్ నవీద్, కుమారుడు సోహెల్ ఖాన్, మహ్మద్ దాదే ఖాన్, సోహెల్ ఖాన్లకు విషయం చెప్పింది. వీరంతా బ్యాంక్ ఖాతాలు తెరిచి, పాస్బుక్, డెబిట్ కార్డులు, అలాగే సిమ్ కార్డులు దుబాయికి పంపించడం మొదలుపెట్టారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా నమోదైన 125 కేసుల్లో 82 ఖాతాలు గుర్తించారు. వాటిలో తెలంగాణకు సంబంధించి హైదరాబాద్లో 3, సైబరాబాద్లో మూడు, రాచకొండలో ఒకటి, కరీంనగర్ ఒకటి, జహీరాబాద్ ఒకటి మొత్తం 9 కేసులు ఉన్నట్లు గుర్తించారు. 82 మ్యూల్ ఖాతాల్లో సుమారు రూ.5 కోట్లు జమైనట్లు పోలీసులు గుర్తించారు. మోసగాళ్లు ఆ మొత్తాన్ని విత్డ్రా చేసుకున్నారు. నిందితుల నుంచి 65 బ్యాంక్ ఖాతా కిట్లు, 14 డెబిట్ కార్డులు, 31 సిమ్కార్డ్ పౌచ్లు, 6 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పదేళ్ల సంబరం.. ప్రగతి గణనీయం
[ 02-06-2024]
ప్రత్యేక తెలంగాణ ఆవిర్భవించాక చారిత్రక నేపథ్యం ఉన్న జిల్లా.. గత పదేళ్లలో వివిధ రంగాల్లో గణనీయమైన అభివృద్ధి సాధించింది. సాగు, తాగునీటి రంగాలతో పాటు, విద్య, వైద్య పరంగా పురోగతి చెందింది. -
పదేళ్ల వయసు.. వేనోళ్ల యశస్సు
[ 02-06-2024]
జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం.. అంటూ గొంతెత్తి పాడుతున్నారు ఉమ్మడి మెదక్, వికారాబాద్ జిల్లాల జనం.. స్వరాష్ట్ర సాధనలో ఎంతోమంది సమిధలవగా.. వారి ఆశయాల స్ఫూర్తిగా తెలంగానం ప్రగతి దిశగా అడుగులు వేస్తోంది.. పదేళ్ల పయనంలో ఉమ్మడి మెదక్, వికారాబాద్ జిల్లాలు అభివృద్ధిలో తమదైన ముద్ర వేయడం విశేషం.. -
తెలంగాణ దశాబ్ది.. రావిఆకులపై ఒదిగి
[ 02-06-2024]
ఎందరో అమరుల త్యాగఫలం, అలుపెరగని పోరాటాలకు దక్కిన ప్రతిఫలం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం. -
పోరాట స్ఫూర్తికి నిలయం
[ 02-06-2024]
హత్నూర మండలం దౌల్తాబాద్లో నిర్మించిన తెలంగాణ తల్లి మండపం ప్రత్యేకంగా నిలిచింది. మలి విడత ఉద్యమకారుల పోరాట స్ఫూర్తికి నిలయంగా మారింది. -
8 ఏళ్లు.. పాదరక్షల్లేకుండా..
[ 02-06-2024]
స్వరాష్ట్ర సాధన సమయంలో ఒక్కొక్కరు ఒక్కో తరహాలో తమ ఆకాంక్షను చాటారు. కొందరు దీక్షలు సైతం చేపట్టారు. తూప్రాన్ మండలం మల్కాపూర్కు చెందిన కిష్టాల స్వామి ఇదే కోవలోకి వస్తారు. -
ఎయిర్ఫోర్స్లో ఉద్యోగాల పేరిట మోసం
[ 02-06-2024]
ఎయిర్ఫోర్స్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని రూ.63 లక్షలు వసూలు చేసి పారిపోయిన నిందితుడిపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పేట్బషీరాబాద్ ఎస్ఐ ప్రవీణ్కుమార్ వివరాల ప్రకారం.. ఉమ్మడి కామారెడ్డి జిల్లా పిట్లం ప్రాంతానికి చెందిన కెతావత్ సంతోష్(30) కొంపల్లిలోని జయభేరి కాలనీలో నివసించేవాడు. -
దశాబ్ది.. దశదిశలా అభివృద్ధి
[ 02-06-2024]
ఒకప్పుడు అరకొర వసతులు.. అంతంత మాత్రంగా కార్యాలయాలు.. ప్రగతి ఫలితాలు నామమాత్రమే.. ప్రస్తుతం సకల సదుపాయాలు.. కార్పొరేట్ స్థాయిలో భవనాలు.. సంక్షేమ, అభివృద్ధి ఫలితాలు నేరుగా ప్రజలకు చెంతకు చేరుతున్న వైనం నాడు-నేడు వ్యత్యాసాన్ని చెబుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
దేశంలోనే సుదీర్ఘ కాలం సీఎం.. 39 ఏళ్లలో తొలి ఓటమి
-
స్టార్టప్లు నేర్పిన పాఠాలివే: గజల్ అలఘ్
-
అక్కడ జడేజా బ్యాటింగ్.. నేను నోరు మూసుకోవడం బెటర్: మంజ్రేకర్
-
ఇవి చిన్న మార్పులే కావొచ్చు.. ఆరోగ్యానికి ఎంతో మేలు!
-
కౌంటింగ్ రోజు వైకాపా కుట్రలను తిప్పికొట్టాలి: చంద్రబాబు