రాష్ట్రానికి మోదీ, రాజ్నాథ్, అమిత్షాల రాక
ప్రధాని నరేంద్రమోదీ ఆదివారం రాత్రి భువనేశ్వర్ చేరుకోనున్నారు. 9 గంటలకు భాజపా అగ్రనేతలతో ఎన్నికల ప్రచార వ్యూహం, ఏర్పాట్లు పర్యవేక్షిస్తారు.
నేడు, రేపు, ఎల్లుండి ప్రచార సభలు
భువనేశ్వర్, న్యూస్టుడే: ప్రధాని నరేంద్రమోదీ ఆదివారం రాత్రి భువనేశ్వర్ చేరుకోనున్నారు. 9 గంటలకు భాజపా అగ్రనేతలతో ఎన్నికల ప్రచార వ్యూహం, ఏర్పాట్లు పర్యవేక్షిస్తారు. రాత్రి రాజ్భవన్లో విడిది చేయనున్న ఆయన సోమవారం ఉదయం 8 గంటలకు పూరీ శ్రీక్షేత్రంలో జగన్నాథుని సన్నిధిలో పూజలు చేస్తారు. తర్వాత బొడొదండోలో రోడ్షో నిర్వహించనున్న మోదీ అనంతరం 10 గంటలకు కటక్, 11.30 గంటలకు అనుగుల్లలో ఏర్పాటయ్యే బహిరంగ సభల్లో ప్రసంగిస్తారు. రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆదివారం ఉదయం భువనేశ్వర్ చేరుకుంటారు. రెఢాఖోల్ (సంబల్పూర్), పాట్నా (కేంఝర్), ఖుర్దాల్లో ఏర్పాటయ్యే భాజపా విజయసంకల్ప ఎన్నికల బహిరంగ సభల్లో ప్రసంగిస్తారు. 21న (మంగళవారం) కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా ఉదయం భువనేశ్వర్ చేరుకుంటారు. సంబల్పూర్, పరజంగి (ఢెంకనాల్), కేంఝర్, నయాగఢ్లలో జరగనున్న బహిరంగ సభల్లో పాల్గొంటారని భాజపా రాష్ట్రశాఖ ఉపాధ్యక్షుడు గోలక్మహాపాత్ర్ శనివారం భువనేశ్వర్లో విలేకరులకు చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నదిలో మునిగి ఒకరు మృతి
[ 02-06-2024]
సిమిలిగుడ సమితికి చెందిన కుందిలి సంతలో ఉన్న నదిలో ఆదివారం ఉదయం స్నానం చేస్తూ నీటిలో మునిగి ఒకరు మృతి చెందారు. -
ఘనంగా ముగిసిన మజ్జిగౌరి ఉత్సవాలు
[ 02-06-2024]
రాయగడ రాణిగూడ ఫారం ప్రాంతంలో 5 రోజులుగా నిర్వహిస్తున్న మజ్జిగౌరి అమ్మవారి ఉత్సవాలు ముగిశాయి. -
పిడుగుపాటుకు ఇద్దరు మృతి
[ 02-06-2024]
గంజాం జిల్లా పట్టపూర్ సమితిలోని గాంధీ కూడలి సమీపంలో పిడుగుపాటుకు గురై ఇద్దరు మృతి చెందారు. -
ఆటో బోల్తా పడి ఒకరు మృతి
[ 02-06-2024]
దమన్ జోడీ - నారాయణ పట్టణం మార్గంలో హతి ముండ కూడలి వద్ద ఆదివారం మధ్యాహ్నం ఆటో బోల్తా పడింది. -
సెల్ టవర్పై నుంచి దూకి యువకుడు ఆత్మహత్య
[ 02-06-2024]
సెల్ టవర్పై నుంచి దూకి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన గజపతి జిల్లా నువాగడ సమితి ఖజురిపోధ ఫండి పరిధిలో ఆదివారం జరిగింది. -
వడదెబ్బకు అధికారి మృతి
[ 02-06-2024]
జిల్లాలోని కొసగుముండా సమితి బాముని పంచాయతీ డీఈవో (డాటా ఎంట్రీ ఆపరేటర్) హరిహర్ జాన్ (35) కన్నుమూశారు. -
వైద్యుడు కిడ్నాప్.. పోలీసుల దర్యాప్తు
[ 02-06-2024]
మల్కాన్గిరి జిల్లా కలిమెల ఆరోగ్య కేంద్రం డాక్టర్ కిడ్నాప్నకు గురైనట్లు సమాచారం తెలిసింది. -
సైకిల్పై వెళ్లి ఓటేసిన కేంద్ర మాజీ మంత్రి
[ 02-06-2024]
పంచాయతీ వార్డు సభ్యుడు కూడా హంగు, ఆర్భాటం ప్రదర్శిస్తున్న ఈ రోజుల్లో కేంద్ర మాజీ మంత్రి, ప్రస్తుత ఎంపీ సైకిల్పై పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటేశారు. -
ముగిసిన పోలింగ్
[ 02-06-2024]
రాష్ట్రంలో చివరిదైన నాలుగో విడత పోలింగ్ ప్రశాంతంగా జరిగినట్లు శనివారం ప్రధాన ఎన్నికల అధికారి (ఎస్ఈసీ) నికుంజ బిహారీ ధొళో భువనేశ్వర్లో పేర్కొన్నా అక్కడక్కడా స్వల్ప ఘటనలు, కొట్లాటలు జరిగాయి. -
కొరాపుట్ సింహాసనం ఎవరికో?
[ 02-06-2024]
కొరాపుట్ లోక్సభ స్థానం ఫలితాలపై అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. కొరాపుట్, రాయగడ జిల్లాలకు చెందిన 7 నియోజకవర్గాలతో కూడిన లోక్సభ స్థానంలో 1957 నుంచి 18 సార్లు జరిగిన ఎన్నికల్లో 16 సార్లు కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందడం విశేషం. -
రవుర్కెలాలో 18కి పెరిగిన మృతుల సంఖ్య
[ 02-06-2024]
రవుర్కెలా ఉక్కు నగరంలో వడదెబ్బ మృతుల సంఖ్య 18కి పెరిగింది. శనివారం చికిత్స పొందుతున్న బాధితుల్లో ఆరుగురు తుదిశ్వాస విడిచినట్లు రవుర్కెలా అదనపు కలెక్టరు (ఏడీఎం) అశుతోష్ కులకర్ణి విలేకరులకు చెప్పారు. -
‘పద్మశ్రీ’ మగుణి కన్నుమూత
[ 02-06-2024]
ప్రాచీనమైన తోలుబొమ్మలాటను విశ్వవ్యాప్తం చేసిన ప్రముఖ కళాకారుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత మగుణి చరణ్ కువర్ (88) శనివారం ఉదయం కేంఝర్లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. -
కొంచెం తీరిక... పుస్తకాలతో తీరేను బడలిక
[ 02-06-2024]
పూర్వాశ్రమంలో రచయితగా గుర్తింపు పొందిన ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ పర్యావరణవేత్త. ఆయన రచించిన పుస్తకాల్లో ‘ది గార్డ్న్ ఆఫ్ లైఫ్’ ఆంగ్ల రచన దేశవిదేశాల్లో పాఠకుల మన్ననందుకుంది. చెట్లు, కాండాలు, బెరళ్లు, లతలు, పుష్పాల్లో ఔషధీయ గుణాలున్నాయని అందులో వివరించారు. -
దోపిడీ ముఠా అరెస్ట్
[ 02-06-2024]
నవరంగపూర్లో జరిగిన చోరీ కేసులో పోలీసులు శనివారం ఓ ముఠాను అరెస్ట్ చేశారు. ఎస్పీ రోహిత్ వర్మా మీడియా సమావేశంలో తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 14వ తేదీన సదరు సమితి దంగరబేజి గ్రామంలో సునీల్ సాహు ఇంట్లో చోరీకి యత్నించి విఫలమయ్యారు. -
అధికారుల నిర్లక్ష్యం.. రోడ్డున పడ్డ కుటుంబం
[ 02-06-2024]
అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఓ కుటుంబం రోడ్డున పడ్డ ఘటన నవరంగపూర్ జిల్లాలో జరిగింది. బాధితుల కథనం మేరకు.. నందహండి సమితి జడబంద గూడ పంచాయతీ ముదులిగూడ గ్రామానికి చెందిన పద్మన్ బిశోయి ఆవాస్ యోజన ఇల్లు కోసం భార్య కనక పేరిట దరఖాస్తు చేసుకున్నారు. -
పోలింగ్ కేంద్రంలో తమలపాకుల అలంకరణ
[ 02-06-2024]
పూరీ జిల్లా కాకట్పూర్ మోడల్ పోలింగ్ కేంద్రాన్ని తమలపాకులతో అలంకరించారు.
తాజా వార్తలు (Latest News)
-
ట్యాంక్బండ్పై ఘనంగా ‘పదేళ్ల పండుగ’ సంబురాలు
-
పుస్తకం పట్టిన దివి.. మేకప్తో శ్రద్ధాదాస్.. వేదిక ప్రమోషన్స్!
-
గురువు పార్టీని కూకటి వేళ్లతో పెకిలించి... ఎవరీ ప్రేమ్ సింగ్ తమాంగ్?
-
మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయం వద్ద భద్రత పెంపు
-
ప్రిన్సెస్ డయానా.. వేలానికి వ్యక్తిగత లేఖలు!
-
బ్రేకింగ్: ఏపీ ఎగ్జిట్ పోల్స్... మై యాక్సిస్ ఇండియాటుడే అంచనాలివే