అనుభవజ్ఞులతో కొత్త అభ్యర్థుల ఢీ
నవరంగపూర్ జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో అనుభవజ్ఞులతో కొత్త అభ్యర్థులు పోటీ పడుతున్నారు. జిల్లాలో అన్ని పార్టీలు నూతన అభ్యర్థులను బరిలో నిలపడంతో పోటీ ఎలా ఉండబోతుందోనన్న ఉత్కంఠ నెలకొంది.
నరసింగ్ బొత్ర, హరాబతి గండ్, సోమనాథ్ పూజారి, లిపికా మాఝి, సన్రాజ్ గండ్
నవరంగపూర్, న్యూస్టుడే: నవరంగపూర్ జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో అనుభవజ్ఞులతో కొత్త అభ్యర్థులు పోటీ పడుతున్నారు. జిల్లాలో అన్ని పార్టీలు నూతన అభ్యర్థులను బరిలో నిలపడంతో పోటీ ఎలా ఉండబోతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. నవరంగపూర్ నియోజకవర్గంలో బిజద, భాజపా, కాంగ్రెస్ అభ్యర్థులుగా కౌసల్య ప్రధాని, గౌరీశంకర్ మాఝి, దిలీప్ ప్రధానికి ఆయా పార్టీలు టికెట్ కేటాయించాయి. గౌరీశంకర్ గత ఎన్నికల్లో బిజద అభ్యర్థి సదాశివ్ ప్రధానితో తలపడి ఓటమి చవిచూశారు. ఈసారి ఆ పార్టీ సదాశివ్కు బదులుగా ఆయన భార్య కౌసల్యకు టికెట్ ఇచ్చింది. పదేళ్ల అనుభవం ఉన్న గౌరీతో కౌసల్య, దిలీప్ తలపడనున్నారు.
ఉమ్మర్కోట్లో...
ఉమ్మర్కోట్ నియోజకవర్గంలో బిజద నబీనా నాయక్కు, భాజపా సిటింగ్ ఎమ్మెల్యే నిత్యానంద్ గండ్కు, కాంగ్రెస్ సన్రాజ్గండ్కు టికెట్లు కేటాయించాయి. పదేళ్లపైనే అనుభవం ఉన్న నిత్యానంద్కు మద్దతుదారుల సంఖ్య ఎక్కువగానే ఉంది. ఉమ్మర్కోట్ మాజీ ఎమ్మెల్యే సుభాష్గండ్ భార్య నబీనా గండ్, రాయ్ఘర్ సమితి బిజద అధ్యక్షురాలిగా చేశారు. వీరిద్దరితో కొత్త అభ్యర్థి సన్రాజ్ గండ్ తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
జొరిగావ్లో... 20
జొరిగావ్ నియోజకవర్గంలో బిజద అభ్యర్థి రమేష్చంద్ర మాఝి రాజకీయాల్లో దాదాపు ఇరవయ్యేళ్ల అనుభవజ్ఞుడు. ఎమ్మెల్యేగా, ఎంపీగా పనిచేసిన రాజకీయ యుక్తులు తెలిసిన సీనియర్ నేత. ఆయనకు పోటీగా భాజపా నరసింగ్ బొత్రను, కాంగ్రెస్ హరాబతి గండ్ను బరిలో దించింది. హరాబతి ఆదివాసీల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ప్రజలకు చేరువవుతుండగా, నరసింగ్ తనదైన శైలిలో భాజపా పథకాలు ప్రజలకు గుర్తు చేస్తూ ప్రచారంలో జోరు పెంచారు.
డాబుగావ్లో...
డాబుగావ్ నియోజకవర్గంలో బిజద తరఫున సిటింగ్ ఎమ్మెల్యే మనోహర్ రంధారి మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకునే ప్రయత్నం చేస్తుండగా, నూతన అభ్యర్థులైన సోమ్నాథ్ పూజారి (భాజపా), డా.లిపికామాఝి (కాంగ్రెస్) బరిలో దిగనున్నారు. డాక్టర్ చదివిన లిపికా తండ్రి భుజబల్ మాఝి బాటలో నడుస్తూ ప్రజలకు సేవ చేసేందుకు 2022లో రాజకీయ ప్రస్థానం ఆరంభించింది. మరోవైపు సోమనాథ్ గతంలో జిల్లా పరిషత్ అభ్యర్థిగా గెలిచి ప్రస్తుతం ఎమ్మెల్యే స్థానానికి పోటీ పడనున్నారు. నవరంగపూర్లో బిజద, కాంగ్రెస్ అభ్యర్థులకు, ఉమ్మర్కోట్లో బిజద అభ్యర్థి నబీనాకు వ్యతిరేకత ఎదురైంది. పార్టీ కోసం ఏళ్ల తరబడి కృషి చేస్తున్న వారికి కాకుండా నూతన అభ్యర్థులకు అధిష్ఠానం టికెట్ కేటాయించడంతో పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నవరంగపూర్లో బిజద నేత మంజుల మాఝి, కాంగ్రెస్ నేత దిబాకర్ పూజారి, ఉమ్మర్కోట్లో డా।।సురేష్ డంఖర్ వ్యతిరేకత తెలుపుతూ పార్టీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు భుజబల్ తన కుటుంబంలో నాలుగు టికెట్లు దక్కించుకున్నాడని జిల్లా కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు మున్నా త్రిపాఠి ఆరోపిస్తున్నారు. నాలుగు నియోజకవర్గాల్లో నలుగురు అనుభవంతులతో ఎనిమిది మంది కొత్త అభ్యర్థులు పోటీపడుతుండడం అందిరిలోనూ ఉత్కంఠ నెలకొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘బ్రహ్మపుర’ విజేత ఎవరు?
[ 04-05-2024]
ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రాతినిధ్యం వహిస్తున్న గంజాం జిల్లాలోని బ్రహ్మపుర లోక్సభ స్థానం ప్రతిష్ఠాత్మకమైంది. -
నేడు జయశంకర్, రేపు నడ్డా, ఎల్లుండి ప్రధాని మోదీ రాష్ట్రానికి రాక
[ 04-05-2024]
విదేశాంగ మంత్రి ఎస్.జయశంకర్ శనివారం రెండు రోజుల రాష్ట్ర పర్యటనకు వస్తున్నారు. -
ఉమ్మర్కోట్లో విజయం ఎవరిదో?
[ 04-05-2024]
గత ఐదేళ్ల క్రితం వరకు బిజదకు కంచుకోటైన ఉమ్మర్కోట్ నియోజకవర్గంలో ఈసారి ఎవరు విజయం సాధిస్తారోనని ఉత్కంఠ నెలకొంది. -
కాంగ్రెస్ విజయాన్ని ఏ శక్తి ఆపలేదు: భట్టి
[ 04-05-2024]
కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్రలు చేసి, పేద, బడుగు వర్గాల ప్రజల మనస్సులు దోచిన రాహుల్గాంధీ ప్రధాని కానున్నారని, కాంగ్రెస్ విజయాన్ని ఏ శక్తి ఆపలేదని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. -
సుజాతపై ఈసీ కొరడా
[ 04-05-2024]
మిషన్ శక్తి శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి సుజాత కార్తికేయన్ను ప్రజాసంబంధాలు లేని శాఖకు తక్షణం బదిలీ చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ప్రభుత్వాన్ని ఆదేశించింది. -
బిజదలో చేరిన జనా సామల్
[ 04-05-2024]
ఒడియా సినీనటి, భాజపా నేత జనా సామల్ శుక్రవారం ఆ పార్టీని వీడి బిజదలో చేరారు. -
నీరివ్వరా?.. ఓటు వేయం
[ 04-05-2024]
గుక్కెడు నీటి కోసం ప్రజలు అల్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని రాయగడ సమితి లైలై పంచాయతీ ఖర్జీసాహి గ్రామస్థులు శుక్రవారం కలెక్టర్ కార్యాలయం వద్ద ఖాళీ బిందెలతో నిరసన చేపట్టారు. -
తెలుగులో ప్రచారం
[ 04-05-2024]
ఎన్నికల దగ్గర పడుతుండడంతో ప్రచారాల హోరు పెరిగింది -
చరవాణుల వెలుగులో అంత్యక్రియలు
[ 04-05-2024]
జయపురంలోని జయనగర్ ప్రాంతంలో ఉన్న భూత్నాధ్ శ్మశానంలో విద్యుత్తు దీపాలు లేకపోవడంతో చీకట్లోనే అంత్యక్రియలు జరుపుతున్న పరిస్థితి.
తాజా వార్తలు (Latest News)
-
రాహుల్ గాంధీపై పోస్టు.. వివరణ ఇచ్చిన చెస్ లెజెండ్ కాస్పరోవ్
-
ఆ ‘రెండేళ్ల షరతు’ త్రిష జీవితాన్నే మార్చేసింది.. అదేంటంటే?
-
హైబ్రిడ్ పిచ్ల మీద ఐపీఎల్ మ్యాచ్లు... సరికొత్త ప్రయోగం ఫలిస్తుందా?
-
నడివీధిలో ఆమెను స్తంభానికి కట్టేసి..
-
తాడేపల్లిలో డ్రగ్స్.. గోప్యంగా ఉంచిన అధికారులు!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM