నల్గొండ.. నాయకులకు అండ!
నల్గొండ లోక్సభ నియోజకవర్గానికి 18వ సారి ఎన్నికలు జరుగనున్నాయి. ఉమ్మడి జిల్లాలో తొలిసారి ఏర్పడిన ఏకైక లోక్సభ నియోజకవర్గం నల్గొండ మాత్రమే.
మిర్యాలగూడ పట్టణం, న్యూస్టుడే: నల్గొండ లోక్సభ నియోజకవర్గానికి 18వ సారి ఎన్నికలు జరుగనున్నాయి. ఉమ్మడి జిల్లాలో తొలిసారి ఏర్పడిన ఏకైక లోక్సభ నియోజకవర్గం నల్గొండ మాత్రమే. 1952లో ఇక్కడ లోక్సభకు ఎన్నికలు జరిగాయి. అప్పట్లో కొన్ని రిజర్వుడు నియోజకవర్గాల్లో ఒక రిజర్వేషన్ అభ్యర్థిని సైతం ఎన్నుకునే పద్ధతి ఉండడంతో తొలి ఎన్నికల్లో పీడీఎఫ్ అభ్యర్థులు సుంకం అచ్చాలు, రావి నారాయణరెడ్డి విజయం సాధించగా.. 1957లో పీడీఎఫ్ అభ్యర్థి దేవులపల్లి వెంకటేశ్వరరావు, కాంగ్రెస్ అభ్యర్థి డి.రాజయ్య(ఎస్సీ)లు ఎన్నికయ్యారు. మే 13న మరోసారి లోక్సభ పోరుకు సిద్ధమయ్యారు నల్గొండ నియోజకవర్గ ప్రజలు.
మారిన నియోజకవర్గ స్వరూపం..
నల్గొండ తర్వాత ఉమ్మడి జిల్లాలో 1962లో మిర్యాలగూడ లోక్సభ నియోజకవర్గం ఏర్పడింది. 2008లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో మిర్యాలగూడ నియోజకవర్గం రద్దయి.. కొత్తగా భువనగిరి నియోజకవర్గం ఏర్పాటైంది. 2008 వరకు నల్గొండ లోక్సభ నియోజకవర్గంలో ఆలేరు, భువనగిరి, మునుగోడు, దేవరకొండ, మలక్పేట, నల్గొండ, ఇబ్రహీంపట్నం అసెంబ్లీ స్థానాలు ఉండేవి. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత నాగార్జునసాగర్, దేవరకొండ, మిర్యాలగూడ, హుజూర్నగర్, కోదాడ, సూర్యాపేట, నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గాలు నల్గొండ లోక్సభ పరిధిలోకి వచ్చాయి.
కాంగ్రెస్, సీపీఐ హోరాహోరీ..
నల్గొండ లోక్సభ నియోజకవర్గానికి మొత్తం 17 సార్లు ఎన్నికలు జరుగగా.. కాంగ్రెస్ అభ్యర్థులు 8 సార్లు, సీపీఐ అభ్యర్థులు 5 సార్లు విజయం సాధించారు. పీడీఎఫ్ అభ్యర్థులు మూడు సార్లు, తెదేపా అభ్యర్థులు రెండు సార్లు, తెలంగాణ ప్రజాపోరు సమితి అభ్యర్థి ఒకసారి విజయం సాధించారు. అత్యధికంగా గుత్తా సుఖేందర్రెడ్డి మూడు సార్లు (ఒకసారి తెదేపా నుంచి, కాంగ్రెస్ నుంచి రెండు సార్లు) ఎంపీగా విజయం సాధించారు. ఆ తర్వాత సీపీఐ అభ్యర్థులు రావి నారాయణరెడ్డి, బొమ్మగాని ధర్మభిక్షం, సురవరం సుధాకర్రెడ్డి తలో రెండు సార్లు విజయం సాధించారు. ప్రస్తుత రాష్ట్ర మంత్రి నలమాద ఉత్తమ్కుమార్రెడ్డి 2019లో ఇక్కడి నుంచి ఎంపీగా గెలుపొందారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బకాయిదారులే తెరుచుకున్నాయ్!
[ 02-05-2024]
ఉమ్మడి జిల్లాలో 2022-23 రెండు సీజన్లకు సంబంధించిన సీఎంఆర్ ధాన్యం తీసుకుని కోట్ల రూపాయల బియ్యం ఇవ్వకుండా పౌరసరఫరాల అధికారులను ముప్పుతిప్పలు పెడుతున్న మిల్లర్లు ఉన్నారు. -
గుర్తుల గుబులు
[ 02-05-2024]
లోక్సభ ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం సోమవారం ముగియడంతో.. ప్రధాన పార్టీల అభ్యర్థులకు గుర్తుల గుబులు పట్టుకుంది. -
శిక్షణకు సిద్ధం
[ 02-05-2024]
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ అధికారులు, సిబ్బందికి రెండో విడత శిక్షణ కార్యక్రమం ఈ నెల 2 నుంచి 4 వరకు నిర్వహించనున్నారు. అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో శిక్షణ తరగతులు ఏర్పాటు చేయనున్నారు. -
ఓట్ల ఆధారంగానే పార్టీలకు గుర్తింపు
[ 02-05-2024]
మనం తరచూ జాతీయ, ప్రాంతీయ పార్టీలు అంటూ వింటుంటాం. ఎన్నికల సమయంలో నేతలు ఎక్కువగా వీటిని ప్రస్తావిస్తుంటారు. జాతీయ పార్టీలు అంటే దిల్లీ కేంద్రంగా పనిచేస్తాయని, ప్రాంతీయ పార్టీలు స్థానిక సమస్యలను పరిష్కరిస్తుంటాయని చెబుతుంటారు. -
ఆగస్టు 15లోపు రైతులకు రుణమాఫీ
[ 02-05-2024]
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హామీ ఇచ్చిన మేరకు ఆగస్టు 15లోపు రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి స్పష్టం చేశారు. -
సినీ ఫక్కీలో ఎల్లయ్య హత్య
[ 02-05-2024]
గత నెల 19న ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటకు వచ్చి అదృశ్యమైనట్లు కేసు నమోదైన సూర్యాపేట మండలానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు వడ్డె ఎల్లయ్యను కొంతమందితో కలిసి హత్య చేసినట్లు సూర్యాపేట జిల్లాకు చెందిన తాడూరి శ్రీకాంతరాజు (చారి) ఒప్పుకొన్నారు. -
పోలీసులకూ అనుమతి లేదు సుమా..!
[ 02-05-2024]
మొత్తం ఎన్నికల నిర్వహణలో పోలీసులది కీలకపాత్ర. దాదాపు ఎన్నికల ప్రక్రియలో అన్ని చోట్లా వారి జోక్యం ఉంటుంది. ఎన్నికల ప్రచారాలకు, సభలకు, ర్యాలీలకు వారి అనుమతులు తప్పనిసరి. -
ఎండ వేఢీ.. చిక్కని ఓటరు నాడి
[ 02-05-2024]
శారీరక శ్రమకు అలవాటు పడి.. ప్రతి నిత్యం పనిలో నిమగ్నమై.. స్వేదం చిందించే కార్మికులను, కర్షకులను సైతం ఈ ఏడాది ఎండలు హడలెత్తిస్తున్నాయి. -
ఆయుధాలు అప్పగించారు..!
[ 02-05-2024]
వ్యక్తిగత భద్రత కోసం లైసెన్సు తీసుకొని వెంట ఉంచుకున్న ఆయుధాలను ఉమ్మడి నల్గొండ జిల్లావాసులు ఠాణాలకు అప్పగించారు. -
ఆరో తరగతిలో వేయి పడగలు నవల చదివా
[ 02-05-2024]
మాది భువనగిరి. 12వ తరగతి వరకు అక్కడే చదివాను. ఆరో తరగతి చదివే రోజుల్లో వేసవి సెలవులొస్తే స్నేహితులు యంజాల గోపాల్, బుద్దగిరి లక్ష్మీనర్సయ్య, చల్ల కృష్ణలతో కలిసి నార్ఖాన్ బావికి ఈతకు వెళ్లేవాళ్లం. -
నీలగిరి.. నిప్పుల కొలిమి!
[ 02-05-2024]
భానుడి భగభగలతో ఉమ్మడి జిల్లా నిప్పుల కుంపటిలా మారుతోంది. రోజురోజుకీ రాష్ట్రంలోనే అత్యధికంగా రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. -
ప్రపంచ పర్యావరణ దినోత్సవ ప్రతిభా అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం
[ 02-05-2024]
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జూన్ 5న ప్రతిభా అవార్డులు ప్రదానం చేయనున్నట్లు రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి సీనియర్ సోషల్ సైంటిస్ట్ డబ్ల్యూజీ ప్రసన్నకుమార్ తెలిపారు. -
పేరు చెప్పనందుకు ఓటు కట్
[ 02-05-2024]
భారతదేశానికి స్వాతంత్య్రం సిద్ధించాక 1951లో ఓటర్ల నమోదు చేపట్టారు. అప్పట్లో 21 సంవత్సరాలు నిండిన అందరికీ ఓటు హక్కును రాజ్యాంగం కల్పించింది. -
పోలింగ్ కేంద్రాల్లో అధికారుల నంబర్లు
[ 02-05-2024]
లోక్సభ ఎన్నికల్లో ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాల్లో కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నారు. బయట గోడలపై పోలింగ్ కేంద్రం, లోక్సభ, అసెంబ్లీ నియోజకవర్గ నంబర్లు వేస్తున్నారు. -
18 ఏళ్లకు ఓటుహక్కు ఎప్పుడు కల్పించారంటే..!
[ 02-05-2024]
1952లో సాధారణ ఎన్నికల సందర్భంగా అధికరణ 326 ద్వారా సార్వత్రిక వయోజన ఓటు హక్కు కల్పించారు. దీని ద్వారా 21 ఏళ్లు పైబడిన వారు ఓటు హక్కును వినియోగించుకునేవారు.
తాజా వార్తలు (Latest News)
-
గోద్రేజ్ విభజన షేర్ల బదిలీతోనే.. ముంబయిలోని 3400 ఎకరాలు జెంషెడ్ వర్గానికి..
-
రస్మలై, బిర్యానీ మానేసి.. 16కిలోలు తగ్గి..
-
బద్వేలులో భూబకాసురులు...ఆ బావబామ్మర్దులు!
-
రెండేళ్లలో ఆరు ప్రభుత్వ ఉద్యోగాలు
-
రేవంత్ మహారాష్ట్ర.. కేసీఆర్ గుజరాత్!
-
ప్రైవేటు ఆస్తిని సమాజ ఉమ్మడి వనరుగా నిర్ణయిస్తే భవిష్యత్తుకు ఇంకేమీ మిగలదు