logo

పంచనారసింహులకు భక్తుల మొక్కు పూజలు

పంచనారసింహులు కొలువై ఉన్న యాదాద్రి పుణ్యక్షేత్రంలో శనివారం భక్త జనుల ఆరాధనలు శాస్త్రోక్తంగా కొనసాగాయి. సుప్రభాతం నిర్వహించిన పూజారులను బిందెతీర్థంతో చేపట్టిన కైంకర్యాలు ఆలయ విశిష్టతకు అనుగుణంగా కొనసాగాయి.

Updated : 19 May 2024 03:44 IST

దైవదర్శనం కోసం బారులు తీరిన భక్తులు

యాదగిరిగుట్ట, న్యూస్‌టుడే: పంచనారసింహులు కొలువై ఉన్న యాదాద్రి పుణ్యక్షేత్రంలో శనివారం భక్త జనుల ఆరాధనలు శాస్త్రోక్తంగా కొనసాగాయి. సుప్రభాతం నిర్వహించిన పూజారులను బిందెతీర్థంతో చేపట్టిన కైంకర్యాలు ఆలయ విశిష్టతకు అనుగుణంగా కొనసాగాయి. గర్భాలయంలో కొలువై ఉన్న స్వయంభువులను మేల్కొల్పిన పూజారులు హారతితో కొలిచారు. పంచామృతంతో అభిషేకించి, తులసీ దళాలతో అర్చన చేపట్టారు. భక్తులకు దర్శనమిచ్చే కవచమూర్తులకు సువర్ణ పుష్పార్చన జరిపారు. అష్టభుజి మండప ప్రాకారంలో శ్రీసుదర్శన నారసింహహోమం, శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్యకల్యాణం ఆలయ ఆచార వ్యవహారాలతో నిర్వహించారు. అలంకార సేవోత్సవం జరిపారు. జోడు సేవలను మంగళ వాయిద్యాల మధ్య చేపట్టారు. క్షేత్రపాలకుడు ఆంజనేయస్వామిని కొలుస్తూ సహస్రనామార్చన నిర్వహించారు.

  • వివిధ ప్రాంతాలకు చెందిన భక్తుల రాకతో ఆలయ పరిసరాల్లో సందడి నెలకొంది. దైవదర్శనానికి భక్తులు గంటలకొద్దీ వేచి ఉన్నారు. యాత్రికుల వాహనాలు అధిక సంఖ్యలో రావడంతో కొండపైకి రాకుండా చర్యలు తీసుకున్నారు. కొండపైన పార్కింగ్‌ కోసం స్థలాభావంతో వెను వెంటనే వాహనాలను తిరిగి పంపించేందుకు ఆలయ అధికారులు చర్యలు చేపట్టారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని