ఇక ప్రచార హోరు
లోక్సభ ఎన్నికల ప్రచారం ఇక హోరెత్తనుంది. నామినేషన్ల పర్వం ప్రారంభం కావడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు జోరు పెంచేందుకు సిద్ధమయ్యారు.
నేడు భాజపా, భారాస, 22న కాంగ్రెస్
అభ్యర్థుల నామినేషన్లు
పాత కలెక్టరేట్ మైదానంలో బహిరంగ సభ వేదిక ఏర్పాట్లు
ఈనాడు, నిజామాబాద్ : లోక్సభ ఎన్నికల ప్రచారం ఇక హోరెత్తనుంది. నామినేషన్ల పర్వం ప్రారంభం కావడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు జోరు పెంచేందుకు సిద్ధమయ్యారు. నిన్నటి వరకు పార్టీ నాయకులతో అంతర్గత సమావేశాలకే పరిమితమయ్యారు. ఇక నుంచి సభలు, ర్యాలీలు మొదలుకానున్నాయి. భారాస అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ శుక్రవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ సంద]ర్భంగా పాత కలెక్టరేట్ మైదానంలో ఉదయం 10 గంటలకు బహిరంగ సభ నిర్వహణకు ఏర్పాట్లు చేసింది. సభ అనంతరం కలెక్టరేట్కు చేరుకొని నామినేషన్ వేయనున్నారు. మాజీ మంత్రి హరీశ్రావు ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. భాజపా అభ్యర్థి ధర్మపురి అర్వింద్ సైతం శుక్రవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. ధరావత్తు రుసుమును ఆయనకు రైతులు విరాళంగా అందించనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ నెల 25న మరోమారు నామినేషన్ వేయనున్నారు. ఆ రోజు నిర్వహించే బహిరంగ సభకు రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్ హాజరవుతారని చెబుతున్నారు. శుక్ర, శనివారాల్లో కాంగ్రెస్ సన్నాహక సమావేశాలు, 22న జీవన్రెడ్డి నామినేషన్ సందర్భంగా నిర్వహించే కార్నర్ మీటింగ్కు శ్రేణుల సమాయత్తంపై సమీక్షించనున్నారు. జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు పరిశ్రమలశాఖ మంత్రి శ్రీధర్బాబు హాజరయ్యే అవకాశాలున్నాయి.
ముఖ్య నేతలు వస్తేనే సందడి..
ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రచారం ఊపందుకోనుంది. పార్టీలు తమ విధానాలు వివరించి ఓటర్లను తిప్పుకోవాలంటే ముఖ్య నేతల ప్రసంగాలు తప్పనిసరి. వారి సభలతోనే అసలైన రాజకీయ సందడి నెలకొంటుంది. ముఖ్య నేతల పర్యటనలతో నాయకులు, కార్యకర్తల్లో జోష్ వచ్చి అభ్యర్థికి బలం చేకూరుతుంది. ఈ నేపథ్యంలో మూడు ప్రధాన పార్టీల బడా నేతల ప్రచార సభలకు ప్రాధాన్యం ఇవ్వనున్నాయి. ప్రధాన నేతల్లో ఎవరు తన నియోజకవర్గానికి సమయం ఇస్తారో తెలుసుకొనే ప్రయత్నాలు చేస్తున్నారు. సీఎం రేవంత్రెడ్డి నిజామాబాద్, ఆర్మూర్, కోరుట్లలో పర్యటిస్తారని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. భాజపా నేతలు ఉత్తరాదిలో బిజీగా ఉన్న తరుణంలో వచ్చేనెల మొదటి వారంలో బహిరంగ సభలకు అవకాశం ఉందంటున్నారు.భారాస అధినేత కేసీఆర్ బస్సు యాత్రలో రూట్ మ్యాప్ ఖరారు కావాల్సి ఉంది. కేటీఆర్ సైతం ఒక దఫా వస్తారని అంటున్నారు.
కలెక్టరేట్లోకి ఉద్యోగులను తనిఖీ చేసి పంపుతున్న పోలీసులు
తొలి రోజు ఇద్దరే..
నామినేషన్ల ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. తొలిరోజు ఇద్దరు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. జగిత్యాల జిల్లా రాయికల్ మండలానికి చెందిన భుక్యా నందు నాయక్ విద్యార్థుల రాజకీయ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. స్వతంత్ర అభ్యర్థిగా రాపెల్లి సత్యనారాయణ నామపత్రం దాఖలు చేశారు. నోటిఫికేషన్ విడుదలై..నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఆరంభమైన క్రమంలో కలెక్టరేట్ కార్యాలయం వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు. 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. కార్యాలయ ఉద్యోగులను సైతం తనిఖీ చేసి గుర్తింపు కార్డు ఉంటేనే లోనికి అనుమతిస్తున్నారు. రిటర్నింగ్ అధికారి కార్యాలయం నుంచి 200 మీటర్లలోపు గుమిగూడితే చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మిగిలింది పది రోజులే..
[ 02-05-2024]
లోక్సభ ఎన్నికల ప్రచార పర్వానికి ఇంకా పది రోజులే గడువుంది. ఈ నెల 13న పోలింగ్ జరగాల్సి ఉండగా.. రెండు రోజుల ముందుగా 11వ తేదీ సాయంత్రానికే ప్రచారానికి తెరపడనుంది. మూడు ప్రధాన పార్టీలు బహిరంగ సభలు, రోడ్ షోలతో హోరెత్తిస్తున్నాయి. -
కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్
[ 02-05-2024]
నిత్యం ప్రజల్లో ఉండే జీవన్రెడ్డిని ఎంపీగా గెలిపించాలని.. ఈ ప్రాంత అభివృద్ధికి అవసరమైన నిధులు వస్తాయని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. బుధవారం జగిత్యాల జిల్లా కోరుట్ల సమీపంలో నిర్వహించిన జనజాతర సభలో సీఎం ప్రసంగించారు. -
ఐదేళ్లలో పెరిగిన ఓటర్లు 2,19,784 మంది
[ 02-05-2024]
గడిచిన ఐదేళ్ల కాలంలో జిల్లా వ్యాప్తంగా ఓటర్లు పెరిగారు. ఓటు నమోదుకు అధికారులు చేస్తున్న ప్రచారానికి స్పందన కనిపిస్తోంది. ఆరు నియోజకవర్గాల్లో ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఏటా రెండు సార్లు ఓటు నమోదుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పిస్తోంది. -
మెజార్టీ పోటీ
[ 02-05-2024]
లోక్సభ నియోజకవర్గం పరిధి ఎక్కువగా ఉన్నందున ఇంటింటి ప్రచారం సాధ్యంకాని పరిస్థితి. దీంతో కాంగ్రెస్, భారాస, భాజపాలు అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జులపైనే తమ పార్టీ అభ్యర్థులకు మెజార్టీ తెచ్చే బాధ్యతను మోపాయి. -
మతం పేరుతో భావోద్వేగాలు రెచ్చగొడుతున్నారు: ఆచార్య కోదండరాం
[ 02-05-2024]
స్వలాభం కోసం కొందరు మతం పేరిట ప్రజల్లో భావోద్వేగాలు రెచ్చగొడుతున్నారని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ఆచార్య కోదండరాం పేర్కొన్నారు. జిల్లాకేంద్రంలోని కాంగ్రెస్ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన ‘ప్రమాదంలో ప్రజాస్వామ్యం- బహిరంగ చర్చ’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. -
‘కాంగ్రెస్ వాగ్దానాలతో మోసపోయిన అన్నివర్గాలు’
[ 02-05-2024]
మోసపూరిత కాంగ్రెస్, భాజపాలను పార్లమెంటు ఎన్నికల్లో పాతర పెట్టాలని మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి అన్నారు. -
రక్తం కొరత.. రోగులకు వెత
[ 02-05-2024]
‘జిల్లాకేంద్రానికి చెందిన గర్భిణి భవానికి అత్యవసరంగా బి పాజిటివ్ రక్తం అవసరం కాగా.. ప్రభుత్వ ఆసుపత్రిలోని రక్తనిధి కేంద్రాన్ని సంప్రదించింది. అందులో ఆ రక్త విభాగానికి సంబంధించి ఒకే యూనిట్ నిల్వ ఉంది. -
తీరుతున్న వన్యప్రాణుల దాహార్తి
[ 02-05-2024]
కామారెడ్డి జిల్లాలో అటవీ శాఖ చేపట్టన అభివృద్ధి పనులు వన్యప్రాణుల దాహార్తి తీరుస్తున్నాయి. గతంలో వేసవి వచ్చిందంటే నీళ్ల కోసం జనంలోకి వచ్చే అటవీ జంతువులు.. ప్రస్తుతం అటవీ అధికారులు చేపట్టిన శాశ్వత తాగునీటి పథకాలతో వనంలోనే దాహం తీర్చుకుంటున్నాయి. -
సాహస దీపిక
[ 02-05-2024]
విద్యార్థులు కేవలం తరగతి గదికే పరిమితం కాకూడదని.. సాహస క్రీడల్లో పాల్గొంటే జాతీయస్థాయిలో సత్తాచాటవచ్చని నిరూపించారు గిరిరాజ్ కళాశాలకు చెందిన దీపిక. -
అవగాహనతోనే ప్రమాదాల నివారణ
[ 02-05-2024]
విద్యుత్తు ప్రమాదాల వల్ల ఏటా ఆస్తి, ప్రాణ నష్టాలు సంభవిస్తుంటాయి. అప్రమత్తతతోనే ఆపదలను నివారించవచ్చు అంటున్నారు అధికారులు. మే 1 నుంచి 7వ తేదీ వరకు విద్యుత్తు శాఖ ఆధ్వర్యంలో భద్రతా వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. -
జిజ్ఞాస ప్రాజెక్టులో ప్రతిభ
[ 02-05-2024]
హైదరాబాద్లో రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన ‘జిజ్ఞాస- స్టూడెంట్ స్టడీ ప్రాజెక్టు’లు అనే అంశంలో నగరంలోని గిరిరాజ్ ప్రభుత్వ కళాశాల సిబ్బందితో పాటు విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబర్చి రెండు, మూడు స్థానాలు కైవసం చేసుకున్నారని ప్రిన్సిపల్ రామ్మోహన్రెడ్డి తెలిపారు. -
ఎవరికి ఓటేశామో తెలుసుకోవచ్చు
[ 02-05-2024]
లోక్సభ ఎన్నికలు మే 13న జరగనున్నాయి. ఈవీఎంలో ఓటు వేసిన తర్వాత అభ్యర్థికి పడిందో లేదో వీవీప్యాట్ యంత్రంలో ఓటర్లు పరిశీలించవచ్చు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్(ఈవీఎం)లోని ఒక భాగమే ఓటర్ వెరిఫైబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్(వీవీప్యాట్). -
73 ఏళ్లుగా పోలింగ్ కేంద్రం
[ 02-05-2024]
అహింస, సత్యాగ్రహం ఆయుధంగా ఆంగ్లేయులను పారదోలిన మహాత్మా గాంధీ పేరుతో జిల్లా కేంద్రంలో వెలసిన బాపూజీ వచనాలయం పాఠకులకు విజ్ఞాన నేస్తంగా నిలుస్తోంది. ఈ పఠనాలయాన్ని 1951లో ఏర్పాటు చేశారు. -
అభ్యర్థుల తరఫున అన్నీ తామై..
[ 02-05-2024]
లోక్సభ ఎన్నికలకు గడువు సమీపిస్తోంది. ఇప్పటి వరకు ప్రధాన పార్టీల అభ్యర్థులు నియోజకవర్గ, మండల, జిల్లాస్థాయిలో కార్యకర్తల సమావేశాలు నిర్వహించారు. -
లోక్సభ బరిలో నాడు 186.. నేడు 29 మంది
[ 02-05-2024]
నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గానికి 2019లో జరిగిన ఎన్నికల్లో ఏకంగా 186 మంది పోటీ చేయడంతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ప్రధాన పార్టీలు భాజపా, భారాస, కాంగ్రెస్, ఇతర గుర్తింపు పొందిన పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్రులు బరిలో నిలిచారు.
తాజా వార్తలు (Latest News)
-
మృత్యువుతో గెలిచి.. పదిలో మెరిసి
-
వాట్సప్లో కొత్త ఖాతాల నుంచి సందేశాలు రావిక..?
-
#ఆఫీస్ పికాకింగ్.. కార్పొరేట్ ప్రపంచంలో మరో ట్రెండ్.. ఏమిటిది?
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (02/05/24)
-
‘అద్దె ఇల్లే సో బెటరు’.. కారణం చెప్పిన బాంబే షేవింగ్ కంపెనీ సీఈఓ
-
గూగుల్తో ఇంగ్లిష్ ప్రాక్టీస్.. కొత్త ఏఐ ఫీచర్ను ఎలా వాడాలి?