లెక్కలు తేలుస్తారు
సంఘాలు.. సంస్థలు.. కార్యాలయాలు ఎక్కడైనా లెక్కలే కీలకం. వీటిలో తేడా వస్తే నమ్మకానికి తావుండదు. అందుకే ఇవి పక్కాగా ఉండాలి.
గ్రామైక్య సంఘాల వారీగా ఆడిట్
21 నుంచి నిర్వహణకు ఏర్పాట్లు
గొల్లపల్లిలో గ్రామైక్య సంఘం సమావేశం
న్యూస్టుడే, సంగారెడ్డి టౌన్: సంఘాలు.. సంస్థలు.. కార్యాలయాలు ఎక్కడైనా లెక్కలే కీలకం. వీటిలో తేడా వస్తే నమ్మకానికి తావుండదు. అందుకే ఇవి పక్కాగా ఉండాలి. మహిళా పొదుపు సంఘాలు ఇందుకు మినహాయింపేమీ కాదు. గ్రామైక్య సంఘం(వీవో)లో లెక్కల విషయంలో తేడాలకు తావు లేకుండా గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ పలు చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే వీవోల వారీగా ఈ నెల 21 నుంచి ఆడిట్ నిర్వహించనుంది. ఈ నేపథ్యంలోనే కథనం.
పుస్తకాలు.. అంతర్జాలంలో పరిశీలన
గ్రామంలోని పొదుపు సంఘాలన్నీ కలిపి గ్రామైక్య సంఘంగా ఏర్పాటుచేస్తారు. పొదుపు సంఘాల ఎక్కువగా ఉంటే అందుకు అనుగుణంగా వీటి సంఖ్య కూడా పెంచుతారు. ఒక్కో సంఘానికి అధ్యక్షురాలు, కార్యదర్శి, కోశాధికారి ఉంటారు. వీరితో పాటు వీవోఏ(విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్) ఉంటారు. ఈ సంఘం పరిధిలోని మహిళా సంఘాల లెక్కలన్నీ ప్రస్తుతం వీవోఏలు ఆన్లైన్లో నమోదుచేస్తున్న సంగతి తెలిసిందే. అదే సమయంలో పుస్తకాల్లోనూ నమోదు చేస్తున్నారు. ఆడిట్లో భాగంగా ఆన్లైన్, పుస్తకాలు పరిశీలిస్తూ ఏమైనా తేడాలు ఉన్నాయా అని ఆరా తీయనున్నారు. తేడా ఉంటే కారణాలు తెలుసుకుంటారు. పుస్తకాల్లో నమోదైన వాటిలో కొన్ని ఆన్లైన్లోకి ఎక్కించకపోవడం, నిధులు ఏమైనా పక్కదారి పట్టాయా లేదా అని పరిశీలిస్తారు. గ్రామైక్య సంఘం పుస్తకాల్లో రుణాలు, వాయిదాల చెల్లింపుల వివరాలన్నీ సరిచూసి అంతర్జాలంలో నిక్షిప్తం చేయనున్నారు.
ఆర్థిక పరిస్థితుల మెరుగుకు ప్రణాళికలు
2023-24 ఆర్థిక సంవత్సరంలో ఒక్కో మహిళా గ్రామైక్య సంఘం ద్వారా పొదుపు సంఘాలకు ఇచ్చిన రుణాలు, వసూళ్లు, తదితరాలతో బ్యాంకు నిల్వల సమన్వయ పట్టికలు తయారుచేస్తారు. దీనివల్ల సంఘం సభ్యులకు తమ పరిస్థితి ఏమిటో తెలియజేయనున్నారు. ఆడిట్ ఆధారంగా వెనుకబడ్డ సంఘాల ఆర్థిక ప్రగతికి ఉన్న అవకాశాలు సద్వినియోగం చేసుకునేలా ప్రోత్సహించనున్నారు.
పారదర్శకత పెరుగుతుంది: జంగారెడ్డి, అదనపు డీఆర్డీవో
గ్రామైక్య సంఘాల వారీగా ఆడిట్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశాం. జిల్లా వ్యాప్తంగా జూన్ 30వ తేదీలోగా పూర్తిచేస్తాం. ఇందుకు అనుగుణంగా ఆడిట్ బృందాలకు ఇప్పటికే సూచనలు చేశాం. వివరాలన్నీ అంతర్జాలంలో నిక్షిప్తం చేయడంతో పాటు పుస్తకాల్లోనూ నమోదు చేయించనున్నాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పదేళ్ల సంబరం.. ప్రగతి గణనీయం
[ 02-06-2024]
ప్రత్యేక తెలంగాణ ఆవిర్భవించాక చారిత్రక నేపథ్యం ఉన్న జిల్లా.. గత పదేళ్లలో వివిధ రంగాల్లో గణనీయమైన అభివృద్ధి సాధించింది. సాగు, తాగునీటి రంగాలతో పాటు, విద్య, వైద్య పరంగా పురోగతి చెందింది. -
పదేళ్ల వయసు.. వేనోళ్ల యశస్సు
[ 02-06-2024]
జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం.. అంటూ గొంతెత్తి పాడుతున్నారు ఉమ్మడి మెదక్, వికారాబాద్ జిల్లాల జనం.. స్వరాష్ట్ర సాధనలో ఎంతోమంది సమిధలవగా.. వారి ఆశయాల స్ఫూర్తిగా తెలంగానం ప్రగతి దిశగా అడుగులు వేస్తోంది.. పదేళ్ల పయనంలో ఉమ్మడి మెదక్, వికారాబాద్ జిల్లాలు అభివృద్ధిలో తమదైన ముద్ర వేయడం విశేషం.. -
తెలంగాణ దశాబ్ది.. రావిఆకులపై ఒదిగి
[ 02-06-2024]
ఎందరో అమరుల త్యాగఫలం, అలుపెరగని పోరాటాలకు దక్కిన ప్రతిఫలం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం. -
పోరాట స్ఫూర్తికి నిలయం
[ 02-06-2024]
హత్నూర మండలం దౌల్తాబాద్లో నిర్మించిన తెలంగాణ తల్లి మండపం ప్రత్యేకంగా నిలిచింది. మలి విడత ఉద్యమకారుల పోరాట స్ఫూర్తికి నిలయంగా మారింది. -
8 ఏళ్లు.. పాదరక్షల్లేకుండా..
[ 02-06-2024]
స్వరాష్ట్ర సాధన సమయంలో ఒక్కొక్కరు ఒక్కో తరహాలో తమ ఆకాంక్షను చాటారు. కొందరు దీక్షలు సైతం చేపట్టారు. తూప్రాన్ మండలం మల్కాపూర్కు చెందిన కిష్టాల స్వామి ఇదే కోవలోకి వస్తారు. -
ఎయిర్ఫోర్స్లో ఉద్యోగాల పేరిట మోసం
[ 02-06-2024]
ఎయిర్ఫోర్స్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని రూ.63 లక్షలు వసూలు చేసి పారిపోయిన నిందితుడిపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పేట్బషీరాబాద్ ఎస్ఐ ప్రవీణ్కుమార్ వివరాల ప్రకారం.. ఉమ్మడి కామారెడ్డి జిల్లా పిట్లం ప్రాంతానికి చెందిన కెతావత్ సంతోష్(30) కొంపల్లిలోని జయభేరి కాలనీలో నివసించేవాడు. -
దశాబ్ది.. దశదిశలా అభివృద్ధి
[ 02-06-2024]
ఒకప్పుడు అరకొర వసతులు.. అంతంత మాత్రంగా కార్యాలయాలు.. ప్రగతి ఫలితాలు నామమాత్రమే.. ప్రస్తుతం సకల సదుపాయాలు.. కార్పొరేట్ స్థాయిలో భవనాలు.. సంక్షేమ, అభివృద్ధి ఫలితాలు నేరుగా ప్రజలకు చెంతకు చేరుతున్న వైనం నాడు-నేడు వ్యత్యాసాన్ని చెబుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
దేశంలోనే సుదీర్ఘ కాలం సీఎం.. 39 ఏళ్లలో తొలి ఓటమి
-
స్టార్టప్లు నేర్పిన పాఠాలివే: గజల్ అలఘ్
-
అక్కడ జడేజా బ్యాటింగ్.. నేను నోరు మూసుకోవడం బెటర్: మంజ్రేకర్
-
ఇవి చిన్న మార్పులే కావొచ్చు.. ఆరోగ్యానికి ఎంతో మేలు!
-
కౌంటింగ్ రోజు వైకాపా కుట్రలను తిప్పికొట్టాలి: చంద్రబాబు
-
ఇవి ఎగ్జిట్ పోల్స్ కావు.. మోదీ పోల్స్: రాహుల్ గాంధీ