బండేపల్లి.. బాధలు పట్టేదెవరికి?
కనుపూరు కాలువ పరిధిలోని బండేపల్లి బ్రాంచి కెనాల్ ఆయకట్టు కింద సుమారు 25వేల ఎకరాలకుపైనే సాగు ఉండగా- ఆయకట్టు చెరువులకు సాగునీరందక ఏటా రైతులు ఇబ్బంది పడే పరిస్థితి.
అయిదేళ్లలో అంగుళం కదలని వైనం
మనుబోలు, న్యూస్టుడే
తాము అధికారంలోకి వచ్చిన వెంటనే డేగపూడి-బండేపల్లి లింకు కాలువ పనులు పూర్తి చేసి.. 2024 ఎన్నికల్లో ఓట్లు అడుగుతాం
- కాకాణి గోవర్ధన్రెడ్డి
మరి అయిదేళ్ల వైకాపా పాలనలో ఆ వాగ్దానం నెరవేరిందా? అంటే.. లేదనే అక్కడి పరిస్థితులు తేటతెల్లం చేస్తున్నాయి.
సమస్య ఇది
కనుపూరు కాలువ పరిధిలోని బండేపల్లి బ్రాంచి కెనాల్ ఆయకట్టు కింద సుమారు 25వేల ఎకరాలకుపైనే సాగు ఉండగా- ఆయకట్టు చెరువులకు సాగునీరందక ఏటా రైతులు ఇబ్బంది పడే పరిస్థితి. ఈ కాలువ నిర్మాణం జరుగుతుందని, బండేపల్లి బ్రాంచి కాలువ ఆయకట్టు కింద బీడు భూములు సాగులోకి వస్తాయని రైతులు పాతికేళ్లుగా ఎదురు చూస్తుండగా.. ప్రతిసారీ వారికి నిరాశే ఎదురవుతోంది. కాలువ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. దీనికి శాశ్వత పరిష్కారం కోసం 2003, మే 10 బండేపల్లి బ్రాంచి కాలువ ఆయకట్టు రైతు సంఘం ఏర్పాటు చేసి.. నాటి నుంచి శ్రమిస్తూనే ఉన్నారు.
సాధన దిశగా
2014 ఎన్నికల్లో సోమిరెడ్డి కాలువకు కండలేరు నుంచి నీటిని అందించి.. పంటలు కాపాడుతామని వాగ్దానం చేశారు. అన్నట్లుగానే నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి సమస్యను తీసుకువెళ్లారు. జీవో జారీ చేయడంతో పాటు భూసేకరణకు సుమారు రూ. 10.30 కోట్లు మంజూరు చేయించారు. దాదాపు రూ. 30 కోట్ల అంచనాలతో కాలువ నిర్మాణానికి 2019, జనవరిలో రాజవోలుపాడు వద్ద శంకుస్థాపన చేశారు. సుమారు 2 కి.మీ. మేర పనులూ జరిగాయి.
సాకారమైతే...
ఆయకట్టు పరిధిలోని గొట్లపాలెం, రాజవోలుపాడు, వీరంపల్లి, అక్కంపేట, మడమనూరు, పర్లపాడు, బండేపల్లి, జట్లకొండూరు, కొండూరుసత్రం తదితర గ్రామాల్లోని చెరువులు జలకళ సంతరించుకుంటాయి. మనుబోలు మండలంతో పాటు వెంకటాచలం, సైదాపురం, పొదలకూరు మండలాల్లోని పలు గ్రామాలు సస్యశ్యామలమవుతాయి.
ఆశ.. నిరాశ
సాగునీరు సక్రమంగా రాక.. వేసిన పంటలు కళ్లెదుటే ఎండిపోతున్నా.. ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్న అన్నదాతలకు ఈ పనులు ఎంతో సంతోషం కలిగించాయి. అంతలోనే.. ఆ ఆనందం ఆవిరైంది. కారణం.. 2019 ఎన్నికల తర్వాత ప్రభుత్వం మారడంతో.. ఈ పనులు నిలిచిపోయాయి. వైకాపా ప్రభుత్వంలో ఒక్క అడుగూ ముందుకు పడలేదు.
అడ్డకోవడంతో ఆగిపోయాయి
- వద్దినేని మస్తాన్నాయుడు, కనుపూరు కాలువ ప్రాజెక్టు కమిటీ మాజీ ఛైర్మన్
డేగపూడి-బండేపల్లి లింకు కాలువ పనులను రెండు కి.మీ. మేర చేయించాం. ప్రభుత్వం మారడం, ఎమ్మెల్యే కాకాణి కారణంగానే అవి నిలిచిపోయాయి. ఆ తర్వాత తిరిగి మొదలు కాలేదు. ఆయకట్టు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
నీరందిస్తే ప్రయోజనం
- లక్ష్మయ్య, అఖిలపక్ష రైతు పోరాట సమితి నాయకుడు
డేగపూడి-బండేపల్లి లింకు కాలువ పూర్తయితే పాతికేళ్ల నాటి రైతుల కల నెరవేరుతుంది. ఈ బ్రాంచి కాలువకు సాగునీరందక.. ఏటా వేలాది ఎకరాలు బీడు భూములుగా వదిలేసే పరిస్థితి ఉంది. రైతుల కష్టాలు తీర్చే దిశగా ఒక్క అడుగూ పడకపోవడం బాధాకరం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెదేపా ప్రభంజనం ఖాయం
[ 02-05-2024]
‘నెల్లూరు జిల్లాలో తెదేపా ప్రభంజనం ఖాయం. ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డితో పాటు.. నెల్లూరు నగర, గ్రామీణ ఎమ్మెల్యేలుగా నారాయణ, కోటంరెడ్డి శ్రీధర్రెడ్డిలను గెలిపించండి. -
జగనన్న ఇళ్లు.. అక్రమాల వాకిళ్లు!
[ 02-05-2024]
ఒక్క అవకాశమివ్వండి.. మీ సొంతింటి కల నెరవేరుస్తాం.. అని ఎన్నికల ముందు హామీలు గుప్పించిన జగన్మోహన్రెడ్డి.. అధికారంలోకి వచ్చాక ఆ మాటే మరిచారు. -
బ్యాంకు ఖాతాలకు జమకాని నగదు
[ 02-05-2024]
పింఛన్ల పంపిణీలో వైకాపా ప్రభుత్వం పండుటాకులతో రాజకీయ ఆట ఆడుకుంటూ వృద్ధులు, దివ్యాంగులను అష్టకష్టాలు పెడుతోంది. -
రెండో విడత ఈవీఎంల ర్యాండమైజేషన్
[ 02-05-2024]
సాధారణ ఎన్నికల ప్రక్రియలో భాగంగా రెండో విడత ఈవీఎంల ర్యాండమైజేషన్ను కేంద్ర ఎన్నికల పరిశీలకులు నితిన్ సింగ్ బదారియా పర్యవేక్షణలో కలెక్టర్ ఎం.హరినారాయణన్ నిర్వహించారు. -
ఇవేనా ఊళ్లు.. లబ్ధిదారులకు కన్నీళ్లు
[ 02-05-2024]
నవరత్నాలలో భాగంగా పేదలందరికీ ఇళ్లు నిర్మించి ఇస్తామని వైకాపా గత ఎన్నికల ముందు ఆర్భాటంగా ప్రచారం చేసింది. -
వారాంతపు సెలవులకు జగన్ టోపి
[ 02-05-2024]
శాంతి భద్రతలు బాగుండాలన్నా.. వివాదాలు లేకుండా ప్రశాంతంగా ఉండాలన్నా.. సమాజం సుఖసంతోషాలతో ఉండాలన్నా పోలీసులతోనే సాధ్యం. -
అధికార పార్టీ.. ప్రలోభాల ఎర!
[ 02-05-2024]
జిల్లాలో సార్వత్రిక ఎన్నికల తేదీ దగ్గరపడేకొద్దీ అధికార పార్టీ.. ప్రలోభాల పర్వాన్ని ముమ్మరం చేసింది. ఎలాగైనా ఓటర్లను తమవైపు తిప్పుకోవాలనే లక్ష్యంతో అడ్డదారులు తొక్కేందుకు సిద్ధమవుతోంది. -
తాగునీటికి కటకట
[ 02-05-2024]
సిద్ధార్థనగర్ ఆనుకుని పట్టణం నుంచి మురుగు ప్రవహిస్తోంది. అక్కడి బోరు నీరు రంగు మారి వినియోగానికి పనికి రావటంలేదు. -
స్వచ్ఛత మాయం.. రోగాలు ఖాయం
[ 02-05-2024]
ఇంటింటికీ చెత్త సేకరిస్తాం.. పట్టణాన్ని చెత్త రహితంగా చేస్తాం.. ఇదీ పురపాలకు నినాదం.. కానీ ఆచరణలో పాటించడం లేదు.వీధుల్లో చెత్త శుభ్రం చేయడం లేదు.
తాజా వార్తలు (Latest News)
-
మృత్యువుతో గెలిచి.. పదిలో మెరిసి
-
వాట్సప్లో కొత్త ఖాతాల నుంచి సందేశాలు రావిక..?
-
#ఆఫీస్ పికాకింగ్.. కార్పొరేట్ ప్రపంచంలో మరో ట్రెండ్.. ఏమిటిది?
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (02/05/24)
-
‘అద్దె ఇల్లే సో బెటరు’.. కారణం చెప్పిన బాంబే షేవింగ్ కంపెనీ సీఈఓ
-
గూగుల్తో ఇంగ్లిష్ ప్రాక్టీస్.. కొత్త ఏఐ ఫీచర్ను ఎలా వాడాలి?